Sarkar Live

State

Formula E Car Case : ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట
State

Formula E Car Case : ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట

Formula E Car Case | మాజీ మంత్రి కె.తార‌క రామారావు (KT Rama rao)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేస్ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని కేటీఆర్ స‌మ‌ర్పించిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై హైకోర్టులో శుక్ర‌వారం విచారణ జరిగింది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. మ‌రోవైపు కేటీఆర్‌పై ఏసీబీ(ACB) నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవ‌చ్చని పేర్కొంది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు (High Court ) ఈనెల 27కి వాయిదా వేసింది. అయితే ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి కోరారు. కేటీఆర్‌ ‌తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ ‌న్యాయవాది సుందరం ప్రభాకర్‌రావు, గండ్ర మోహ...
Hyderabad Tourism |  హైద‌రాబాద్‌లో మరో ప‌ర్యాట‌క కేంద్రం… త్వరలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హం
State

Hyderabad Tourism | హైద‌రాబాద్‌లో మరో ప‌ర్యాట‌క కేంద్రం… త్వరలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హం

Hyderabad Tourism|  హైద‌రాబాద్‌లో మ‌రో ప‌ర్యాట‌క కేంద్రం ఆవిర్భ‌వించ‌నుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్య‌వస్థాప‌కుడు నంద‌మూరి తారక రామారావు 100 అడుగుల స్టాచ్యూ (NTR Statue) ఏర్పాటు కానుంది. మ‌హాన‌టుడుగానే కాకుండా రాజ‌కీయ నాయకుడిగా ప్ర‌జ‌ల గుండెలో చెర‌గ‌ని ముద్ర వేసిన ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao) గౌర‌వార్థం ఆయ‌న భారీ విగ్ర‌హాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించాల‌నే ప్ర‌తిపాద‌నను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదించారు. విగ్రహం ఎక్క‌డంటే... ఎన్టీఆర్ సాహిత్య క‌మిటీ స‌భ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని క‌లిశారు. ఆయ‌న కుమారుడు మోహ‌న‌కృష్ణ‌, క‌మిటీ అధ్య‌క్షుడు టి.డి.జ‌నార్ద‌న్‌, స‌భ్యుడు మ‌ధుసూద‌న‌రాజు సీఎంతో భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసే విష‌యంపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. విగ్ర‌హం ఏ...
Hydra News | జోరు పెంచిన హైడ్రా.. హైద‌రాబాద్‌లో మళ్లీ కూల్చివేత‌లు
State

Hydra News | జోరు పెంచిన హైడ్రా.. హైద‌రాబాద్‌లో మళ్లీ కూల్చివేత‌లు

Hydra News : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) త‌న‌ జోరును పెంచింది. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌ల‌ను ముమ్మ‌రం చేసింది. తాజాగా హైద‌రాబాద్‌లోని మణికొండ మునిసిపాలిటీ (Manikonda Municipality) పరిధిలోని  అనురాగ్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్ ప్రాప‌ర్టీలో ఉన్న‌ దుకాణ స‌ముదాయాన్ని నేల‌మ‌ట్టం చేసింది. దీంతో నిర్వాసితులు, అధికారుల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకొని తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది.  అల్కాపురి కాలనీ (Alkapuri Colony)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కమర్షియల్‌ షెట్టర్స్‌ (Commercial shutters)ను అధికారులు తొలగించారు అనుమ‌తులు ఉన్నాయి : నిర్వాసితులు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా, పండ్లు, కూరగాయల దుకాణాలను తొలగించేందుకు హైడ్రా ఉపక్ర‌మించింది. దీంతో షాపు య‌జ‌మానులు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌మ వ‌ద్ద అన్ని ర‌కాల అనున‌మతులు ఉన్నాయ‌ని...
Bhu Bharati | కొత్త ఆర్వోఆర్ బిల్లు.. ‘భూ భారతి’ ప్రత్యేకతలివే..
State

Bhu Bharati | కొత్త ఆర్వోఆర్ బిల్లు.. ‘భూ భారతి’ ప్రత్యేకతలివే..

Bhu Bharati : భూముల రికార్డుల‌ను ప‌టిష్ట ప‌ర్చ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ స‌ర్కారు న‌డుం బిగించింది. భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు శ్రీ‌కారం చుట్టింది. ధ‌ర‌ణి స్థానంలో ‘భూ భారతి’ని రూపొందించి. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కొత్త ఆర్వోఆర్ (రివెన్యూ రికార్డులు) బిల్లులో అనేక కీలక అంశాలు ఉన్నాయ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌కటించారు. Bhu Bharati Bill కొత్త చట్టం లక్ష్యాలు భూభార‌తి అనే కొత్త ఆర్వోఆర్ చట్టం ద్వారా పార్ట్-బీ కింద 18 లక్షల ఎకరాల భూముల సమస్యలకు పరిష్కారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ కంఠం భూములు, ఆబాదీ భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. చట్టంలోని తప్పుల పట్ల అప్పీల్‌కు కూడా అవ‌కాశం క‌ల్పించింది. ధరణిలోని 33 మాడ్యూల్స్‌తో పరిష్కరించలేని సమస్యలను భూ భారతిలో ఆరు మాడ్యూల్స్‌తో సులభతరం చేయ‌నుంది...
Cancer Vaccine |  ఎన్నాళ్లకెన్నాళ్లకు.. క్యాన్స‌ర్ రోగులకు భారీ ఊరట! ర‌ష్యా కొత్త వ్యాక్సిన్ వస్తోంది..
State

Cancer Vaccine | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. క్యాన్స‌ర్ రోగులకు భారీ ఊరట! ర‌ష్యా కొత్త వ్యాక్సిన్ వస్తోంది..

Cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ మార్కెట్‌లోకి త్వరలో రానుంది. ర‌ష్యా దీన్ని రూపొందించింది. కొత్త సంవ‌త్స‌రం ఆరంభంలోనే ఈ వ్యాక్సిన్‌ను లాంచ్ చేయ‌నుంది. ఈ మేర‌క‌కు ఆ దేశ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సంకేతాలు ఇచ్చారు. తమ దేశం క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంద‌ని, ఇది తుది ద‌శకు చేరుకుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాతే అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్స‌ర్ ఒక‌టి. ఇది వేగంగా విస్త‌రిస్తోంది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేయ‌డం త‌ప్ప దీని బారి నుంచి బ‌య‌ట ప‌డానికి క‌చ్చిత‌మైన చికిత్స లేదు. అయితే.. ఈ విష‌యంలో ర‌ష్యా పురోగ‌తిని సాధించింది. క్యాన్స‌ర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ఆ వ్యాధిగ్ర‌స్థుల‌కు అందుబాటులోకి తెస్తోంది. ఈ వ్యాక్సిన్ రోగులకు చికిత్స అందించడానికే ఉపయోగపడుతుందన...
error: Content is protected !!