Sarkar Live

State

Former MLA detained | మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. ఎందుకంటే..
State

Former MLA detained | మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. ఎందుకంటే..

Former MLA detained : బీఆర్ఎస్ బోధ‌న్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ (Former MLA Shakil Aamir)ను హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGI Airport)లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయన దుబాయ్ నుంచి భారత్‌కు రాగా వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల‌పాటు పోలీసుల‌కు చిక్క‌కుండా దుబాయిలో ఉన్న ఆయ‌న త‌న త‌ల్లి మ‌ర‌ణ వార్త విని ఇక్క‌డికి వ‌చ్చారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే పోలీసులు ఆయన్నుఅదుపులోకి తీసుకున్నారు. అయితే, తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చారు. Shakil Aamir ను ఎందుకు అరెస్టు చేశారు? హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ ఎదుట ఎమ్మెల్యే కుమారుడు రాహీల్ ఆమీర్ అలియాస్ సాహిల్ తన కారు నడిపి పోలీసు బ్యారికేడును ఢీకొట్టాడు. ఇదిఇ 2023 డిసెంబరులో జ‌రగ్గా క‌ల‌క‌లం రేపింది. పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ ఆమీర్ సహ...
HSRP | ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం.. ఇకపై వెహిక‌ల్స్‌కు ఇది త‌ప్ప‌నిస‌రి
State

HSRP | ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం.. ఇకపై వెహిక‌ల్స్‌కు ఇది త‌ప్ప‌నిస‌రి

HSRP must : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ (Telangana Transport Department) ఓ కీల‌క చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైంది. 2019 ఏప్రిల్ 1 ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనంపై తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (High-Security Registration Plates (HSRP) ఉండాలనే నిబంధ‌న‌ను అమ‌ల్లోకి తేనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పంపింది. ఆమోదం వచ్చిన వెంటనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. HSRP అంటే ఏమిటి? హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది ఒక ప్రత్యేక నంబర్ ప్లేట్. ఇది ఏమాత్రం బెండ్ కాని (tamper-proof), స్టాండర్డైజ్డ్ విధానంతో తయారవుతుంది. ఇందులో ప్రత్యేకమైన భద్రతా ఫీచర్లు ఉంటాయి. వీటివల్ల వాహనం కదలికలు, దొంగతనాలను ట్రాక్ చేయడం సులభమవుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని వాహనాలపై ఒకే విధమైన నంబర్ ప్లేట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. హైడ్రోక్రోమిక్ స్టికర్, లేజర్ కోడ్, రివెట్ పిన్ వంటి ఫీచర్లు వ...
Kancha Gachibowli issue | కంచ గచ్చిబౌలి భూ వివాదంలో కీల‌క మ‌లుపు..
State

Kancha Gachibowli issue | కంచ గచ్చిబౌలి భూ వివాదంలో కీల‌క మ‌లుపు..

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలో కంచ గచ్చిబౌలి భూ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టు దృష్టిలోకి వెళ్లింది. ఈ భూములపై జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున పర్యావరణ నష్టం జరుగుతోందని పలు సంస్థలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌ప‌థ్యంలో మీడియాలో అనేక‌ కథనాలు వెలువడుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC)ని నియమించింది. కంచ గ‌చ్చిబౌలి స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. Kancha Gachibowli issue : అధికారులతో సీఈసీ స‌భ్యుల‌ భేటీ సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ సభ్యులు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ కమిటీకి సిద్దాంత్ దాస్ అధ్యక్షత వహిస్తుండగా ఇతర సభ్యులుగా CP గోయల్, సునీల్ లిమయే, JR భట్ ఉన్నారు. వీరు గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రత్యక్షంగా పరిశీలన (Supreme ...
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మరిన్ని కొత్త రైళ్లు.. అసలు సమస్య ఇక్కడే.. – Cherlapally Terminal Problems
State

చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మరిన్ని కొత్త రైళ్లు.. అసలు సమస్య ఇక్కడే.. – Cherlapally Terminal Problems

Cherlapally Terminal Problems : హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ (Secundrabad) రైల్వే జంక్షన్ పై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇటీవలే ఆధునిక హంగులతో అభివృద్ధి చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి కొత్తగా మరిన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపించేందుకు భారతీయ రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి ఐదు రైలు సర్వీసులను చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ (Cherlapally Terminal )కు తాత్కాలికంగా మార్చడానికి రైల్వే బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది. అయితే నగర ప్రయాణికులు చర్లపల్లి రైల్వేస్టేషన్ కు చేరుకోవడానికి సరైన కనెక్టివిటీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 15 నుండి హైదరాబాద్ (Hyderabad) నుండి చెర్లపల్లి నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలనే నిర్ణయంతో పాటు, దక్షిణ మధ్య రైల్వే (South Central Railways ) 13 రైళ్లను సికిం...
Registrations | ఇకపై రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ విధానం, మొదట ఈ కార్యాల‌యాల్లోనే..
State

Registrations | ఇకపై రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ విధానం, మొదట ఈ కార్యాల‌యాల్లోనే..

Telangana Registrations and Stamps Department | తెలంగాణలో సమర్థవంతంగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరిస్తున్నామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించే బాధ లేకుండా కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌య్యేలా స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానాన్ని త్వరలో తీసుకురాబోతున్నామ‌ని వెల్లడించారు.రాష్ట్రంలో 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు గాను మొద‌టి ద‌శ‌లో ప్ర‌యోగాత్మ‌కంగా 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఈనెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లులోకి తీసుకురాబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యాలయంలోనే.. స్లాట్ బుకింగ్ విధానాన్ని మొత్తం 22...
error: Content is protected !!