తెలంగాణలో కొత్త రైల్వే లైన్లపై కీలక అప్డేట్ – Vikarabad Krishna Railway line
Hyderabad News : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టుల (Telangana Railway Projects) పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వికారాబాద్–కృష్ణా కొత్త రైల్వే లైన్ (Vikarabad Krishna Railway line) పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. తెలంగాణలోని ఇండస్ట్రియల్ సెక్టార్ అభివృద్ధి కోసం ప్రత్యేక రైల్వే లైన్ అవసరమని సీఎం రేవంత్ సూచించారు. ఇందు కోసం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్ రవాణా అవసరాలకు కీలకమని ఆయన వివరించారు. అలాగే శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ప్రాజెక్టు సా...




