Sarkar Live

State

RTC Strike : ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సమ్మె వాయిదా
State

RTC Strike : ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సమ్మె వాయిదా

RTC Strike | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె వాయిదా పడింది. మంగళవారం ఆర్టీసీ జేేఏసీ (RTC JAC) నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ జెఎసి నాయకులతో చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాలు సమ్మెపై పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు, టిజిఎస్ఆర్టిసి యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖను విడుదల చేసింది, సంస్థను కాపాడుకోవడానికి సహకారం అందించాలని కోరింది. ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ కార్పొరేషన్ ముందుకు సాగుతున్న తరణంలో సమ్మె చేయడం సరికాదని పేర్కొంది. టిజిఎస్ఆర్టిసిని సంక్షోభంలోకి నెట్టివేసిన 2019 సమ్మెను కూడా ప్రస్తావించింది. RTC Strike : కార్మికుల సమస్యలపై కమిటీ మంగళవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponn...
HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం
State, Hyderabad

HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం

హైదరాబాద్ : గచ్చిబౌలి( Gachibowli)లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు చేపట్టింది. సంధ్య కన్వెషన్​ సెంటర్​ మినీ హాల్​(Sandhya Conventions)ను హైడ్రా నేలమట్టం చేసింది. అక్రమంగా నిర్మించిన కొన్ని ఫుడ్​ కోర్టులను కూల్చివేస్తుంది. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఫిర్యాదులు అందిన తర్వాత, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) మంగళవారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్స్‌లో కూల్చివేతలను నిర్వహించింది. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములు, ప్లాట్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా పేర్కొంది. లేఅవుట్లు, ఆస్తి మ్యాప్‌లను చెరిపివేసి, వారు లేఅవుట్ లో రోడ్లు, పార్కులను ఆక్రమించి అనేక నిర్మాణాలను నిర్మించారు. శ్రీధర్ రావు యాజమాన్యంలోని సంధ్య కన్వెన్షన్ మినీ హాల్‌తో పాటు, వంటగది, విశ్రాంతి గదులను హైడ్రా కూల్చివేసింది. అలాగే మెటల్ షీట...
Mini Anganwadi | మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త
State

Mini Anganwadi | మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త

Mini Anganwadi | తెలంగాణలోని 3989 మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి అంగన్వాడి టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు (Mini Anganwadi Teachers) వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్వాడి అన్న తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్వాడీ టీచర్లుగా భావించవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా తాజా ఉత్వర్వులు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెల జీతం ₹ 7800 ఉండగా ఏప్రిల్ మాసం నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకూ నెలకు ₹13,650 వేతనం అందుకోనున్నారు. సందర్భంగా మినీ అంగన్వాడి టీచర్లుమంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవం...
Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..
Hyderabad, State

Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..

Hyderabad : చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) ను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు పరిశీలించారు. శనివారం బలమైన ఈదురుగాలుతో కురిసిన భారీ వర్షాలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో రూఫ్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూ లిన విషయం తెలిసిందే.. దీంతో సీలింగ్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సహా రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే టెర్మనల్ కు చేరుకున్నారు. సీలింగ్ కూలిపోవడానికి తీవ్రమైన గాలి దుమారమే ప్రధాన కారణమని స్థానిక రైల్వే అధికారులు జీఎంకు వివరించారు. ఇక చర్లపల్లి స్టేషన్ లో గాలి దుమారానికి దెబ్బతిన్న ఇతర ప్రాంతాలను జీఎం అరుణ్ కుమార్ జైన్ (GM Arun Kumar Jain) పరిశీలించారు. అనంతరం జీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీలింగ్ ధ్వంసమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక ప్రయాణికుల భద్...
Rajiv Highway : నేషనల్ హైవేగా రాజీవ్ రహదారి?
State, Hyderabad

Rajiv Highway : నేషనల్ హైవేగా రాజీవ్ రహదారి?

కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు Adilabad News : తెలంగాణ నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే హైదరాబాద్(Hyderabad)-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి ( Rajiv Highway ) ని జాతీయ రహదారిగా మార్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ రహదారిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్ల ఈ రాజీవ్ రహదారి పూర్తిగా అధ్వానంగా మారిందని తెలిపారు.రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ (Nitin Gadkari) హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బండి సంజయ్ అన్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ...
error: Content is protected !!