Bus Fire | నల్లగొండలో దగ్ధమైన ప్రైవేట్ బస్సు
Bus Fire in Nalgonda | ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్లపై ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇటీవలే కర్నూలులో వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో 19 మంది సజీవ దహనమైన ఘటన (Kurnool Bus Fire) మరిచిపోకముందే, మళ్లీ ఇలాంటి ఘటనే నల్లగొండలో చోటుచేసుకుంది. ఈసారి విహారి ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ, అందులో ఉన్న ప్రయాణికులు సమయానికి తేరుకొని బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. విహారి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా బస్సు వెనుకభాగంలో మంటలు చెలరేగాయి. బస్సులో పొగలు వ్యాపించడంతో డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై అందరు 29 మంది ప్రయాణికులను వెంటనే కిందకు దింపారు. క్షణాల్లో మంటలు వ్...




