Sarkar Live

warangal

Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం
warangal, State

Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం

Kazipet Coach Factory News | కాజీపేట రైల్వే కోచ్‌ పరిశ్రమ వరంగల్‌ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల అని ఆ కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోచ్​ ఫ్యాక్టరీ పనుల గురించి అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో మెగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని.. పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీతో 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని తెలిపారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకో మోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని చెప్పారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్...
Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ
warangal, State

Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ

వివాదాల నడుమ కీలక పరిణామం 16 పేజీల నివేదికతో మీనాక్షి నటరాజన్‌ను కలుసిన సురేఖ Warangal News | కొండా మురళి.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ గా చేసిన విమర్శలు కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్టేషన్ ఘన్ పూర్ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా ఆయ‌న‌ విమర్శించారు. దీంతో ఆయా నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే గురువారం తన సతీమణి, మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తో కలిసి కొండా ముర‌ళి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan) తో భేటీ అయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అలాగే మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ అంద‌జేశారు. Kond...
Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు
State, warangal

Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు

Medaram Jatara 2026 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara 2026) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు బుధవారం ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది.  రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు.  జ‌న‌వ‌రి 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కీల‌క‌మైన ఘ‌ట్టం ఉంటుంది. ఇక 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో  వెల్లడించారు....
NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
warangal, State

NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

– సీతక్క చేతుల మీదుగా ఘన సత్కారం Mulugu : సీనియర్ జర్నలిస్ట్‌, రచయిత గడ్డం కేశవమూర్తికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటసార్వభౌముడు, సంచలన రాజకీయ నేత పద్మశ్రీ డా.ఎన్టీ రామారావు స్మారకంగా ఇచ్చే ఎన్టీఆర్ అవార్డు (NTR Award ) ఈసారి కేశవమూర్తికి అందింది. ఈ అవార్డును విజయవాడకు చెందిన 'ఎక్స్ రే సాహిత్య-సాంస్కృతిక సేవా సంస్థ' ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందజేసింది. ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు కేశవమూర్తి (Gaddam Keshava Murthi) ని కూడా పురస్కరించడం విశేషం. గురువారం ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క (Minister Seethakka) స్వయంగా కేశవమూర్తికి అవార్డును అందించారు. ఆమె చేతుల మీదుగా శాలువాతో కేశవమూర్తిని ఘనంగ సపన, మెమెంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజ...
Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట
warangal, State

Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట

‌హనుమకొండ : ‌క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డిపై బెదిరింపు కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కి కాజీపేట రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్‌ ‌విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్‌ ‌విధించారు. దీంతో పోలీసులు కౌశిక్‌ ‌రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు. అయితే అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్‌ ‌దగ్గర హైడ్రామా కొనసాగింది. క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్‌ ‌తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్‌ఎస్‌ ‌లీగల్‌ ‌టీం వాధించింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ ‌లాయర్‌ ‌వాదించారు. 308 సెక్షన్‌ 4‌ని తర్వాత మార్ప్ ‌చేయడంతో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌కేసుగా మార్చారని లీగల్‌ ‌టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌ...
error: Content is protected !!