Sarkar Live

State

TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా డిస్పెన్సరీలు
State

TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా డిస్పెన్సరీలు

TGSRTC |  హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ రోగాల చికిత్స కోసం ఇకపై హైదరాబాద్‌లోని తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో వీరికోసం ప్ర‌త్యేకంగా డిస్పెన్సరీలను (TGSRTC dispensaries) ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ యోచిస్తోంది. ఇందుకోసం అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలను కూడా కొనుగోలు చేస్తోంది. అయితే, ఈ డిస్పెన్సరీల్లో అత్యవసర వైద్య‌చికిత్స‌లు ఉండ‌వు. అర్టీసీ కార్మికులంద‌రికీ సాధార‌ణ చికిత్సలను ఇందులో అందించనున్నారు. కార్పొరేషన్‌కు చాలా కాలంగా ఈ డిస్పెన్స‌రీల‌ను ఏర్పాటుచేయాల‌ని నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ కార్పొరేషన్ వద్ద తగినంత నిధులు లేకపోవడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఇటీవల ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ డిస్‌పెన్సరీల ఏ...
రూ. 300లోపు ఉత్తమ జియో ప్లాన్‌లు ఇవే. : త‌క్కువ ధరలకు 1.5GB రోజువారీ డేటా
State

రూ. 300లోపు ఉత్తమ జియో ప్లాన్‌లు ఇవే. : త‌క్కువ ధరలకు 1.5GB రోజువారీ డేటా

Jio plans under Rs 300 : ఈ ఏడాది జూలైలో Jioతో సహా అన్ని ప్రైవేట్‌ టెలికాం ప్రొవైడర్లు తమ టారీఫ్ ప్లాన్ల ధ‌ర‌ల‌నుపెంచారు, దీంతో టెల్కోలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కస్టమర్ భారీగా బిఎస్ఎన్ఎల్ కు మారారు. అయినప్పటికీ, దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన జియో, అన్ లిమిటెడ్ కాలింగ్ వంటి ఫీచర్లతో అనేక తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. తాజాగా జియో త‌క్కువ ధ‌ర‌తో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. Jio రూ. 299 ప్లాన్ ఈ 28-రోజుల ప్యాకేజీతో వినియోగదారులు భారతదేశంలో ఎక్కడైనా తమకు అన్ లిమిటెడ్‌ కాల్‌లు చేయవచ్చు. అదనంగా, రోమింగ్ కు అదనపు రుసుములు లేవు. వినియోగదారులు ప్రతిరోజూ పొందే 1.5GB డేటాతో స్ట్రీమ్ చేయవచ్చు, బ్రౌజ్ చేయవచ్చు. ఇది నెలకు 42GB వరకు అందుతుంది. మీరు ప్రతిరోజూ జియో యాప్ సేవలు, 100 ఉచిత టెక్స్ట్ మెసేజ్‌లకు యాక్సెస్‌ను కూడా అందుకుంటారు. Jio రూ. 239 ప్లాన...
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక అప్ డేట్
State

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక అప్ డేట్

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌. స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy ) కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న , గ్రూప్ -2 ప‌రీక్ష‌లు, మెస్ ఛార్జీలు, కులగణన సామాజిక స‌ర్వే త‌దిత‌ర అంశాల‌పై బుధవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ప్రతీ ఐదు వందల మందికి ఒక సర్వేయ‌ర్‌ ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో ‘వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప‌రిశీల‌న‌ను ఈనెల 31 లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప‌రిశీల‌న చేసిన స‌ర్వే వ...
US urges Peaceful Resolution | విభేదాల‌ను ప‌రిష్క‌రించుకోండి.. బంగ్లా, భార‌త్‌కు యూఎస్ సూచ‌న‌
State

US urges Peaceful Resolution | విభేదాల‌ను ప‌రిష్క‌రించుకోండి.. బంగ్లా, భార‌త్‌కు యూఎస్ సూచ‌న‌

US urges Peaceful Resolution : బంగ్లాదేశ్‌లో భార‌తీయులపై జ‌రుగుతున్న దాడుల నేప‌థ్యంలో యూఎస్ స్పందించింది. రెండు దేశాల మ‌ధ్య ఉన్న విభేదాల‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇటీవ‌ల భార‌త విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్రమ్ మిశ్రి బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా అక్క‌డ మైనారిటీలైన భార‌తీయుల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలపై ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో భార‌త‌దేశం, బంగ్లాదేశ్ మ‌ధ్య ఉన్న విభేదాలను ప‌రిష్క‌రించుకోవాల్సిన అవ‌స‌రంపై యునైటెడ్ స్టేట్స్ మాట్లాడింది. స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్ర‌తినిధి మాథ్యూ మిలర్‌ ఈ మేరకు మీడియా స‌మావేశంలో ప్ర‌క‌టించారు. Matthew Miler ఏమ‌న్నారంటే.. భార‌త్, బంగ్లాదేశ్ మ‌ధ్య ఉన్న విభేదాల‌న శాంతియుతంగా ప‌రిష్క‌రించుకొనే ఆస్కారం ఉంద‌ని, దీన్ని ఇరు దేశాలు ప‌రిశీలించాల‌ని మిలర్‌ సూచించారు. భార‌త విదేశాంగ మంత్రి విక్ర‌మ్ మిశ్రి (Vikram...
2025 Delhi polls | ఆప్-కాంగ్రెస్ కూటమిపై ఊహాగానాలకు తెర… పొత్తుపై కేజ్రీవాల్‌
State

2025 Delhi polls | ఆప్-కాంగ్రెస్ కూటమిపై ఊహాగానాలకు తెర… పొత్తుపై కేజ్రీవాల్‌

2025 Delhi polls : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు ఉండ‌బోతోంద‌ని కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌, ఆమ్ఆద్మీ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ఇత‌ర రాజ‌కీయ ప‌క్షాల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న దృష్ట్యా ఈ రెండు పార్టీల అధినాయ‌కత్వాలు చేసే ప్ర‌క‌ట‌న ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి స‌ర్వత్రా వ్య‌క్త‌మైంది. అయితే.. దీనిపై ఎట్ట‌కేల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రెండు పార్టీల పొత్తు విష‌యంలో ఊహాగానాలకు తెర‌ప‌డింది. ఎక్స్‌వేదిక‌గా కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) ఈ ఊహాగానాలకు తెర‌దింపారు. రెండు పార్టీల మ‌ధ్య అల‌యెన్స్ ఉండ‌బోతుంద‌నే అంశంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. "ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మేం ఒంట‌రిగానే పోటీ చేస్తాం. ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండ...
error: Content is protected !!