Sarkar Live

State

HSBC report | ఏప్రిల్‌లో త‌గ్గ‌నున్న వ‌డ్డీ రేట్లు.. హెచ్ఎస్‌బీసీ తాజా రిపోర్ట్‌
State

HSBC report | ఏప్రిల్‌లో త‌గ్గ‌నున్న వ‌డ్డీ రేట్లు.. హెచ్ఎస్‌బీసీ తాజా రిపోర్ట్‌

HSBC Research report : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే నెలలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముందని HSBC రీసెర్చ్ తాజా నివేదిక చెబుతోంది. ఇటీవల ద్రవ్యోల్బణం (inflation) తగ్గుముఖం (decline) పట్టడం వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు మరింత బలపడుతున్నాయ‌ని పేర్కొంది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.6 శాతానికి పడిపోగా, మార్చిలో కూడా ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం కంటే తక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో జరగబోయే ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, రెపో రేటు (repo rate)ను 6 శాతానికి తీసుకెళ్లే అవకాశముందని హెచ్ఎస్‌బీసీ రీసెర్చ్ నివేదిక (HSBC Research report) చెబుతోంది. ఆహార ద్రవ్యోల్బణం ఇలా.. ప్రస్తుతం మార్చి త్రైమాసిక ద్రవ్యోల్బణం (March quarter inflation) ఆర్బీఐ అంచనాల కంటే తక్కువగా ఉండటంతో వడ్డీ రేట్ల తగ్గింపున‌కు మరింత అవకాశం ఏర్పడింది. శ...
Tatkal passport | త‌త్కాల్ పాస్‌పోర్టుకు తిప్ప‌లు.. క్ష‌ణాల్లోనే స్లాట్ల‌న్నీ బుక్‌
State

Tatkal passport | త‌త్కాల్ పాస్‌పోర్టుకు తిప్ప‌లు.. క్ష‌ణాల్లోనే స్లాట్ల‌న్నీ బుక్‌

Tatkal passport : హైదరాబాద్ (Hyderabad)లో తత్కాల్ పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ స్లాట్ల (appointment slots) కోసం పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో (Passport Seva Kendras (PSKs) అపాయింట్‌మెంట్ బుకింగ్ విండో తెరుచుకున్న కొన్ని సెకన్లలోనే సాట్ల‌న్నీ నిండిపోతున్నాయి. దీనివల్ల అనేక మంది దరఖాస్తుదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Tatkal passport : అపాయింట్‌మెంట్ క‌ష్ట‌మే.. ప్రస్తుతానికి పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం అన్ని అపాయింట్‌మెంట్లు మార్చి 20 వరకు బుక్ అయిపోయాయి. తత్కాల్ పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ స్లాట్ పొందాలంటే కనీసం ఒక వారం వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అయినా అప్పటికీ స్లాట్లు దొరికే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు బుకింగ్ విండో ఓపెన్ కాగానే కొన్ని క్షణాల్లోనే అన్ని అపాయింట్‌మెంట్లు నిండిపోతున్నాయి. సాధారణ పాస్‌పోర...
Telangana Assembly : అసెంబ్లీలో మాట‌ల తూటాలు.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య పొలిటిక‌ల్ యుద్ధం
State

Telangana Assembly : అసెంబ్లీలో మాట‌ల తూటాలు.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య పొలిటిక‌ల్ యుద్ధం

Telangana Assembly : తెలంగాణ శాసనసభలో ఈ రోజు జరిగిన సమావేశం రసాభాసగా మారింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ( Motion of Thanks)పై చర్చ జరుగుతుండగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చివరకు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar ) వాయిదా వేయాల్సి వచ్చింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఏఐ స్క్రిప్ట్ : బీఆర్ఎస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Adi Srinivas) ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు ( BRS MLAs) వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (BRS MLA Jagadish Reddy) చేసిన వ్యాఖ్య స‌భ‌ను మ‌రింత వేడెక్కించింది. గవర్నర్ ప్రసంగాన్ని (Governor’s speech) పూర్తిగా నిరాధారంగా అభివర్ణించారు. ఇది ఒక ఏఐ తయారు చేసిన స్క్రిప్ట్ (AI generated script) లాంటిద‌ని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభ...
KTR | బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?.
State

KTR | బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?.

KTR | హైదరాబాద్‌: ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపంచలేని వ్యక్తికి ఎందుకంత అహంకారం అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్టేచర్‌ లేకున్నా పేమెంట్‌ కోటాలో పదవి దక్కడంతో ముఖ్యమంత్రికి కళ్లు నెత్తికి ఎక్కాయని ఫైర్ అయ్యారు. అసమర్థుడి పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అల్లకల్లోలమయ్యాయన్నారు. ప్రభుత్వం నడపడమంటే డబ్బులు పంచడం కాదని, రాష్ట్ర సంపద పెంచడమని కేటీఆర్ హితువు పలికారు. ఆదాయం లేకపోవడం సమస్య కాదని, రేవంత్ రెడ్డి మెదడులో విషయం లేకపోవడమే అసలు సమస్య అంటూ ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు. ‘బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ (BRS Leader KTR)విమర్శలు గుప్పగించారు. డబ్బుల సంచులను ఢిల్లీకి పంపిచడానికి బదులుగా.. వాటిని హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అ...
Urea Shortage : తెలంగాణలో తీవ్రమైన యూరియా కొరత, ఆందోళనలో అన్నదాతలు
State

Urea Shortage : తెలంగాణలో తీవ్రమైన యూరియా కొరత, ఆందోళనలో అన్నదాతలు

Telangana news : యూరియా సరఫరా తగినంతగా ఉందని రాష్ట్ర అధికారులు పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ వరంగల్ (Warangal), కరీంనగర్ (Karimnagar) జిల్లాల్లోని యూరియా కొరత (Urea Shortage)తో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి అదనపు ఎరువుల నిల్వలను తీసుకుంటున్నట్లు అధికారులు ఒకవైపు చెబుతున్నప్పటికీ, రైతులు మండుతున్న ఎండల్లో గంటలపాటు వేచిచూడాల్సి దుస్థితి ఎదురవుతోంది. క్యూలైన్లలో నిలుచున్నా కూడా చాలా మందికి యూరియా అందలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితుల స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) వెలుపల క్యూలో నిలబడుతున్నారు. కొందరు ఎండలను తాళలేక తమ చెప్పులు, సంచులను లైన్‌లో ఉంచి, తమకు కేటాయించిన యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు రైతులకు తమ వాటా లభించినప్పటికీ, చాలా మంది రైతులు ఉత్త చ...
error: Content is protected !!