Sarkar Live

State

మారేడుమిల్లి అటవీలో ఎదురుకాల్పులు: అగ్ర మావోయిస్టు హిడ్మా సహా 6 మంది హతం – Maredumilli Encounter
AndhraPradesh

మారేడుమిల్లి అటవీలో ఎదురుకాల్పులు: అగ్ర మావోయిస్టు హిడ్మా సహా 6 మంది హతం – Maredumilli Encounter

Maredumilli Encounter : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దుల్లో (Chhattisgarh Border) మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి కూబింగ్ నిర్వ‌హించారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులు ఎదుర‌ప‌డ‌డంతో పరస్పరం కాల్పులు జరుపుకొన్నారు. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్‌ కొనసాగుతోంద‌ని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా (Hidma), అతని సతీమణి హేమ ఉన్నారు. మరో అగ్రనేత ఆజాద్‌ కూడా మృతిచెందినట్లు స‌మాచారం. . మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మపై రూ.కోటికిపైగా రివార్డు ఉండగా...
Anganwadi Program | ములుగు జిల్లాలో అంగన్వాడీలకు ‘విజయ పాలు’
State, warangal

Anganwadi Program | ములుగు జిల్లాలో అంగన్వాడీలకు ‘విజయ పాలు’

ప్రీస్కూల్ చిన్నారులకు రోజూ 100 మి.లీ పాలు పంపిణీ ప్రారంభం పైలెట్ ప్రాజెక్ట్ గా ములుగు జిల్లా.. దేశంలోనే తొలిసారి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క New Anganwadi Program Started in mulugu | తెలంగాణలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి, పైలెట్ ప్రాజెక్ట్‌గా ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లలకు రోజూ 100 మిల్లీలీటర్ల పాలు పంపిణీ చేయడం మొదలైంది. ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రం లోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజ‌రై మాట్లాడారు. రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి మన రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ముందుకుసాగుతోంద‌ని అన్నారు. వెనుక‌బ‌డిన ములు...
పత్రాలు లేకున్నా స్కూల్స్‌లో అడ్మిష‌న్లు- విద్యాశాఖ ఆదేశాలు – Document-free admission
Career, State

పత్రాలు లేకున్నా స్కూల్స్‌లో అడ్మిష‌న్లు- విద్యాశాఖ ఆదేశాలు – Document-free admission

Document-free admission : రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు మంచి విద్యను పొందే హక్కు కలిగి ఉన్నాడ‌ని అంటోంది ప్ర‌భుత్వం. ఏ కారణం చేతనైనా, చిన్నారులు విద్యకు దూరం కావ‌ద్ద‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆధార్ కార్డ్ (Aadhar not mandatory) లేదా జనన సర్టిఫికెట్ (Birth certificate not needed) లాంటి ప‌త్రాలు లేకున్నా పిల్లలను ప్ర‌భుత్వ‌, ప్రైవేటు స్కూళ్లలో చేర్చుకోవాల‌ని (Document-free admission) యాజ‌మాన్యాల‌కు (Education Department order) ఆదేశాలు జారీ చేసింది. పత్రాలు లేవని చెప్పి ప్రవేశం నిరాకరించొద్దు చాలా స్కూళ్లలో… ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ పిల్లలకు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, TC వంటి పత్రాలు లేకపోతే అడ్మిషన్ (:(School admissions) ఇవ్వడం లేదు. దీని వల్ల ఎక్కువగా వలస కూలీలు (Migrant workers’ children), నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, రో...
BC Reservations : పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు- రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్
State

BC Reservations : పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు- రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్

BC Reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లీ చర్చ వేడెక్కింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీసీలకు 42% రిజర్వేషన్లు (42% Reservation) కేటాయించి, ఆ రిజర్వేషన్లను పార్టీ పరంగానే అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లే ఆలోచన జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం నుంచి కూడా ఇది సాధ్యమేనన్న సంకేతాలు వచ్చాయి. అయితే మరో వైపు బీసీ సంఘాలు మాత్రం దీన్ని పాక్షిక నిర్ణయంగానే చూస్తున్నాయి. తాము కోరుకున్నది పార్టీ ప్రాతిపదికపై కాదని, చట్టపరమైన రిజర్వేషన్లు అమ‌లు చేయాల‌ని అంటున్నాయి. చ‌ట్టప‌ర‌మైన రిజ‌ర్వేషన్లు కావాలంటున్న సంఘాలు రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేయాల‌ని బీసీ సంఘా...
Bihar Election Results : మ‌ళ్లీ సీఎంగా నితీష్‌కుమార్‌- బిహార్ ఎన్నికల్లో NDA ఘ‌న విజ‌యం!
State

Bihar Election Results : మ‌ళ్లీ సీఎంగా నితీష్‌కుమార్‌- బిహార్ ఎన్నికల్లో NDA ఘ‌న విజ‌యం!

Bihar Election Results : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతున్నాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (The National Democratic Alliance (NDA) విజ‌యం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల్లో 204 స్థానాల్లో NDA ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో NDA పున‌ర్‌వైభ‌వం దిశ‌గా న‌డుస్తోంద‌ని తెలుస్తోంది. నితీష్ కుమార్ (Nitish Kumar) మ‌రోసారి సీఎం (Chief Minister) కానున్నారనే సంకేతాలు అందుతున్నాయి. వ‌రుస‌గా ఐదోసారి ఆయ‌న ముఖ్య‌మంత్రి పీఠం ఎక్క‌బోతున్నారని బిహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు (Bihar Election Results) చెబుతున్నాయి. బిహార్‌లో ఇప్పటి వరకు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా నితీష్ రికార్డు సృష్టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. Bihar Election Results : 2020 ఎన్నిక‌ల‌ కంటే మెరుగైన ఫ‌లితాలు సాయంత్రం 6 గంటల సమయానికి వచ్చిన ట్రెండ్స్ ప్రకారం 2020 ...
error: Content is protected !!