Sarkar Live

State

TG TET 2024 | టెట్ అభ్యర్థులకు కీల‌క‌ అప్డేట్.. హాల్ టికెట్లు విడుదల‌య్యేది అప్పుడే..
State

TG TET 2024 | టెట్ అభ్యర్థులకు కీల‌క‌ అప్డేట్.. హాల్ టికెట్లు విడుదల‌య్యేది అప్పుడే..

TG TET 2024 Exam Hall Tickets : తెలంగాణలో టెట్ కు భారీగా డిమాండ్ ఉంది. ఇటీవ‌ల టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు వ‌చ్చాయి. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 26 నుంచి త‌మ‌ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ 2024 (II) దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ పరీక్ష కోసం మొత్తంగా 2,48,172 దరఖాస్తులు స‌మ‌ర్పించారు. పేపర్‌-1కు 71,655 , పేపర్‌-2కు 1,55,971 అప్లికేష‌న్లు వ‌చ్చాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు… డిసెంబర్ 26 నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 26 డిసెంబర్ 2024న అందుబాటులోకి రానున్నాయి. అభ్య‌ర్థులు https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక జనవరి 1, 2025వ తేదీ నుంచి టెట్ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మవుతా...
Panchayat Elections | ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు..!
State

Panchayat Elections | ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు..!

3 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం సర్పంచ్ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గ్రామాల్లో మొదలు కానున్న సందడి సంతానం నిబంధన ఎత్తివేతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర పోటీ Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు (Telangana Govt) తీవ్ర కసరత్తు చేస్తోంది. నూతన సంవత్సరంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2025 ఫిబ్రవరి లోనే సర్పంచ్‌ ఎన్నికలను నిర్వహించి అనంతరం జడ్పిటిసీ, ఎంపిటిసి ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను ఒకేరోజు జరిపితే ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయమని ముందుగానే గుర్తించిన ఎన్నికల సంఘం.. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. సర్పంచ్‌ ఎన్న...
NHAI | టోల్ వసూలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది, ప్రైవేట్ కంపెనీలు ఎంత సంపాదించాయి?
State

NHAI | టోల్ వసూలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది, ప్రైవేట్ కంపెనీలు ఎంత సంపాదించాయి?

NHAI | న్యూఢిల్లీ : 2000లో ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ వసూలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి హైవేల‌పై ప్రయాణికుల నుంచి దాదాపు రూ.2.1 లక్షల కోట్లను యూజర్ ఫీజుగా వ‌సూలయ్యాయి. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్‌ను నిర్మించడానికి కేంద్రం భారీ మొత్తంలో నిధుల‌ను ఖ‌ర్చుచేస్తోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు అంచనా. కాగా గత 24 ఏళ్లలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో నిర్మించిన ర‌హ‌దారుల కోసం ప్రైవేట్ హైవే నిర్మాణ కంపెనీలు సుమారు రూ. 1.4 లక్షల కోట్ల టోల్ వసూలు చేశాయని మంత్రిత్వ శాఖ గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ స్ట్రెచ్‌లలో, NH-48 ప‌రిధిలోని గుర్గావ్-జైపూర్ కారిడార్ యూజర్ ఛార్జీల రూపంలో దాదాపు రూ. 8,528 కోట్లు వసూలు చేసింది. టోల్ సేకరణలో UP నంబర్ 1 ప్రైవేట్ కంపెనీలు PPP కింద ర‌హ‌దారుల నిర్మాణాన...
Hydra | మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం
State

Hydra | మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం

హైదరాబాద్: హైద‌రాబాద్‌లో అక్ర‌మ నిర్మాణాల‌పై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రా మ‌ళ్లీ రంగంలోకి దిగింది. ఈమేర‌కు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్‌ మున్సిపల్‌ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నిజాంపేట్‌ మునిసిపల్‌ కమిషనర్‌, బాచుపల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే నంబరు 334లో వెలిసిన అక్రమ నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బంది ఎక్సకవేటర్‌తో కూల్చివేశారు. తుర్కచెరువు బఫర్‌ జోన్‌లో ఉన్న నాలుగు గదులను కూడా నేల‌మ‌ట్టం చేశారు. కార్య‌క్ర‌మంలో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నరేందర్‌రెడ్డి, భానుచందర్‌, ప్రశాంతి పాల్గొన్నారు....
Dharani Portal | ధరణి ధరఖాస్తులకు ఇకపై త్వరలో పరిష్కారం.. కొత్త మార్గదర్శకాలు ఇవే..
State

Dharani Portal | ధరణి ధరఖాస్తులకు ఇకపై త్వరలో పరిష్కారం.. కొత్త మార్గదర్శకాలు ఇవే..

Dharani Portal | రాష్ట్ర వ్యాప్తంగా కొన్నాళ్ల నుంచి ధరణి అప్లికేషన్లు భారీగా పెండింగులో ఉన్నాయి. వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు అధికారాలను రాష్ట్రభుత్వం వికేంద్రీకరించింది. ఆర్డీవో, అదనపు కలెక్టర్లు(రెవెన్యూ)కు మరిన్ని బాధ్యతలను, అధికారాలను కట్టబెట్టింది.ధరణి కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గురువారం  సర్క్యులర్ జారీ చేశారు. గత మూడు రోజుల క్రితమే అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. గతంలోనూ ప్రతి దరఖాస్తును ఎన్ని రోజుల్లో పరిష్కరించాలో స్పష్టం చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదు. నెలల తరబడి దరఖాస్తుదారులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. సమస్య పరిష్కారం కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకునేవారు.. అయితే ఈ సారైనా సీసీఎల్ఏ జారీ చేసిన ఆదేశాలను తహశీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్డీవో స్థాయి: టీఎం 4. అసైన్డ్ భూమ...
error: Content is protected !!