Sarkar Live

Nalgonda

Bus Fire | నల్లగొండలో దగ్ధ‌మైన ప్రైవేట్ బస్సు
Crime, Nalgonda

Bus Fire | నల్లగొండలో దగ్ధ‌మైన ప్రైవేట్ బస్సు

Bus Fire in Nalgonda | ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు రోడ్లపై ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇటీవలే క‌ర్నూలులో వేమురి కావేరి ట్రావెల్స్‌ బస్సు దుర్ఘటనలో 19 మంది సజీవ దహనమైన ఘటన (Kurnool Bus Fire) మరిచిపోకముందే, మళ్లీ ఇలాంటి ఘటనే న‌ల్ల‌గొండ‌లో చోటుచేసుకుంది. ఈసారి విహారి ట్రావెల్స్‌ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ, అందులో ఉన్న ప్రయాణికులు సమయానికి తేరుకొని బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల‌ సమాచారం ప్రకారం.. విహారి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి కందుకూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా బస్సు వెనుకభాగంలో మంటలు చెలరేగాయి. బస్సులో పొగలు వ్యాపించడంతో డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తమై అందరు 29 మంది ప్రయాణికులను వెంటనే కిందకు దింపారు. క్షణాల్లో మంటలు వ్...
Miryalaguda : పెళ్లి రిసెప్ష‌న్‌ను ర‌ద్దు చేసి.. రైతుల‌కు ఆర్థిక సాయం
State, Nalgonda

Miryalaguda : పెళ్లి రిసెప్ష‌న్‌ను ర‌ద్దు చేసి.. రైతుల‌కు ఆర్థిక సాయం

Miryalaguda MLA : ఎంతో ముచ్చ‌ట‌ప‌డి కొడుకు పెళ్లి చేశారాయ‌న‌. బంధుమిత్రులను ఆహ్వానించి అత్యంత వైభ‌వంగా రిసెప్ష‌న్ (marriage reception)ను అరేంజ్ చేద్దామ‌ని ఉన్నా ఆ కోరిక‌ను అంత‌టితోనే తుంచేశారు. రిసెప్ష‌న్‌కు అయ్యే ఖ‌ర్చును ఆదా చేసి రైతుల‌కు యూరియా కోసం సాయం చేశారు. మిర్యాల‌గూడ ఎమ్మెల్యే బ‌త్తుల ల‌క్ష్మారెడ్డి (Miryalaguda MLA Battula Laxma Reddy) చాటుకున్న దాతృత్వం ఇది. ఆర్భాటాలు వ‌ద్ద‌నుకొని అన్న‌దాత‌కు ఆస‌రా ఎమ్మెల్యే బ‌త్తుల లక్ష్మా రెడ్డి త‌న కుమారుడు సాయి ప్రసన్న‌(Sai Prasanna) కు భవ్యమైన వివాహ విందును ఏర్పాటు చేయాలని ముందుగా ప్రణాళికలు వేసుకున్నారు. అయితే.. రైతుల దుర్భర పరిస్థితులు ఆయనను కలచివేశాయి. వర్షాభావం, పెరిగిన ఎరువుల ధరలు, సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన ఆయన, విందు ఖర్చును రైతుల సంక్షేమం కోసం మళ్లించాలని నిర్ణయించుకున్నారు. సీఎం రేవంత్...
Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్క‌డివి?
State, Nalgonda

Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్క‌డివి?

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ మంత్రి టీ హరీశ్ రావు (BRS MLA Harish Rao ) విమర్శించారు. రెండేళ్లుగా యాజమాన్యాలు నిధులు ఇవ్వమని వేడుకుంటున్నా, రేవంత్ సర్కారు మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు.ఈసంద‌ర్భంగా హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది.దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాల్సిన దశ రావడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 16 నుంచి విద్యాస...
Urea Shortage : ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమే..
State, Nalgonda

Urea Shortage : ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమే..

Siddipet : రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత (Urea Shortage )పై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కాలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు (BRS MLA Harish Rao) విమ‌ర్శించారు. వరదలు, యూరియా సమస్యలు పక్కన పెట్టి బురద రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో యూరియా కొరత, వరదల మీద చర్చ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే, మాకు యూరియా, వరదల కంటే బురద రాజకీయాలే ముఖ్యమన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరాబాదరాగా ఆదివారం సభను నిర్వహించి, అర్ధంతరంగా, అసంపూర్తిగా ముగించారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం లేదు, సామర్థ్యం లేదు. Urea Shortage : కాంగ్రెస్ చేత‌గాని పాల‌నతోనే.. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా క...
ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి
Crime, Nalgonda

ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి

Nalgonda : న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు (ACB trap) . ఫిష‌రీస్ కో ఆప‌రేటివ్ సొసైటీలో కొత్త స‌భ్యుల పేర్ల న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరగా, అందుకు మ‌త్స్య‌శాఖ అధికారిణి చ‌రిత రెడ్డి లంచం డిమాండ్ చేశారు. గురువారం బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆమెను కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.go...
error: Content is protected !!