Hyderabad | కవిత కుమారుడు పొలిటికల్ ఎంట్రీ తల్లితో కలిసి బీసీ బంద్ ధర్నాలో పాల్గొన్న ఆదిత్య!
                    BC Bandh Hyderabad | తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం నుంచి మరో తరం పొలిటికల్ ఎంట్రీ ఇస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తాజాగా బీసీ బంద్కు మద్దతు తెలుపుతూ రంగంలోకి దిగారు.
ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత ధర్నా చేశారు. అయితే, ఈ ధర్నాలో ఆమె కుమారుడు ఆదిత్య కూడా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తల్లితోపాటు రోడ్డుపై బైఠాయించి బీసీ రిజర్వేషన్ల కోసం నినాదాలు చేశారు. ఆదిత్య తన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగు వేసినట్లు పలువురు భావిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బంద్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఆ పిలుపునకు మద్దతుగా కవిత సైతం ఉద్యమంలో పాల్గొని, బీసీ హక్కుల కోసం తన సమరభే...                
                
             
								



