Sarkar Live

warangal

Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
State, warangal

Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం

రూ.2 కోట్ల విలువైన బోగీ దగ్ధం! మానుకోట (Mahaboobabad): మానుకోట జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌ (Kesamudram Railways Station)లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్క‌సారిగా మంటలు (Fire Accident) చెల‌రేగాయి. దీంతో ఆ బోగీలో నిద్రిస్తున్న సిబ్బంది వెంటనే మేల్కొని బయటకు ప‌రుగులు తీశారు. పక్కనే రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కొంద‌రు కార్మికులు కూడా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన రైలు బొగీ పూర్తిగా దగ్ధమైంది. కేసముద్రం (Kesamudram SI) ఎస్సై మురళీధర్ రాజ్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు సేక‌రించారు. మహబూబాబాద్ నుంచి అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రక...
Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!
warangal, State

Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!

వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యేదెన్నడు? Warangal Collectorate | వరంగల్ నగర ప్రజల అభివృద్ధికి మూలస్తంభంగా నిలవాల్సిన కలెక్టరేట్ భవనం ఇప్పటికీ పూర్తి కావడం లేదు. 2023 జూన్ 17న ఈ సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటికే 25 నెలలు గడుస్తున్నా, పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించడంలేదు. ప్రతిరోజూ పనులు జరిగినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆశించినంత వేగం లేదు. దీంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ సమీకృత భవన నిర్మాణ పనులు జాప్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ప్రజల అభివృద్ధి కలలన్నీ కొలువుదీరే కేంద్రంగా ఆశించిన కొత్త కలెక్టరేట్ భవనం ఇప్పటికీ ‘పూర్తి’ రూపం దాల్చకపోవడం స్థానికులను కలవరపెడుతోంది.అధికారికంగా నిర్మాణం ప్రారంభించి 25 నెలలు గడుస్తున్నా పనుల పురో...
Mamnoor Airport | వరంగల్​ విమానాశ్రయ నిర్మాణంలో కీలక అడుగు
State, warangal

Mamnoor Airport | వరంగల్​ విమానాశ్రయ నిర్మాణంలో కీలక అడుగు

భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల గ్రేటర్ వరంగల్ (Warangal)లోని మామునూరు విమానాశ్రయం (Mamnoor Airport) నిర్మాణంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.205 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు వద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రాం​మోహన్​ నాయుడు ఈ మార్చిలో అనుమతిచ్చారు. ఈమేరకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ) నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత ప్రతిపాదనపై సంతకం కూడా చేశారు. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ (Mamnoor Airport) నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రాం​మోహన్​ నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణ కోసం ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేయడంతో వరంగల్​ నగరవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలుగు వా...
Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం
warangal, State

Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం

Kazipet Coach Factory News | కాజీపేట రైల్వే కోచ్‌ పరిశ్రమ వరంగల్‌ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల అని ఆ కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోచ్​ ఫ్యాక్టరీ పనుల గురించి అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో మెగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని.. పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీతో 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని తెలిపారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకో మోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని చెప్పారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్...
Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ
warangal, State

Konda Murali | కొండా మురళి మరోసారి ప్రకంపనలు: మీనాక్షికి లేఖ, మీడియాకు స్పష్టీకరణ

వివాదాల నడుమ కీలక పరిణామం 16 పేజీల నివేదికతో మీనాక్షి నటరాజన్‌ను కలుసిన సురేఖ Warangal News | కొండా మురళి.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ గా చేసిన విమర్శలు కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్టేషన్ ఘన్ పూర్ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా ఆయ‌న‌ విమర్శించారు. దీంతో ఆయా నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే గురువారం తన సతీమణి, మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తో కలిసి కొండా ముర‌ళి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan) తో భేటీ అయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అలాగే మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ అంద‌జేశారు. Kond...
error: Content is protected !!