Sarkar Live

Hyderabad

అన్నింటా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం – Harish Rao
Hyderabad, State

అన్నింటా కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం – Harish Rao

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్నింటా విఫల‌మైంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్‌రావు (BRS MLA Harish Rao ) అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం, తీగుల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయ‌న ప్రారంభించారు. అలాగే గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంత‌రం హరీశ్ రావు మాట్లాడుతూ.. గ్రామంలో సొంత జాగా కొని, సొంత డ‌బ్బుల‌తో పార్టీ కార్యాల‌యం నిర్మించిన ఘనత తీగుల్ పార్టీ కార్యకర్తలకే దక్కిందని కొనియాడారు. ఇది రాష్ట్రానికి ఆదర్శనీయం. ఈ గ్రామం ఎంతో గొప్పది.2001లో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు స్థలం కొంటే రజతోత్సవం సందర్భంగా బిల్డింగ్ ప్రారంభించుకున్నం. స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు తీగుల్ గ్రామానిది గొప్ప చరిత్ర. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామం నుంచి కుమ్మరి బాలయ్య, కిష్టాపురం శాంతయ్య, ఆంజనేయులు, మల్లారెడ్డి వంటి వారు ఎందరో...
దేశంలోనే డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ – Koheda Integrated Market
Hyderabad, State

దేశంలోనే డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ – Koheda Integrated Market

Koheda Integrated Market | ముఖ్యమంత్రి దేశంలోనే అత్యాధునిక హంగులతో ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కోహెడ వద్ద నిర్మించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు ప్రారంభించింది. సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద మార్కెట్ ను నిర్మించనుంది. అందులో ఆధునిక వసతులతో కూడిన నిర్మాణాలు, కోల్డ్ స్టోరేజ్ లు, షెడ్లు, విశాలమైన రోడ్లు తదితర సౌకర్యాలతో మార్కెట్ ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శుక్రవారం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కోహెడ మార్కెట్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఒక రోల్ మోడల్ మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించారని సిఎస్ ఈసందర్భంగా తెలిపారు. వార...
Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
Hyderabad, State

Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

Hyderabad Fish Prasadam 2025 : ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్షలాది మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో స‌చివాలయంలో చేప ప్రసాదం పంపిణీపై బుధ‌వారం సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు గతేడాది కంటే అదనంగా మరిన్ని ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఈసారి చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను సిద్దం చేసినట్లు మ‌త్స్య‌శాఖ‌ అధికారులు మంత్రికి తెలిపారు. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. క్యూ లైన్ల‌లో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, మహిళలకు వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన...
పంటనష్ట పరిహారం నిధుల విడుదల  – Crop Loss Compensation
State, Hyderabad

పంటనష్ట పరిహారం నిధుల విడుదల – Crop Loss Compensation

Crop Loss Compensation | రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వానలు, అకాలవర్షాలకు పంట నష్టం సంభవించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు వ్యవసాయ శాఖ రైతుల వారీగా పంటనష్టం అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ నష్ట పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు వీలుగా సర్వేకు ఆదేశాలివ్వగా నివేదికలు ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51.528 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల ఎకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. డమైనది. రాష్ట్రవ్యాప్తం...
Special Trains | 44 స్పెషల్‌ ట్రైన్స్‌ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Hyderabad, State

Special Trains | 44 స్పెషల్‌ ట్రైన్స్‌ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వారంత‌పు ప్ర‌త్యేక‌ రైళ్లను నడిపించనున్నట్లు వెల్ల‌డించింది. వేస‌వి సెల‌వులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్న‌ట్లు పేర్కొంది. Special Trains : ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ.. విశాఖపట్నం – బెంగళూరు (08581) మధ్య జూన్‌ ఒకటి నుంచి జూన్‌ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఇక బెంగళూరు-విశాఖపట్నం (08582) మధ్య జూన్‌ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు నడుస్తుందని ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వ వెల్ల‌డించింది. విశాఖపట్నం – తిరుపతి (08547) రైలు జూన్‌ 4 నుంచి జులై 30 వరకు ప్రతి బుధవారం రైలు నడుస్తుంది విశాఖపట్నం-తిరుపతి (08548) రైలు జూన్‌ 5 నుంచి జులై 31 వరకు ప్రతి గురువ...
error: Content is protected !!