‘అయ్యప్ప దీక్ష’ దుమారం: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే? – Telangana Police
Hyderabad : తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) లో 'అయ్యప్ప దీక్ష' అంశం తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధారణ కోసం నలుపు రంగు దుస్తులు ధరించడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్కు (SI) ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడం వివాదాస్పదమైంది. దీనిని నిరసిస్తూ గురువారం లక్డికాపూల్లోని డీజీపీ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన (Ayyappa Devotees Protest,)కు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అసలేం జరిగింది?
కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సబ్ ఇన్స్పెక్టర్, తాను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నానని, ఆ సమయంలో యూనిఫామ్కు బదులుగా నలుపు రంగు దుస్తులు ధరించడానికి, గడ్డం పెంచుకోవడానికి, పాదరక్షలు లేకుండా విధులకు హాజరయ్యేందుకు అనుమతి అధికారులను కోరారు. అయితే, దీనిపై స్పందించిన అదనపు డీసీపీ (ఆగ్నేయ) సదరు ఎస్సై అభ్యర్థనను తిరస్క...




