Sarkar Live

Trending

అన్న‌దాత‌ల‌తో ఆప్యాయంగా మంత్రి సీతక్క –  Minister Seethakka
Trending

అన్న‌దాత‌ల‌తో ఆప్యాయంగా మంత్రి సీతక్క – Minister Seethakka

కూలీలతో ఆత్మీయ ప‌ల‌క‌రింపు.. Mulugu News | తెలంగాణలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రైతులు వ్య‌వ‌సాయ ప‌నుల్లో బిజీగా మారిపోయారు. అయితే మంత్రి సీతక్క (Minister Seethakka) రైతుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. వరి నాట్లు వేసుకుంటున్న కూలీల వద్దకు స్వయంగా వెళ్లి, బురదమ‌య‌మైన‌ పొలంలోకి దిగారు. కూలీల ఆరోగ్యం, వ్య‌వ‌సాయ ప‌నుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షం కారణంగా పని చేస్తూ తడిసిపోతున్న కూలీలకు రక్షణగా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేసిన రెయిన్ క‌వ‌ర్స్‌ను పంపిణీ చేశారు. ఆమె స్వయంగా కూలీలకు కవర్లు తొడగడం ద్వారా తన ఆప్యాయ‌త‌ను చాటుకున్నారు. ఆ తర్వాత మంత్రి సీతక్క (Minister Seethakka) కూలీలతో మాట్లాడుతూ, వారికి అందుతున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ రెండు మూడు రోజుల్లో రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వారి వద్దకు ...
MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..
Trending, Viral

MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..

అంత్యక్రియల సమయంలో బయటపడ్డ నిజం Warangal MGM Hospital | రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital ) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువులు, స్నేహితులు అంతా సదరు వ్యక్తి మృతదేహం చుట్టూ చేరి కన్నీరుమున్నీరయ్యారు. ఈక్రమంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక చివరిసారిగా మృతుని ముఖం చూడాలన బంధువులు భావించారు. శవానికి చుట్టిన వస్త్రాన్ని తొలగించి చూడగా అందరూ అవాక్కయ్యారు. ఆ శవం తమ వ్యక్తికి కాదని గుర్తించడంతో అక్కడ కలకలం రేపింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తొర్రూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతడిని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు చికిత్స ప...
పలు జిల్లాల్లో డెంగ్యూ విజృంభణ.. జాగ్రతలు ఇలా తీసుకోండి.. -Rainy Season Diseases
Trending

పలు జిల్లాల్లో డెంగ్యూ విజృంభణ.. జాగ్రతలు ఇలా తీసుకోండి.. -Rainy Season Diseases

Rainy Season Diseases | వర్షాకాలానికి వచ్చిందంటే చాలు ఇంట్లో ఒక్కొక్కరిగా విషజ్వరాలు అంటుకుంటాయి. జ్వరంతో మొదలై జలుబు, దగ్గు తీవ్రతరమై మంచం పడతారు. ఈ వర్షాకాలం వస్తూ వస్తూ తనతో పాటు ఎన్నో రకాల వ్యాధులను వెంటతీసుకొని వస్తుంటుంది. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యూ వంటి జ్వరాలు వ్యాపిస్తుంటాయి. ఇది సాధారణంగా 8-10 రోజుల పాటు వేధిస్తుంటుంది. ఇందులో డెంగీతో ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఇది ఏడిస్‌ దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉండడంతో మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. Scarlet Fever Rainy Season Diseases : తెలంగాణ వ్యాప్తంగా విష జ్వరాలు వర్షాకాలం మొదలవడంతోనే హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వైరల్ జ్వరాలు, ముఖ్యంగా డెంగ్యూ, ...
Tatkal Ticket | ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక‌.. రైల్వే తత్కాల్ టిక్కెట్ల జారీకి కొత్త రూల్స్
Trending

Tatkal Ticket | ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక‌.. రైల్వే తత్కాల్ టిక్కెట్ల జారీకి కొత్త రూల్స్

IRCTC New Rules in Tatkal Ticket Issue | జూలై 1 నుంచి తత్కాల్ కేటగిరీ కింద టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులకు భారతీయ రైల్వే కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నియమాలు ప్రయాణీకులకు టికెట్ బుకింగ్ ప్ర‌క్రియ‌ను మ‌రింత సులువు చేయ‌డ‌మే కాకుండా మోసాలను నివారిస్తాయ‌ని భావిస్తున్నారు. ఏజెంట్లు, బాట్‌ల కారణంగా టిక్కెట్లు మాయమవుతున్నాయని ప్రయాణీకుల ఫిర్యాదుల నేపథ్యంలో కొత్త నియమాలు వచ్చాయి. అయితే, నిబంధనలలో మార్పులు ప్రయాణికులకు ఉపశమనం కలిగించవచ్చు. తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు వారికి మ‌రిన్ని సౌక‌ర్యాలు ఇవ్వొచ్చు. Tatkal Booking : తత్కాల్ బుకింగ్ నిబంధనలలో మార్పులు భారత రైల్వేలు ప్రకటించిన మార్పుల ప్రకారం, జూలై 1 నుంచి ఆధార్-ప్రామాణీకరించబడిన వినియోగదారులు మాత్రమే తత్కాల్ పథకం కింద టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, "ఆధార్ క...
“ఎయిర్ కండిషనింగ్‌కి కొత్త నియమాలు: 20°C కంటే చల్లగా వద్దంట!” AC Temperature Guidelines 2025
LifeStyle, Trending

“ఎయిర్ కండిషనింగ్‌కి కొత్త నియమాలు: 20°C కంటే చల్లగా వద్దంట!” AC Temperature Guidelines 2025

AC Temperature Guidelines India 2025 భారతదేశంలోని ఎయిర్ కండిషనర్ల వినియోగంలో ఏసీల ఉష్ణోగ్రతలను ప్రామాణీకరించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకురావాలని భావిస్తోంది. ACల ఉష్ణోగ్రతలను 20°C కంటే తక్కువకు లేదా 28°C కంటే ఎక్కువకు ఉంచకూడదని నిబంధనలను రూపొందిస్తోంది. ఈవిషయాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) తాజాగా ప్రకటించారు. "ఎయిర్ కండిషనింగ్ ప్రమాణాలకు సంబంధించి, త్వరలో ఒక కొత్త నిబంధన (AC Temperature Rules) అమలు చేయనున్నారు. ACల ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య సెట్ చేయబడుతుంది. అంటే మనం 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ చల్లబరచలేం.. అలాగే 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేయలేం" అని ఖట్టర్ చెప్పారు. AC Temperature Guidelines : ఎందుకీ మార్పు? వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ...
error: Content is protected !!