Sarkar Live

warangal

ఖిలా వరంగల్‌లో ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్‌, పూలే దంపతుల విగ్రహాల భూమి పూజ
warangal

ఖిలా వరంగల్‌లో ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్‌, పూలే దంపతుల విగ్రహాల భూమి పూజ

చారిత్రక ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ చౌరస్తాలో డా. బి.ఆర్. అంబేద్కర్ తో పాటు సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు బుధవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది. కొండా దంపతుల ప్రత్యేక సహకారంతో, విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గుడికందుల క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ ఉమా దామోదర్, 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు ఏకలవ్య రాష్ట్ర అధ్యక్షులు రాయపురం సాంబయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సంగి ఎలందర్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ మేరుగు అశోక్ తదితరులు హాజరయ్యారు. మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడం అభ...
సురక్షిత ప్రయాణం ఆటో డ్రైవర్ల బాధ్యత: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
warangal

సురక్షిత ప్రయాణం ఆటో డ్రైవర్ల బాధ్యత: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆటో డ్రైవర్ల ప్రధాన బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా, నేడు కాజీపేట రైల్వే ఆడిటోరియంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. డ్రైవర్లు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వీడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. మితిమీరిన ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని డ్రైవర్లతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీలు సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్...
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ
warangal

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ

సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టడానికి ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు నడుం బిగించాలని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ పిలుపునిచ్చారు. హన్మకొండ పరిధిలోని న్యూశాయంపేట పోచంపల్లిలో, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇనుగాల రాధిక నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 మంది వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరెత్తిన నినాదాలు - అవగాహన ర్యాలీ శిబిరంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. "ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలిద్దాం - పచ్చదనాన్ని పెంచుదాం" "ప్లాస్టిక్ వద్దు - ప్రాణాలు ముద్దు" "ప్లాస్టిక్ ను నిషేధిద్దాం - పర్యావర...
ప్రతి ఫోటోగ్రాఫర్ సంక్షేమమే లక్ష్యం: కుసుమ రమేష్
warangal

ప్రతి ఫోటోగ్రాఫర్ సంక్షేమమే లక్ష్యం: కుసుమ రమేష్

తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం (TGPVWA) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుసుమ రమేష్  బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని రెడీన్ రిసార్ట్ & హోటల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ రంగాల్లో ఆయన చేసిన కృషిని, సంఘం పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని గుర్తించి రాష్ట్ర కార్యవర్గం ఈ పదవిని అప్పగించింది. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్. వెంకట్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కే. హుస్సేన్, ప్రధాన కార్యదర్శి లడే రవి మాట్లాడుతూ.. కుసుమ రమేష్ వంటి క్రియాశీలక నాయకుడు రాష్ట్ర కార్యవర్గంలో చేరడం వల్ల సంఘం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారంలో ఆయన ముందుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుసుమ రమేష్ మాట్లాడుత...
ఉద్యమకారునికి అండగా పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి: రూ. 50 వేల ఆర్థిక సాయం
warangal

ఉద్యమకారునికి అండగా పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి: రూ. 50 వేల ఆర్థిక సాయం

గీసుకొండ, వరంగల్ జిల్లా: కష్టాల్లో ఉన్న ఉద్యమకారులను ఆదుకోవడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి చాటిచెప్పారు. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన ఉద్యమకారుడు కోట ప్రవీణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అతని వైద్య ఖర్చుల నిమిత్తం బాలకిశోర్ రెడ్డి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా, వారి ప్రతినిధిగా గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజకుమార్ స్వయంగా వెళ్లి ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా రాజకుమార్  మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఏ కష్టం వచ్చినా బాలకిశోర్ రెడ్డి తోపాటు  తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం చేసినందుకు గీసుకొండ మండల ఉద్యమకారులు అల్లం బాలకిశోర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెల...
error: Content is protected !!