Sarkar Live

State

Telangana Assembly Sessions | అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు..
State

Telangana Assembly Sessions | అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు..

Telangana Assembly Sessions : తెలంగాణ శాస‌న స‌భ శీతాకాల సమావేశాలు డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి మొద‌లుకానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. డిసెంబర్‌ 9న ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమ‌వుతాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. కాగా ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం త‌న‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సమావేశాల్లో పలు కీలక చట్టాలపై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు, కుల గ‌ణ‌న‌, మూసి ప్ర‌క్షాళ‌న‌, నూతన ఆర్ఓఆర్ చట్టం, బీసీ రిజర్వేషన్ తోపాటుపలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నట్లు స‌మాచారం. కాగా సంక్రాంతి పండుగ‌ తర్వాత రైతు భరోసా డ‌బ్బులు రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు మంత్రులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే , దీనికి సంబంధించిన...
నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్.. ఇందిర‌మ్మ ఇళ్ల ఎంపిక కోసం కొత్త యాప్‌..
State

నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్.. ఇందిర‌మ్మ ఇళ్ల ఎంపిక కోసం కొత్త యాప్‌..

Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన‌ మొబైల్ యాప్ ను స‌చివాల‌యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ అనే విధంగా రెండో వసంతంలోకి అడుగుపెడుతున్నామ‌ని అన్నారు. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల.. ఆ పేదల కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఆనాడే కృషి చేశారి గుర్తు చేశారు. వ్యవసాయ భూమి పేదల ఆత్మగౌరవమ‌ని గుర్తించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకువ‌చ్చి పేదలకు భూములను పంచార‌ని చెప్పారు. తెలంగాణలోనే దాదాపు 35 లక్షల ఎకరాల భూమిని ఇందిరా గాంధీ పంపిణీ చేశార‌ని తెలిపారు. రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ... ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పారు. రూ.4వేలతో మొదలైన ఈ పథకం వైఎస్ హయాం వరకు రూ.లక్షా 21వేలకు చేరుకుంద‌ని త‌మ‌ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక దీనిని 5లక్షల రూపాయ‌ల‌కు పెంచింద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ల...
Tharmal Power Plants | రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు
State

Tharmal Power Plants | రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు

Ramagundam | పెద్దప‌ల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు (Tharmal Power Plants ) నిర్మిస్తామ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ప్ర‌క‌టించారు. ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. బుధవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌చ్చిన 11 నెలలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామ‌ని తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశామ‌ని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల‌కు వడ్డీలు కడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామ‌న్నారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో వ‌రి ధాన్యం ఉత్పత్తికి కృషి చేశామని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార...
Google | హైద‌రాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్
State

Google | హైద‌రాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్

Google  | ప్ర‌ఖ్యాత టెక్ దిగ్గ‌జం గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని తొలి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)) ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ స‌న్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయ‌బోయే గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐద‌వది. ఏషియా పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో అతిపెద్ద‌ సెంటర్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఒక‌ ప్రత్యేకమైన అంతర్జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ హబ్‌. ఇది హై సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయ‌నుంది. అత్యాధునిక పరిశోధన, ఏఐ ఆధారిత భద్రత, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకారం అందించే వేదికగా నిలవ‌నుంది. దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, యువ‌త‌కు ఉపాధి పెంచడం, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించేందుకు ఈ సెంట...
ACB | రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ మెరుపు దాడులు
State

ACB | రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ మెరుపు దాడులు

  ACB | తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఏసిబి అధికారులు చేసిన తనిఖీల్లో పలు చెక్ పోస్టుల్లో లెక్కల్లో చూపని సొమ్ము బయటపడింది. ఆదిలాబాద్‌లోని భోరజ్ చెక్‌పోస్టు, నల్గొండలోని చెక్‌పోస్టు, అలంపూర్ చెక్‌పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు చేశారు. కాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో ఆక‌స్మిక‌ దాడులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. పలు చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. లెక్కలు చూపని నగదును ఏసీబీ అధికారుల బృందాలు సీజ్ చేసిన‌ట్లు స‌మాచారం. నల్గొండ జిల్లా విష్ణుపురం చెక్‌పోస్టులో రూ. 86,600, భోర‌జ్(ఆదిలాబాద్) చెక్‌పోస్టులో రూ. 62,500, (గద్వాల్) అలంపూర్ చెక్‌పోస్టులో రూ. 29,200 సీజ్ చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు వెల్ల‌డించారు.  ...
error: Content is protected !!