హైదరాబాద్: హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. ఈమేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్ మున్సిపల్ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నిజాంపేట్ మునిసిపల్ కమిషనర్, బాచుపల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే నంబరు 334లో వెలిసిన అక్రమ నిర్మాణాలను టౌన్ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది ఎక్సకవేటర్తో కూల్చివేశారు. తుర్కచెరువు బఫర్ జోన్లో ఉన్న నాలుగు గదులను కూడా నేలమట్టం చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ, టౌన్ప్లానింగ్ అధికారులు నరేందర్రెడ్డి, భానుచందర్, ప్రశాంతి పాల్గొన్నారు.
2 Comments
[…] డిజైన్లు, బ్రెయిలీ లిపితో కూడిన టిక్కెట్ కౌంటర్లు, బ్రెయిలీ-ప్రారంభించబడిన […]
[…] హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అనేది చెరువులు, ఉద్యానవనాలు, ప్రభుత్వ భూములు వంటి ప్రజా ఆస్తులను రక్షించడానికి సృష్టించబడిన ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్. ఇది ఇప్పటికే హైదరాబాద్లో అనధికార నిర్మాణాలను కూల్చివేసి, భూ కబ్జాదారులపై చర్య తీసుకోవడం ద్వారా తన తడాఖాను చూపించింది. దీని విజయాన్ని చూసిన ప్రభుత్వం హైడ్రాకు మరిన్ని అధికారాలను ఇచ్చింది. దీనిని ఇతర జిల్లాలకు విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. […]