Sarkar Live

State

Raithu Bhrosa | రైతుల‌కు గుడ్ న్యూస్‌.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా
State

Raithu Bhrosa | రైతుల‌కు గుడ్ న్యూస్‌.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా

Raithu Bhrosa |  రైతుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డ‌బ్బులు వారి ఖాతాలలో జ‌మ‌చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రైతు భరోసాపై మంత్రివ‌ర్గ ఉప సంఘం వేశామ‌ని అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.. వరికి రూ.500 బోనస్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం అందించాల‌ని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్ప‌గా చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. ఈ ఏడాదిలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే చారిత్రాత్మ‌క‌మ‌ని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని అన్నారు. బీపీటీ, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. కే...
TGPSC | టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..
State

TGPSC | టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శ‌నివారం ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తి కానుంది. ఈ క్ర‌మంలో కొత్త చైర్మన్ నియామ‌కానికి ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. సుమారు 45 ద‌ర‌ఖాస్తులు వొచ్చినట్లుగా తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం ఈ పోస్టు కోసం అప్లై చేసుకున్నారు. అందులో బుర్రా వెంకటేశ్ పేరును ప్రభుత్వం సిఫార్సు చేస్తూ ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించింది. తాజాగా ఆ ఫైల్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. డిసెంబర్ 3న టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్న‌ట్లు స‌మాచారం. 1995 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విద్యాశ...
Raithu Bandhu | రైతు బంధు ప‌థ‌కాన్ని బంద్ చేసే కుట్ర‌..!
State

Raithu Bandhu | రైతు బంధు ప‌థ‌కాన్ని బంద్ చేసే కుట్ర‌..!

Raithu Bandhu | రైతన్నకు సాగుకు పెట్టుబడి సాయం అందించి భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా తొల‌గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర‌లు చేస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao ) మండిప‌డ్డారు. రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ.. రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయమ‌న్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమ‌ని అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వొస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ. 26 కోట్లు మాత్రమే అని ఆరోపించారు. అదే రైతుబంధు కింద...
Uttam Kumar Reddy | రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి సాగు
State

Uttam Kumar Reddy | రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి సాగు

Telangana |  దేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలంలో తెలంగాణలో 66.7లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఇది వ్యవసాయానికి సంబంధించి  అతిపెద్ద రికార్డు అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు రోజుల రైతు పండగలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.  రేపు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రైతు పండుగ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన  స్టాళ్లను పరిశీలించారు. అనంతరం అవగాహన సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్  మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసి దేశంలో మొదటి స్థానం సాధించిందన్నారు. అందుకే రైతులు పండగ చేసుకుంటున్నారని తెలిపారు. రైతులకు మంచ...
Indiramma Illu| ఇందిర‌మ్మ ఇళ్ల‌పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
State

Indiramma Illu| ఇందిర‌మ్మ ఇళ్ల‌పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

Indiramma Illu | ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ముందుగా అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యమివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య‌క్ర‌మంలో లబ్ధిదారులను ఎంచుకోవాల‌ని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిర‌మ్మ ఇళ్లపై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌మిస్తున్నందున త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఈ విష‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శితో పాటు మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌ని సీఎం సూచించారు.  ఏ ద‌శ‌లోనూ ల‌బ్ధ...
error: Content is protected !!