Miryalaguda : పెళ్లి రిసెప్షన్ను రద్దు చేసి.. రైతులకు ఆర్థిక సాయం
                    Miryalaguda MLA : ఎంతో ముచ్చటపడి కొడుకు పెళ్లి చేశారాయన. బంధుమిత్రులను ఆహ్వానించి అత్యంత వైభవంగా రిసెప్షన్ (marriage reception)ను అరేంజ్ చేద్దామని ఉన్నా ఆ కోరికను అంతటితోనే తుంచేశారు. రిసెప్షన్కు అయ్యే ఖర్చును ఆదా చేసి రైతులకు యూరియా కోసం సాయం చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Miryalaguda MLA Battula Laxma Reddy) చాటుకున్న దాతృత్వం ఇది.
ఆర్భాటాలు వద్దనుకొని అన్నదాతకు ఆసరా
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి తన కుమారుడు సాయి ప్రసన్న(Sai Prasanna) కు భవ్యమైన వివాహ విందును ఏర్పాటు చేయాలని ముందుగా ప్రణాళికలు వేసుకున్నారు. అయితే.. రైతుల దుర్భర పరిస్థితులు ఆయనను కలచివేశాయి. వర్షాభావం, పెరిగిన ఎరువుల ధరలు, సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన ఆయన, విందు ఖర్చును రైతుల సంక్షేమం కోసం మళ్లించాలని నిర్ణయించుకున్నారు.
సీఎం రేవంత్...                
                
             
								



