Sarkar Live

warangal

వాసం శ్రీనివాస్ కు .. ప్రొఫెసర్ గా పదోన్నతి…..
warangal

వాసం శ్రీనివాస్ కు .. ప్రొఫెసర్ గా పదోన్నతి…..

సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ వాసం శ్రీనివాస్‌కు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ పదోన్నతి అమలులోకి వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగి విద్యారంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆయన విజయం కొత్తగూడెం గ్రామంతో పాటు సంగెం మండల ప్రజలకు గర్వకారణంగా మారింది. సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వాసం వీరస్వామి, సోమలక్ష్మి దంపతుల కుమారుడైన డాక్టర్ వాసం శ్రీనివాస్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసి, కాకతీయ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా సాధించారు. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై రసాయన శాస్త్రంలో జూనియర్ లెక్చరర్‌గా తన ఉపా...
బీసీలకు అన్యాయం చేసినట్లే.. నాయిని భరత్
warangal

బీసీలకు అన్యాయం చేసినట్లే.. నాయిని భరత్

తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను బీసీ వర్గాలకు కేటాయించకపోవడం అన్యాయమని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ విమర్శించారు. రాష్ట్రంలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ వారికి రాజ్యసభలో తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల డిమాండ్లను పట్టించుకోకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. ఖాళీ స్థానాలను బీసీలకు కేటాయిస్తే వారి సమస్యలు జాతీయ స్థాయిలో ప్రస్తావనకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునర్విమర్శించి భవిష్యత్తులో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని నాయిని భరత్ హెచ్చరించారు....
ఘనంగా కొండేటి కొమురా రెడ్డి జన్మదిన వేడుకలు
State, warangal

ఘనంగా కొండేటి కొమురా రెడ్డి జన్మదిన వేడుకలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (Greater Warangal Municipal Corporation) పరిధిలోని 15వ డివిజన్ గొర్రెకుంటలో జిల్లా ఉపాధ్యక్షులు Kondeti Komura Reddy జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా 15వ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి, శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొండేటి కొముర రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు....
Warangal Police | వరంగల్ ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలి
Crime, warangal

Warangal Police | వరంగల్ ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలి

వరంగల్ పోలీస్ కమిషనరేట్  (Warangal Police Commissionerate) పరిధిలో నేరాల నియంత్రణపై కఠిన వైఖరి అవలంబించనున్నట్లు పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు అయిన యువత గంజాయి మత్తుకు బానిసలవకుండా, గంజాయి సరఫరా చేస్తున్న మూలాలను గుర్తించి నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం కాకతీయ మెడికల్ కళాశాలలో( Kakatiya Medical College)లో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో కమిషనర్ పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, పెండింగ్ వారెంట్ల అమలు, అధికారుల పనితీరు వంటి అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. ప్రతి కేసులో వేగం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. గంజాయి సరఫరాదారులపై ప్రత్యేక దృష్టి గంజాయి వినియోగదారులను పట్టుకోవడం మాత్రమే కాకుండా, సరఫరా చేస్తున్న ప్రధాన నెట్వర్క్‌ను ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పా...
Medaram Jatara 2026 : 3 కోట్ల మంది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..
State, warangal

Medaram Jatara 2026 : 3 కోట్ల మంది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..

మేడారం: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ మహాజాతర–2026 (Medaram Jatara 2026) కు ములుగు జిల్లా మేడారం సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరగనున్న ఈ మహా వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మంత్రి సీతక్క మేడారంలోనే బస చేస్తూ, ప్రతి విభాగాన్ని నిశితంగా సమీక్షిస్తున్నారు. జాతరను సమర్థంగా నిర్వహించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించారు. 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులతో పాటు, 2,000 మంది ఆదివాసీ యువ వాలంటీర్లు సేవలందిస్తున్నారు.నెట్‌వర్క్ సమస్యలు తలెత్తకుండా 60 మొబైల్ టవర్లు (27 శాశ్వత, 33 తాత్కాలిక), 450 VHF సెట్లను ఏర్పాటు చేశారు. మేడారం జాతర 2026 - గణంకాలు అంశంవివరాలుభక్తుల అంచనాసుమారు 3 కోట్లువిధుల్లో సిబ్బంది42,027 మందిఆర్టీసీ బస్సులు4,000 (51,000 ట్రిప్పులు)మొబైల్ టవర...
error: Content is protected !!