Sarkar Live

warangal

భద్రకాళి మాడ వీధుల అభివృద్ధికి మేము అడ్డు కాదు – కానీ స్థానికులకు అన్యాయం చేస్తే సహించం 
warangal

భద్రకాళి మాడ వీధుల అభివృద్ధికి మేము అడ్డు కాదు – కానీ స్థానికులకు అన్యాయం చేస్తే సహించం 

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై చెరబండరాజు నగర్ కాలనీ వాసుల ధ్వజం హన్మకొండ: భద్రకాళి దేవస్థాన మాడ వీధుల అభివృద్ధి పేరుతో గత 23 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న బండ కార్మికుల కుటుంబాలను ఖాళీ చేయించి, బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చాలని చూడటం దుర్మార్గమని చెరబండరాజు నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్థానికేతరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేను నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యేకు కాలనీ వాసుల సూటి ప్రశ్నలు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టా పొంది, అక్కడ నివసించే వారికే ఆ హక్కు వర్తిస్తుంది. కానీ, ఇక్కడ నివాసం లేని వారికి ఏ ప్రాతిపదికన లబ్ధి చేకూరుస్తున్నారు? కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, ...
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే  లక్ష్యం: నాగుర్ల వెంకటేశ్వర్లు
warangal

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే  లక్ష్యం: నాగుర్ల వెంకటేశ్వర్లు

రాష్ట్ర అభివృద్ధిలో ఎరువులు, విత్తనాల డీలర్ల పాత్ర అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. శివనగర్‌లో జరిగిన నూతన రాష్ట్ర కార్యవర్గ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ప్రధానాంశాలు: నాణ్యతకే ప్రాధాన్యం: డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు మాత్రమే విక్రయించాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సూచించారు. బాధ్యతాయుత అమ్మకాలు: క్షేత్రస్థాయిలో పరీక్షించని ఉత్పత్తులను ప్రమోట్ చేయవద్దని, రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఆత్మగౌరవ భవనం: అందరి సహకారంతో రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ భవనాన్ని నిర్మిస్తామని, డీలర్ల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. నిబంధనల అమలు: ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేస్తూ, డీలర్ల మధ్య ఐక్యతను కాపాడుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యద...
మత సామరస్యానికి వరంగల్ ప్రతీక: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
warangal

మత సామరస్యానికి వరంగల్ ప్రతీక: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాజీపేటలోని ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో చర్చి నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ నగరం మత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దమని కొనియాడారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులంతా కలిసిమెలసి ఉండటమే ఈ ప్రాంత ప్రత్యేకతని, ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజంలో సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు. భక్తులందరికీ ఫాతిమా మాత ఆశీస్సులు లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ అబూబకర్, సీనియర్ నాయకులు ఎస్.టి. పాల్ ఆనంద్, విశ్రాంత బిషప్ జోసెఫ్, ఫాదర్ విజయపాల్, చర్చి గురువులు మర్రెడ్డి, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు....
పది పరీక్షల వేళ 144 సెక్షన్ అమలు: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత
warangal

పది పరీక్షల వేళ 144 సెక్షన్ అమలు: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ముఖ్యమైన వివరాలు: పరీక్షా కేంద్రాలు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 150 కేంద్రాలు (హన్మకొండ-64, వరంగల్-47, జనగామ-39). సమయం: ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమలు కాలం: ఏప్రిల్ 16, 2026 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. విధించిన ఆంక్షలు: . పరీక్ష కేంద్రాల సమీపంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటంపై నిషేధం ఉంది. . ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా ధర్నాలకు అనుమతి లేదు. .పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లను ప్ర...
దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు
Crime, warangal

దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు

కొనాయమాకుల స్టేజ్ వద్ద చలివేంద్రం ప్రారంభం ఎండలు ముదురుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కొనాయమాకుల స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మామునూరు ఏసీపీ వెంకటేష్  బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ గీసుగొండ సీ ఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని అన్నారు.కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, అనిల్ ,తోపాటు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు....
error: Content is protected !!