Sarkar Live

State

Chandrababu Naidu | ధ‌నిక దేశంగా భార‌త్.. 2047 కల్లా సాధ్యం
State

Chandrababu Naidu | ధ‌నిక దేశంగా భార‌త్.. 2047 కల్లా సాధ్యం

Chandrababu Naidu On Visksit Bharat | భార‌త‌దేశం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంద‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని కొనియాడారు. దీంతో 2047 నాటికి అభివృద్ధి చెంది ధనిక‌ దేశంగా భార‌త్ ఖ్యాతిని సంపాదించుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కేంద్ర బ‌డ్జెట్ భేష్ ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు కోసం ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు అక్క‌డి మీడియాతో మాట్లాడ‌టంతోపాటు ప‌లు కార్య‌క్ర‌మాల్లో ప్రసంగించారు. 2025 కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)ను ఆయన అభినందించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (MSMEs), గ్రామీణ అభివృద్ధి, పెట్టుబడి విధానాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింద‌ని, దీని ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. పన్ను మినహాయింపు పరిమ...
KTR | ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంకు కేటీఆర్.. విచార‌ణ వాయిదా
State

KTR | ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంకు కేటీఆర్.. విచార‌ణ వాయిదా

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR ) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ (Congress Party)లో చేరిన నేపథ్యంలో వీరిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. కేటీఆర్‌ వేసిన పిటిషన్‌పై ఈ రోజు (సోమవారం) సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో విచార‌ణ ఇలా.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను విచారించాల‌ని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం నిర్ణయించింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి క...
MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఈరోజు నుంచే నామినేషన్లు షురూ
State

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఈరోజు నుంచే నామినేషన్లు షురూ

MLC Elections In Telangana : తెలంగాణ‌లో రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో సోమ‌వారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. 11వ‌తేదీన న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఈనెల‌ 13న సాయంత్రం 3 గంటల వరకు తుది గ‌డువు ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అదే రోజు ప్రకటిస్తారు. ఇక పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 27న జరుగుతుంది. వొచ్చేనెల 3న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల (Telangana MLC Elections) నేప‌థ్యంలో ఆయా జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. MLC Elections Schedule : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదీ.. నామినేషన్ ప్రక్రియ: ఫిబ్రవ...
Delhi Elections | ఢిల్లీకి చంద్ర‌బాబు.. బీజేపీకి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం
State

Delhi Elections | ఢిల్లీకి చంద్ర‌బాబు.. బీజేపీకి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం

Delhi Elections 2025 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu) ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. అక్క‌డ జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (Delhi Assembly elections) భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులకు మద్దతుగా ఆయ‌న‌ ప్రచారం చేయ‌నున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బాబు బ‌య‌ల్దేరారు. ఎన్డీయేలో టీడీపీ ప్రాముఖ్యత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (NDA)లో తెలుగుదేశం పార్టీ (TDP) రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఈ పార్టీ 16 గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్డీయే వ్యూహాన్ని మరింత బలపరిచేందుకు ఢిల్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయ‌న ప్రచారం చేయ‌నున్నారు. తెలుగు వారి మ‌ద్ద‌తు కోసం చంద్ర‌బాబు ప్ర‌చారం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ వంటి ప్రాంతా...
RTC Tickets in WhatsApp | వాట్సాప్ ద్వారా టికెట్… ప్ర‌యాణికుల‌కు బిగ్ రిలీఫ్‌
State

RTC Tickets in WhatsApp | వాట్సాప్ ద్వారా టికెట్… ప్ర‌యాణికుల‌కు బిగ్ రిలీఫ్‌

RTC Tickets in WhatsApp : పౌర‌సేవ‌ల్లో సాంకేతికత‌ను విరివిగా వినియోగంలోకి తెస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం (Andhra Pradesh Government) కొత్త‌గా మ‌రో విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. వాట్సాప్ ద్వారా ఆర్టీసీ బ‌స్సు టికెట్‌ను బుక్ చేసుకొనే సౌల‌భ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్ర‌యాణికులు బ‌స్సును సుల‌భంగా బుక్ చేసుకొని వేగ‌వంత సేవ‌లు పొందొచ్చు. ఇప్పటి వరకు బస్సు టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్ర‌యాణికులు ఆర్టీసీ వెబ్‌సైట్‌ను వినియోగించే వారు. లేదా టికెట్ కౌంటర్ వ‌ద్ద‌కు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఈ కొత్త సౌక‌ర్యం ద్వారా మొబైల్‌లో ఉన్న WhatsApp యాప్ ద్వారానే టికెట్ బుక్ చేసుకోవచ్చు. RTC Tickets in WhatsApp : ప్రయాణికులకు పెద్ద ఊర‌ట‌ వాట్సాప్ ద్వారా ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకొనేందుకు ఏపీ ప్ర‌భుత్వం కొత్త సేవల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డంతో ప్రయాణికులకు (Passengers) పెద్ద ఊరట ల‌భ...
error: Content is protected !!