Fake Currency : హుండీలో భారీగా నకిలీ నోట్లు.. ఆలయ కమిటీ షాక్
Fake Currency in Hundi : ఓ భక్తుడు అతి తెలివిని ప్రదర్శించాడు. హుండీలో నకిలీ కరెన్సీ నోట్లు వేసి మొక్కులు తీర్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) గాంధారి మండలం (Gandhari mandal)లో ఈ ఘటన చోటుచేసుకుంది. చాద్మల్ తండా ( Chadmal Thanda)లోని లచ్చమ్మ ఆలయంలో సంక్రాంతి వేడుకల అనంతరం హుండీలను తెరిచి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కిస్తుండగా ఇది వెలుగులోకి వచ్చింది. హుండీలో రూ. 500 నకిలీ నోట్ల (Fake Currency)ను ఆలయ కమిటీ సభ్యులు కనుగొన్నారు. వీటిని లెక్కిస్తే రూ. కోటి ఉన్నట్లు తేలింది.
డబ్బులు లెక్కిస్తుండగా…
గ్రామస్థులకు లచ్చమ్మ ఆలయ కమిటీ తక్కువ వడ్డీతో రుణాలు అందించే సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ ప్రదేశంలో భక్తులు భక్తిపూర్వకంగా భారీగా విరాళాలు అందజేస్తారు. ఎప్పటిలాగే ఆలయ హుండీ నుంచి సేకరించిన డబ్బును గ్రామస్థులకు రుణంగా ఇచ్చారు. ఈ క్రమంలో పలువుర...




