KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేవరకు పోరాటం
Hyderabad | లగచర్ల (Lagacharla) భూసేకరణ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భరోసా ఇచ్చారు. భూసేకరణ రద్దు చేసేవరకు పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు శనివారం లగచర్ల బాధితులు తెలంగాణ భవన్లో కేటీఆర్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వేధింపులను ఇప్పటికైనా మానుకొని బాధితుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యే వరకూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని కేటీఆర్ వారితో అన్నారు.
గిరిజన భూసేకరణ బాధితులపై రేవంత్ (CM Revanth Reddy) ప్రభుత్వం అన్యాయంగా పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పోలీసుల ద్వారా లగచర్ల బాధితులను వేధించడం నిలి...




