Sarkar Live

Hyderabad

Aarogyasri | చేతులు ఎత్తేసిన ఆస్పత్రుల యాజ‌మాన్యాలు.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు బంద్‌
State, Hyderabad

Aarogyasri | చేతులు ఎత్తేసిన ఆస్పత్రుల యాజ‌మాన్యాలు.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు బంద్‌

Hyderabad : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri), ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (JHS) సేవ‌లు బంద్ అయ్యాయి. రాష్ట్ర‌ప్ర‌భుత్వం చెల్లించాల్సిన బ‌కాయిలు రాక‌పోవ‌డంతో ఈ పథకాల కింద చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల (Private hospitals) యాజ‌మాన్యాలు చేతులు ఎత్తేశాయి. త‌మ‌కు బ‌కాయి ఉన్నవేల‌కోట్ల నిధుల‌ను విడుద‌ల చేయ‌మ‌ని అనేక సార్లు విన్న‌వించినా రాష్ట్ర ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెట్ట‌డం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలంగాణ ఆరోగ్య‌శ్రీ నెట్‌వ‌ర్క్ అసోసియేష‌న్ (TANHA) ప్ర‌క‌టించింది. విఫ‌లమైన చ‌ర్చ‌లు.. నిలిచిపోయిన సేవ‌లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) ప్రతినిధులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంగ‌ళ‌వారం చర్చలు జరిపారు. ఇవి సుదీర్ఘంగా కొన‌సాగాయి. అయినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో TANHA ప్ర‌తినిధులు ఓ...
Hyderabad : మాకు ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేదు.. ట్రంప్‌పై రాజ్‌నాథ్ సింగ్ విసుర్లు – Rajnath Singh
State, Hyderabad

Hyderabad : మాకు ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేదు.. ట్రంప్‌పై రాజ్‌నాథ్ సింగ్ విసుర్లు – Rajnath Singh

Rajnath Singh : హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాను జోక్యం చేసుకోవ‌డం వ‌ల్లే భారత్-పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధం ఆగింద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) చేసిన వ్యాఖ్య‌ల‌ను రాజ్‌నాథ్ ఖండించారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదంపై తన సొంత‌ నిర్ణయాలతో చర్యలు తీసుకుంటుంది. ఎవ‌రి జోక్యం అస‌వ‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. భారతదేశంలో హైద‌రాబాద్ విలీన‌మైన సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం లిబ‌రేష‌న్ డే (Hyderabad Liberation Day)ను ప్ర‌తి సంత్స‌రం నిర్వ‌హిస్తోంది. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుక‌లు ఇవాళ ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్య అతిథిగా హాజ‌రైన రాజ్‌నాథ్‌సింగ్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం మాట్లాడుతూ ఇండో-పాక్ సంబంధాలపై కీల‌క...
Security Jobs | ట్రాన్స్‌జెండర్లకు మెట్రో రైళ్ల‌లో సెక్యూరిటీగా విధులు
State, Hyderabad

Security Jobs | ట్రాన్స్‌జెండర్లకు మెట్రో రైళ్ల‌లో సెక్యూరిటీగా విధులు

Security Jobs in Hyderabad Metro | “ట్రాన్స్‌జెండర్లు (Transgenders) ఎందులోనూ తక్కువ వారు కాదు, తలెత్తుకుని బ‌తికే వారని సమాజానికి నిరూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించింది” అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద భిక్షాటన చేసిన వారికి ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్ల‌లో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిందన్నారు.మంగళవారం మంత్రి ఛాంబర్లో 20 మంది ట్రాన్స్‌జెండర్‌లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ వార్డులుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సెక్యూరిటీ గార్డు (Security Jobs) నియామకాల కోసం దాదాపు 300–400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తె...
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో శుభవార్త – లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.3 కోట్లు
State, Hyderabad

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో శుభవార్త – లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.3 కోట్లు

Hyderabad : తెలంగాణలో అమలు అవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Houses) కింద లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తాజా విడతలో 13,841 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.146.30 కోట్లు జమ చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.1435 కోట్ల నిధులను విడుదల చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఇళ్ల నిర్మాణ పురోగతి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 1.29 లక్షల ఇళ్లు నిర్మాణంలో కొనసాగుతున్నాయి. సుమారు 20 వేల ఇళ్లు గోడల దశలో , 8,633 ఇళ్లు పైకప్పు దశలో ఉన్నాయని వెల్లడించారు. అలాగే, ఇప్పటికే పూర్తి అయిన ఇళ్లలో పలువురు లబ్ధిదారులు గృహప్రవేశం కూడా చేసినట్టు తెలిపారు. ప్రతి సోమవారం నగదు జమ విధానం ప్రతి సోమవారం, ఇళ్ల నిర్మాణ (Indiramma Houses ) పురోగతిని బట్టి లబ్ధిదారుల బ్యాంక్ ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్‌? – Jubilee Hills Byelection
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్‌? – Jubilee Hills Byelection

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక (Jubilee Hills Byelection) పూర్తయ్యాకే రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Polls) జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదట్లో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్నాయి. జూన్‌లో హైకోర్టు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ, కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రభుత్వం మరింత గడువు కోరే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని బహిరం...
error: Content is protected !!