Sircilla : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. కాపాడిన పోలీసులు
Sircilla Kidnap Case : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ సిరిసిల్ల (Sircilla) జిల్లాలో కలకలం రేపింది. వేములవాడ రాజన్న సన్నధిలో డిసెంబరు 23న ఓ పాప కిడ్నాప్నకు గురికాగా పోలీసులు ఎంతో శ్రమకోర్చి కాపాడారు. నిందితులైన ముగ్గురు మహిళలను సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ ఈ రోజు మధ్యాహ్నం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
జగిత్యాల జిల్లా కోడిమియాల్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగరాపు మధు, లాస్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లాస్య మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల ఆమె తన భర్తతో వేరుగా ఉంటోంది. ఇటీవల తన పిల్లలతో కలిసి వేములవాడ (Vemulawada)లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి (Sri Rajarajeshwara Swamy temple) లాస్య వెళ్లింది.
పరిచయమైన మహబూబ్నగర్ మహిళలు
లాస్య వేములవాడలో ఉండగా మహబూబాబాద్ (Mahabubabad)కు చెందిన శ్రీరామోజి వ...




