Sarkar Live

Hyderabad

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపీఆర్ రెడీ.. – Hyd Metro Phase II
State, Hyderabad

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపీఆర్ రెడీ.. – Hyd Metro Phase II

Hyd Metro Phase II : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-II (బి) కారిడార్‌లైన JBS - మేడ్చల్, JBS - షామీర్‌పేట్, విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPRలు) పూర్తిగా సిద్ధమ‌యయ్యాయి. కొత్త డీపీఆర్ లు మే 8న హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో లిమిటెడ్ (HAML) బోర్డు ఆమోదించిందని మెట్రో రైలు అధికారులు తాజాగా ధృవీకరించారు. ప్రతిపాదిత JBS-షామీర్‌పేట్ మార్గం 22 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో 1.65 కి.మీ అండ‌ర్ గ్రౌండ్ రైల్వే లైన్ కూడా ఉంది. డీపీఆర్‌లు ప్రస్తుతం ప్రభుత్వ సమీక్షలో ఉన్నాయని HAML మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందే వరకు కొన్ని వివరాలు గోప్యంగా ఉండాలని ఆయన స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాల్లో మెట్రో నిర్మాణ అంచనాలు, హైదరాబాద్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా డీపీఆర్‌ల (Hyd Metro Phase II DPRs) ను సమగ్ర...
Hyd Metro | మెట్రో రైలు కొత్త ఛార్జీలపై 10 శాతం తగ్గింపు
Hyderabad

Hyd Metro | మెట్రో రైలు కొత్త ఛార్జీలపై 10 శాతం తగ్గింపు

Hyd Metro | ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్ అండ్ టిఎంఆర్హెచ్ఎల్) మూడు మెట్రో కారిడార్లలోని అన్ని ఛార్జీల జోన్లలో కొత్తగా సవరించిన ఛార్జీలపై 10% తగ్గింపును ప్రకటించింది, ఇది మే 24 నుండి అమల్లోకి రానుంది. మెట్రో కార్యకలాపాలు, నిర్వహణ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఛార్జీల స్థిరీకరణ కమిటీ (FFC) సిఫార్సుల ఆధారంగా ఈ ఛార్జీల సవరణను ప్రవేశపెట్టినట్లు ఒక పత్రికా ప్రకటన తెలిపింది.ప్రయాణీకుల అభిప్రాయాలను జాగ్రత్తగా పరిశీలించి, ఆర్థిక విచ‌క్ష‌ణ‌ను కొనసాగిస్తూ ప్రయాణికులకు కాస్త ఊర‌ట క‌లిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. "మెట్రో కార్యకలాపాల స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఛార్జీల సవరణ చాలా అవసరం అయినప్పటికీ, మా విలువైన ప్రయాణీకులపై ఆర్థిక భారాన్ని తగ్గించాల‌ని నిర్ణ‌యించామ‌ని L&TMRHL MD & CEO KVB రెడ్డి అన్నారు. "మా ప్రయాణీకుల అభిప్రాయం మేర‌కు మే 24 నుం...
Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ధరల వివరాలు ఇవే..
Hyderabad, State

Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ధరల వివరాలు ఇవే..

Hyderabad Metro Fare Revision : మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ షాకిచ్చింది.ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) సిఫార్సులను అనుసరించి హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail) సవరించిన ఛార్జీలను మే 17, 2025 నుండి అమల్లోకి తీసుకొస్తోంది. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ & నిర్వహణ) చట్టం, 2002లోని సెక్షన్ 34 కింద ఏర్పడిన ఈ కమిటీ జనవరి 25, 2023న తన నివేదికను సమర్పించింది. తాజాగా సవరించిన ఛార్జీ (Fare Revision)లను సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడానికి అమలు చేస్తున్నారు. కొత్త ఛార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. Hyderabad Metro : తక్కువ దూరాలకు చార్జీలు 2 కి.మీ వరకు దూరాలకు ఛార్జీ రూ.122 కి.మీ నుంచి ఎక్కువ, 4 కి.మీ వరకు రూ.18;4 కి.మీ నుంచి 6 కి.మీ వరకు ఛార్జీ రూ.306 కి.మీ నుంచి 9 కి.మీ వరకు,ఛార్జీ రూ.409 కి.మీ కంటే ఎక్కువ 12 కి.మీ వరకు ఛార్జీ రూ.50 ఎక్కువ దూరాలకు ధ...
Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు
State, Hyderabad

Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

Bhu bharathi | తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2 నుంచి భూభార‌తి చ‌ట్టం (Bhu bharathi) లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. గ‌త నెల 14న భూభార‌తి చ‌ట్టాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించుకున్నామని, అదేనెల 17 నుంచి 30 వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా రెవెన్యూ స‌ద‌స్సులు (Revenue seminars) నిర్వ‌హించామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆయా మండలాల్లో ఎదురైన అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని జూన్ 2వ తేదీ నుంచి అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. ...
LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు
State, Hyderabad

LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు

LRS Concession | లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ సీమ్‌ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర స‌ర్కారు మ‌రోసారి పొడిగించింది. ఈనెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీ గడువును తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దీనిని ఏప్రిల్‌ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు మరోసారి మే 31వర‌కు రాయితీ అవ‌కాశం క‌ల్పించింది. కాగా ఎల్ఆర్ ఎస్ రాయితీ (LRS concession) పొడిగింపునకు ప‌లు కార‌ణాలు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రాయితీ గడువును ప‌లుమార్లు పొడిగిస్తున్నట్టు ప‌లువురు పేర్కొంటున్నారు. 2020లో ప్రారంభమైన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించ...
error: Content is protected !!