Warangal | రేపు వరంగల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే..
                    వరంగల్ వరద బాధితుల సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం
Warangal : మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా అతలాకుతలమైంది.. భారీ వరదల కారణంగా అనేక కాలనీలు పూర్తిగా మునిగిపోయి ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయింది. అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, పోలీసు విభాగం, విపత్తు నిర్వహణ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం.. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతే డ్రోన్ల సాయంతో తాగునీరు, ఆహార ప్యాకె...                
                
             
								



