భద్రకాళి మాడ వీధుల అభివృద్ధికి మేము అడ్డు కాదు – కానీ స్థానికులకు అన్యాయం చేస్తే సహించం
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై చెరబండరాజు నగర్ కాలనీ వాసుల ధ్వజం
హన్మకొండ: భద్రకాళి దేవస్థాన మాడ వీధుల అభివృద్ధి పేరుతో గత 23 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న బండ కార్మికుల కుటుంబాలను ఖాళీ చేయించి, బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చాలని చూడటం దుర్మార్గమని చెరబండరాజు నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్థానికేతరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేను నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు.
ఎమ్మెల్యేకు కాలనీ వాసుల సూటి ప్రశ్నలు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టా పొంది, అక్కడ నివసించే వారికే ఆ హక్కు వర్తిస్తుంది. కానీ, ఇక్కడ నివాసం లేని వారికి ఏ ప్రాతిపదికన లబ్ధి చేకూరుస్తున్నారు?
కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, ...




