Raithu Bhrosa | రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా
Raithu Bhrosa | రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలలో జమచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం వేశామని అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.. వరికి రూ.500 బోనస్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం అందించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్పగా చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. ఈ ఏడాదిలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే చారిత్రాత్మకమని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని అన్నారు. బీపీటీ, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు.
కే...