ఖిలా వరంగల్లో ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్, పూలే దంపతుల విగ్రహాల భూమి పూజ
చారిత్రక ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ చౌరస్తాలో డా. బి.ఆర్. అంబేద్కర్ తో పాటు సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు బుధవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది. కొండా దంపతుల ప్రత్యేక సహకారంతో, విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గుడికందుల క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ ఉమా దామోదర్, 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు ఏకలవ్య రాష్ట్ర అధ్యక్షులు రాయపురం సాంబయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సంగి ఎలందర్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ మేరుగు అశోక్ తదితరులు హాజరయ్యారు.
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడం అభ...




