Sarkar Live

State

US Consulate jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త .. యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగావ‌కాశం
State

US Consulate jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త .. యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగావ‌కాశం

US Consulate jobs : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. త‌క్కువ విద్యార్హ‌త‌తో ఉన్న‌త స్థాయి ఉద్యోగం పొందే అవ‌కాశం ల‌భించ‌నుంది. హైద‌రాబాద్‌లో మంచి జీతానికి ఫుల్‌టైమ్ జాప్ చేయాల‌నుకొనే వారికి మంచి అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది యూఎస్ కాన్సులేట్‌. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (NIV) అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హ‌త‌లు  హైస్కూల్ పూర్తి చేసి ఉండాలి.  ఆంగ్ల భాషలో ప్రావీణ్యం క‌లిగి ఉండాలి.  కనీసం ఒక ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. (తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియాలో ఏ ఒక్కదానిలోనైనా) ఏవైనా ఇత‌ర స్కిల్స్‌లో ప్రావీణ్యం క‌లిగి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్‌లో నైపుణ్యం (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, అవుట్‌లుక్) ఉండాలి. ఎంపిక విధానం (US Consulate jobs Selections) ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించాక షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు ఉంటాయి. అభ్య‌ర్థుల‌పై క్రిమిన‌ల్ కేసులు ...
TGPSC | నేటి నుంచి గ్రూపు-2 పరీక్షలు.. రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు
State

TGPSC | నేటి నుంచి గ్రూపు-2 పరీక్షలు.. రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు

Group 2 Exams | తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్‌-2 ‌పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు టీజీపీఎస్సీ (TGPSC) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌ 29‌న నోటిఫికేషన్‌ ‌విడుదల కాగా, పలు కారణాలతో పరీక్ష వాయిదా పడుతూ వ‌చ్చింది. ఎట్టకేలకు ఈనెల 15, 16వ‌ తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్య‌ర్థుల‌కు నిబంధ‌న‌లు ఇవీ.. గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే వారు హాల్‌టికెట్‌తో పాటు త‌మ తాజా పాస్‌పోర్టు సైజు ఫొటో, ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు వెంట‌ తీసుకురావాలని అధికారులు సూచించారు. మహిళా అభ్యర్థులు మంగళసూత్రం, గాజుల వరకే అనుమతి ఉంది .ఇతర ఆభరణాలు ఉంటే లోనికి అనుమ‌ అనుమతించబోమని అధికారులు తెలిపారు. ప్రతిఒక్కరూ చెప్పులు మాత్ర‌మే ధరించాలన్నారు. బెల్ట్‌లు, రిమోట...
Minister Ponguleti : హామీలు అమ‌లు చేయ‌లేక‌పోతున్నాం… మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి
State

Minister Ponguleti : హామీలు అమ‌లు చేయ‌లేక‌పోతున్నాం… మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి

Minister Ponguleti త‌న ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ చేసిన ఆర్థిక దోపిడీ వ‌ల్లే సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కాస్త ఆల‌స్య‌మ‌వుతోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాసరెడ్డి అన్నారు. కేసీఆర్‌ చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌డ‌మే స‌రిపోతోంద‌ని వ్యాఖ్యానించారు. ఖ‌మ్మంలో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఖ‌జానాను ఖాళీ చేశారు.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోయామనే విష‌యం వాస్తవమేన‌ని మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. దీనికి గ‌త ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే నాటికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏమీ మిగ‌ల్చ‌లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ఖ‌జానాను ఆ ప్ర‌భుత్వం ఖాళీ చేసింద‌ని, పైగా అప్పులు మిగిల్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆ అప్పులకు సంబంధించి వ‌డ్డీలు క‌ట్టేందుకే తెలంగాణ ఆర్థిక వ‌న‌రులు స‌రిపోవ‌డం లేదని ఆరోపించారు....
Tirupati | తిరుమ‌ల‌లో మ‌రోసారి సిట్‌.. ల‌డ్డూ త‌యారీ ప‌రిశీల‌న‌
State

Tirupati | తిరుమ‌ల‌లో మ‌రోసారి సిట్‌.. ల‌డ్డూ త‌యారీ ప‌రిశీల‌న‌

Tirupati : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆల‌య‌ పాకశాలను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (ఎస్ఐటీ) శ‌నివారం ఉద‌యం ప‌రిశీలించింద‌ని తెలుస్తోంది. తిరుమ‌ల ల‌డ్డూ (ప్ర‌సాదం) త‌యారీ విష‌యంలో వ‌చ్చిన వివాదంపై విచార‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ బృందంలోని ఆరుగురు స‌భ్యులు సంద‌ర్శించారు. ఆల‌యంలోని ప‌లు విభాగాల‌ను ప‌రిశీలించారు. నాణ్య‌తపై న‌జ‌ర్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)లోని ఆరుగురు సభ్యులు తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. లడ్డూ త‌యారీపై దర్యాప్తు చేస్తున్న ఈ బృందం ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించింద‌ని, ల‌డ్డూ తయారయ్యే పాకశాలను సంద‌ర్శించిందని ప‌లు మాధ్య‌మాలు వెల్ల‌డించాయి. లడ్డూ నాణ్యతను పరీక్షించే ప్రయోగశాల కూడా ఈ టీమ్ స‌భ్యులు ప‌రిశీలించార‌ని తెలుస్తోంది. లడ్డూకు ఉపయోగించే పిండిని తయారు చేసే మిల్లును కూడా ప‌రిశీలించినట్టు స‌మాచారం. ప్ర‌సాదం నాణ్య...
MLA Harish Rao సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు
State

MLA Harish Rao సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు

మాజీ మంత్రి, ఎమ్మెల్మే హ‌రీష్ రావు.. Hyderabad : సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్మే త‌న్నీరు హ‌రీష్ రావు ( BRS MLA Harish Rao ) అన్నారు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని శ‌నివారం మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు మధుసూదన్ చారి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మెతుకు ఆనంద్ తో క‌లిసి ప‌రామ‌ర్శించారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి..మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్ పై ఉండటం చూస్తే మనస్సు కలిచివేస్తున్నద‌ని హ‌రీష్ రావు అన్నారు. ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు.  వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈనెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వెంట‌నే వీరికి మంచి దవాఖానకు పంపించకుండా హా...
error: Content is protected !!