Sarkar Live

Hyderabad

‘అయ్యప్ప దీక్ష’ దుమారం: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే? – Telangana Police
State, Hyderabad

‘అయ్యప్ప దీక్ష’ దుమారం: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే? – Telangana Police

Hyderabad : తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) లో 'అయ్యప్ప దీక్ష' అంశం తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధారణ కోసం నలుపు రంగు దుస్తులు ధరించడానికి ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌కు (SI) ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడం వివాదాస్ప‌ద‌మైంది. దీనిని నిరసిస్తూ గురువారం లక్డికాపూల్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన (Ayyappa Devotees Protest,)కు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలేం జరిగింది? కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, తాను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నానని, ఆ సమయంలో యూనిఫామ్‌కు బదులుగా నలుపు రంగు దుస్తులు ధరించడానికి, గడ్డం పెంచుకోవడానికి, పాదరక్షలు లేకుండా విధులకు హాజరయ్యేందుకు అనుమతి అధికారుల‌ను కోరారు. అయితే, దీనిపై స్పందించిన అదనపు డీసీపీ (ఆగ్నేయ) సదరు ఎస్సై అభ్యర్థనను తిరస్క...
హైదరాబాద్‌ అర్బన్‌ విస్తరణ, విద్యుత్‌ సంస్కరణలు, పరిశ్రమల వృద్ధికి కీలక నిర్ణయాలు – Telangana Cabinet Decisions
State, Hyderabad

హైదరాబాద్‌ అర్బన్‌ విస్తరణ, విద్యుత్‌ సంస్కరణలు, పరిశ్రమల వృద్ధికి కీలక నిర్ణయాలు – Telangana Cabinet Decisions

Telangana Cabinet Decisions | రాష్ట్ర అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కోర్ అర్బన్‌ ప్రాంత విస్తరణ, విద్యుత్‌ సరఫరా బలోపేతం, పరిశ్రమల ప్రోత్సాహం, పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాలపై కేబినెట్‌స‌మావేశంలో విస్తృత చర్చలు జరిగాయి. 27 మున్సిపాలిటీలను GHMC లో విలీనం : ఔటర్ రింగ్ రోడ్ లోపల–బయట ఉన్న, ORR ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్‌ను GHMCలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన GHMC Act, Telangana Municipal Act సవరణలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం.. రాజ‌ధాని నగర విస్తరణ, పునరాభివృద్ధిని క్రమబద్ధీకరించనుంది. రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటు : ప్రస్తుతం ఉన్న NPDCL, SPDCL‌లతో పాటు, వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేష...
Loans | మ‌హిళ‌ల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌
State, Hyderabad

Loans | మ‌హిళ‌ల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

3.5 లక్షల మహిళా సంఘాల‌కు రేపు ₹304 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ Interest Free Loans in Telangana | రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్ద శుభవార్త. మొత్తం 3.50 లక్షల SHG మహిళలకు ₹304 కోట్ల వడ్డీలేని రుణాలను (Interest Free Loans) నవంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, CS రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ములుగు జిల్లా నుంచి పంచాయతీరాజ్ మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ మాట్లాడుతూ.. నవంబర్ 25 ఉదయం 11 గంటలకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రుణాలను పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తాలు నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని, పారదర్శకత కోసం ప్రతి సభ్యురాలికి ...
TIMS Hospitals | రేవంత్‌ రెడ్డివి మాటలు మాత్రమే… పనులు శూన్యం
State, Hyderabad

TIMS Hospitals | రేవంత్‌ రెడ్డివి మాటలు మాత్రమే… పనులు శూన్యం

టిమ్స్ ఆసుపత్రులపై హరీశ్‌రావు ఫైర్: సనత్‌నగర్ టిమ్స్ హాస్పిట‌ల్ (TIMS Hospitals) నెల రోజుల్లోనే ప్రారంభమవుతుందని రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రకటించి నేటితో ఒక నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రకటించిన తేదీకి ఆసుపత్రి తెరుచుకుంటుందా? లేక ఎప్పటిలాగే కొత్త డేట్ పెట్టేసుకుంటారా? అని సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. కోతల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సొంత డ‌ప్పు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొచ్చి సేవ‌లందించ‌డంలో మీరు చేస్తున్న కృషి శూన్యమని సీఎం రేవంత్‌ రెడ్డిని హరీశ్‌రావు విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప మీరు చేస్తున్నదేం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే ఓ సినిమాలో తనికెళ్ల‌ భరణి చెప్పే కవిత్వం లాగ...
Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..
State, Hyderabad

Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..

తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్‌ (Congress)అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జాబితాను విడుదల చేసింది.. స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో కొత్త జాబితా విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. TPCC నూతన అధ్యక్షుల జాబితా : ఆదిలాబాద్: డా. నరేష్ జాదవ్ (Dr. Naresh Jadhav) ఆసిఫాబాద్: శ్రీమతి ఆత్రం సుగుణ (Athram Suguna) భద్రాద్రి కొత్తగూడెం: శ్రీమతి తోట దేవి ప్రసన్న (Thota Devi Prasanna) భువనగిరి: బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) గద్వాల: ఎం. రాజీవ్ రెడ్డి (M. Rajeev Reddy) హన్మకొండ: ఎంగల వెంకట్రామ్ రెడ్డి (Engala Venkat Ram Reddy) హైదరాబాద్: సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా (Syed Khalid Saifullah) జగిత్యాల: గాజెంగి నందయ...
error: Content is protected !!