Sarkar Live

Kancha Gachibowli issue | కంచ గచ్చిబౌలి భూ వివాదంలో కీల‌క మ‌లుపు..

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలో కంచ గచ్చిబౌలి భూ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టు దృష్టిలోకి వెళ్లింది. ఈ భూములపై జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున పర్యావరణ నష్టం జరుగుతోందని పలు సంస్థలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Kancha Gachibowli issue

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలో కంచ గచ్చిబౌలి భూ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టు దృష్టిలోకి వెళ్లింది. ఈ భూములపై జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున పర్యావరణ నష్టం జరుగుతోందని పలు సంస్థలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌ప‌థ్యంలో మీడియాలో అనేక‌ కథనాలు వెలువడుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC)ని నియమించింది. కంచ గ‌చ్చిబౌలి స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Kancha Gachibowli issue : అధికారులతో సీఈసీ స‌భ్యుల‌ భేటీ

సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ సభ్యులు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ కమిటీకి సిద్దాంత్ దాస్ అధ్యక్షత వహిస్తుండగా ఇతర సభ్యులుగా CP గోయల్, సునీల్ లిమయే, JR భట్ ఉన్నారు. వీరు గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రత్యక్షంగా పరిశీలన (Supreme Court CEC Hyderabad inspection) ప్రారంభించారు. వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు కూడా ఫీల్డ్‌ విజిట్‌ సమయంలో హాజరయ్యారు. ఈ కమిటీ సభ్యులు ప్రస్తుతం తాజ్ కృష్ణ హోట‌ల్‌లో బస చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారితో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున పూర్తి వివరాలను సేక‌రించారు.

విద్యార్థి సంఘాలు, ఎన్జీవోల‌తో స‌మావేశం

కమిటీ సభ్యులు పలు విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు, ఇతర పౌర సమాఖ్యల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం కానున్నారు. గచ్చిబౌలి పరిసరాల్లో పర్యావరణ నష్టం (Environmental violations Gachibowli) జరుగుతోందనే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ సందర్భంగా వినతులు, ఫిర్యాదులు స్వీక‌రించ‌నున్నారు. విశ్వవిద్యాలయ పరిసరాల్లో స్పాటెడ్ డియర్ సహా పలు జంతువుల ప్రాణాలకు ప్రమాదం కలుగుతోందన్న ఆరోపణలు ఇప్పటికే వెలువడ్డాయి.

Kancha Gachibowli issue : 16న సుప్రీంకు నివేదిక స‌మ‌ర్ప‌ణ‌

ఈ కమిటీ తన పూర్తి నివేదిక (CEC report Kancha Gachibowli)ను ఏప్రిల్ 16లోగా సుప్రీం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. దీని ఆధారంగా కంచ గచ్చిబౌలి భూముల భవితవ్యాన్ని కోర్టు నిర్ణయించనుంది. అభివృద్ధి పనులు కొనసాగాలా? నిలిపివేయాలా? పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలా? అన్న అంశాలపై ఈ రిపోర్టు కీలకం కానుంది.

సుప్రీం కోర్టు జోక్యం.. కీల‌క మ‌లుపు

కంచ గచ్చిబౌలిలోని ఈ భూభాగంలో అభివృద్ధి పనుల‌ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అయితే… వీటి వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. మ‌రోవైపు అభివృద్ధి పేరిట పచ్చదనాన్ని తుడిచిపెట్టేస్తున్నారని పర్యావరణ ప‌రిరక్ష‌ణ‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే మీడియాలో అనేక‌ కథనాలు (Telangana land dispute news) వెలువడ్డాయి. ఈ వివాదం రాజకీయంగా, సామాజికంగా క‌ల‌క‌లం రేపుతున్న క్ర‌మంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవ‌డం కీల‌క మలుపుగా మారింది. ఈ వివాదంపై స్పందించిన సుప్రీం కోర్టు (Supreme Court on Gachibowli land) సుమోటోగా ఈ కేసును స్వీకరించింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?