Sarkar Live

State

Tirumala Stampede : తిరుమలలో తీవ్ర విషాదం.. క్యూ లైన్లో తొక్కిసలాట, నలుగురు మృతి
State

Tirumala Stampede : తిరుమలలో తీవ్ర విషాదం.. క్యూ లైన్లో తొక్కిసలాట, నలుగురు మృతి

Tirumala Stampede : తిరుమలలో వేంకటేశ్వరస్వామిని వైకుంఠద్వార దర్శనం చేసుకునేందుకు టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు రద్దీగా మార‌డంతో పద్మావతిపురం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో మల్లిక అనే మహిళా భక్తురాలితో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన భక్తురాలు సేలంకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. Tirumala Stampede : దర్శనం కోసం వచ్చి.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కోసం తిరుపతిలో పలుచోట్ల టికెట్ల కేంద్రాల వద్ద పెద్ద‌ సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి నిరీక్షిస్తున్నారు. అయితే బైరాగి పట్టిడ పార్కు వద్ద క్యూలోకి భక్తులను అనుమతించిన వెంటనే భక్తుల మధ్య‌ తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో కొంద‌రు అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాసం వద్ద తొక్కిసలాట జరిగగా అక్క‌డ‌ మల్లిక అనే మహిళతో పాటు మరో ముగ్గురు...
Sankranti Festival : సంక్రాంతికి హన్మకొండ-ఉప్పల్ మధ్య 660 ప్రత్యేక బస్సులు
State

Sankranti Festival : సంక్రాంతికి హన్మకొండ-ఉప్పల్ మధ్య 660 ప్రత్యేక బస్సులు

Hanamkonda : సంక్రాంతి సెల‌వులను (Sankranti Festival ) సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ ప్ర‌త్యేక‌ చ‌ర్య‌లు చేపట్టింది. పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు టీజీఎస్‌ఆర్‌టీసీ హన్మకొండ-ఉప్పల్ మధ్య 660 ప్రత్యేక బస్సులను నడపనుంది. అందుబాటులోకి ఎల‌క్ట్రిక్ బ‌స్సులు వరంగల్ రీజినల్ మేనేజర్ (Warangal RTC RM) డి.విజయభాను తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం ఉప్పల్-హన్మకొండ మార్గంలో కూడా నడుపుతామని వెల్ల‌డించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రధాన బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు దిశానిర్దేశం చేసేందుకు సూపర్ వైజర్లను నియమించారు. Sankranti Festival : బస్ స్టాపుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు సంక్రాంతి పర్వదినం (Sankranti Festival) సందర్భంగ...
Telangana Jails : 2024లో తెలంగాణ జైళ్లలకు 41,138 మంది ఖైదీలు..
State

Telangana Jails : 2024లో తెలంగాణ జైళ్లలకు 41,138 మంది ఖైదీలు..

Telangana Jails : తెలంగాణలోని వివిధ జైళ్లలకు 2024వ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 2875 మంది మహిళలతో సహా 41,138 మంది ఖైదీలను తరలించారు. వివిధ జైళ్లలో చేరిన వారిలో 30,153 మంది అండర్‌ట్రయిల్‌లు ఉన్నారు. ఎన్‌డిపిఎస్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత జైళ్లలో చేరిన ఖైదీల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఇందులో 312 మంది మహిళలు సహా 6311 మంది ఉన్నారు. Telangana Jails : ఖైదీల్లో పరివర్తనకు చర్యలు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) సౌమ్య మిశ్రా మాట్లాడుతూ ఖైదీలను సంస్కరించి వారిని సమాజంతో కలిపేసేందుకు జైళ్ల శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. జైళ్ల శాఖ చిన్న పరిశ్రమలను నడుపుతోందని, ఇక్కడ ఖైదీలు వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్నారని, తద్వారా విడుదలైన తర్వాత వారు కొంత పని పొంది జీవనోపాధి పొందుతారని ఆమె అన్నారు. తెలంగాణ జైళ్ల (Telangana Jails)లో మాజీ ఖైదీలు పనిచేస్తున్న రాష్ట్రంలోని వ...
One Nation One Election : జ‌మిలి ఎన్నిక‌లు.. పార్లమెంటరీ కమిటీ కీల‌క‌ సమావేశం
State

One Nation One Election : జ‌మిలి ఎన్నిక‌లు.. పార్లమెంటరీ కమిటీ కీల‌క‌ సమావేశం

జ‌మిలి ఎన్నిక‌లు (One Nation One Election) బిల్లుల‌ను ప‌రిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee) తొలి స‌మావేశం ఈ రోజు జ‌రిగింది. ఈ అంశంపై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. కేంద్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యాన్ని బీజేపీ (BJP) స‌భ్యులు స‌మ‌ర్థించ‌గా ప్ర‌తిప‌క్షాల నేత‌లు వ్య‌తిరేకించారు. ఈ క్ర‌మంలో రెండు ప‌క్షాల వాద‌న‌ల‌ను పార్ల‌మెంట‌రీ క‌మిటీ (JPC) రికార్డు చేసింది. One Nation One Electionపై వాడీవేడి చ‌ర్చ‌ బీజేపీ ఎంపీ, కేంద్ర న్యాయ శాఖ మాజీ స‌హాయ మంత్రి పి.పి. చౌదరి నేతృత్వంలో 39 మంది సభ్యుల కమిటీ స‌మావేశమైంది. వీరిలో ప్రాధాన పార్టీల ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా, జేడీయూ నుంచి సంజయ్ ఝా, శివసేన నుంచి శ్రీ‌కాంత్ షిండే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ హాజ‌ర‌య్యారు. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ అ...
ISRO : ఇస్రో కొత్త చీఫ్ గా నియమితులవుతున్న  వి.నారాయ‌ణ్ ఎవ‌రు?
State

ISRO : ఇస్రో కొత్త చీఫ్ గా నియమితులవుతున్న వి.నారాయ‌ణ్ ఎవ‌రు?

ISRO New Chief : ఇస్రో కొత్త చీఫ్‌గా డాక్టర్ వీ నారాయణన్ (Dr V Narayanan) నియమితులయ్యారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తదుపరి ఛైర్మన్‌గా డిఆర్‌వి నారాయణన్‌ నియమితులైనట్లు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ప్రస్తుత చీఫ్ గా ఉన్న సోమనాథ్ (Somnath) నుంచి జనవరి 14న డాక్టర్ నారాయణన్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఆయన పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది. నారాయ‌ణ‌న్‌ ప్రస్తుతం ఇస్రోలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయ‌న అదనంగా LPSC-IPRC కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ - స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. " వి. నారాయణన్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ గా వలియమల అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, స్పేస్ కమీషన్ ఛైర్మన్‌గా 14.01.2025 నుంచి రెండు సంవత్సరాల పాటు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.నివ...
error: Content is protected !!