Sarkar Live

Hyderabad

Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌
State, Hyderabad

Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు ఎగ్జిట్‌ పోల్స్‌ ఊపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం Jubilee Hills Election Result | హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) ఫలితం మరో కొన్ని గంటల్లో తేలనుంది. అధికా కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష‌ బీఆర్‌ఎస్, బీజేపీ నేత‌లు హోరాహోరీగా ప్ర‌చారం చేశాయి. అయితే సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తే, జూబ్లీహిల్స్‌పై జెండా ఎగరేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డింది. బీజేపీ కూడా సైలెంట్‌గా ప్రచారం జరిపి, తామే సర్ప్రైజ్‌ ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. సుమారు నెలరోజుల పాటు మూడు పార్టీలూ తమ టాప్‌ లీడర్లను నియోజకవర్గంలో క‌లియ‌దిరిగారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సాగిన ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా రాజ‌కీయ సెగ రేపింది. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌తో కాంగ్రెస్‌లో ఉత్సాహం అయితే ఎగ్జిట్‌ ...
Exit Polls | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
Hyderabad, State

Exit Polls | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

Jubilee Hills ByElection Exit Polls | తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బీజేపీ మధ్యనే జరిగింది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. ఇక గెలుపెవరిదన్న ప్రశ్నకు సమాధానంగా వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కాంగ్రెస్‌కు బ‌లాన్నిస్తున్నాయి. వివిధ సర్వేల ప్రకారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. చాణక్య స్ట్రాటజీస్‌ సర్వేకాంగ్రెస్‌కు 46%, బీఆర్‌ఎస్‌కు 43%, బీజేపీకి 6% ఓట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. హెచ్‌ఎంఆర్‌ సర్వేకాంగ్రెస్‌కు 48.3%, బీఆర్‌ఎస్‌కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు దక్కుతాయని తెలిపింది. స్మార్ట్‌ పోల్స్‌ సర్వేకాంగ్రెస్‌ 48.2%, బీఆర్‌ఎస్‌ 42.1%, బీజేపీ 7.6%, ...
Hyderabad | రాయదుర్గంలో చదరపు గజానికి ₹3.4 లక్షల రికార్డు ధర
State, Hyderabad

Hyderabad | రాయదుర్గంలో చదరపు గజానికి ₹3.4 లక్షల రికార్డు ధర

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త మైలురాయి Hyderabad Rayadurg Land Price : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో చరిత్ర సృష్టించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) రాయదుర్గ్‌లో నిర్వహించిన భూవేలంలో చదరపు గజానికి ₹3,40,000 ల చొప్పున భారీగా ధర పలికింది. ఈ రేటు, 2017లో నమోదైన మునుపటి రికార్డు ₹88,000 ను బద్దలు కొట్టి, నగరంలోని ప్రాపర్టీ విలువల్లో కొత్త దిశకు దూసుకుపోతోంది. ఈ వేలంలో సుమారు ఒక ఎకరం భూమి విజయవంతంగా అమ్ముడైంది. TSIIC వైస్ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ.. ఈ రికార్డు స్థాయి ధరలు హైదరాబాద్ ఆర్థిక వృద్ధి, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని తెలిపారు. ‘బొటిక్ మల్టీ యూజ్’ ప్రాజెక్టులకు అనువైన ప్లాట్లు అత్యధిక డిమాండ్‌లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ స‌మీపంలో ఉన్న రాయదుర్గ్‌ ప్రస్తుతం నగరంలోని...
ఎన్నిక‌ల‌ అధికారులపై బీఆర్ఎస్ ఆగ్రహం – హరీష్ రావు నేతృత్వంలో ఫిర్యాదు – Jubilee Hills Byelection
Hyderabad

ఎన్నిక‌ల‌ అధికారులపై బీఆర్ఎస్ ఆగ్రహం – హరీష్ రావు నేతృత్వంలో ఫిర్యాదు – Jubilee Hills Byelection

Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి కొన‌సాగుతూనే ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదులు అంద‌జేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోంది. అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి సమర్పించాం. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ని కోరాం. కొంద‌రు పోలీసులు, ఇతర అధికారులు కాంగ్ర‌స్ పార్టీకి తొత్తులుగా మారిపోయారు. ఈ విష‌యాల‌పై సీ విజిల్ యాప్‌లో కూడా ఫిర్యాదులు చేస్తున్న...
Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌
State, Hyderabad

Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై వెంట‌నే నిర్ణయం తీసుకోకపోతే నవంబర్‌ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ కాలేజీలు నిరవధికంగా బంద్ (Colleges Bandh ) చేస్తామ‌ని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్‌ రమేష్‌ బాబు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం రాలేద‌ని తెలిపారు. మొత్తం రూ.1,200 కోట్ల బకాయిల్లో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించింద‌ని చెప్పారు. మిగిలిన రూ.900 కోట్లు దీపావళికి ముందు ఇవ్వాలని కోరామ‌ని కానీ, ఇప్ప‌టివ‌ర‌కు చెల్లించ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.కాగా నవంబర్‌ 2 లోపు ప్రభుత్వం చెల్లింపులపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే, నవంబర్‌ 3 నుంచి రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా...
error: Content is protected !!