Sarkar Live

Modi Visit | అమ‌రావ‌తికి పీఎం మోదీ.. రాజ‌ధాని ప‌నుల‌కు శ్రీ‌కారం

Modi Visit : ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమరావతి (Amaravati)లో పర్యటించనున్నారు. రాజధాని పనుల (capital city’s construction works) పునఃప్రారంభానికి మే 2న ఆయన రానున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (state government)

Modi Visit

Modi Visit : ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమరావతి (Amaravati)లో పర్యటించనున్నారు. రాజధాని పనుల (capital city’s construction works) పునఃప్రారంభానికి మే 2న ఆయన రానున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (state government) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ (Minister P. Narayana) ఈ రోజు అమరావతిలో పర్యటించారు. మోదీ టూర్‌కు సంబంధించిన‌ ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ్ తదితరుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

Modi Visit : రాజధాని పనులకు ఊతం

రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న ప్ర‌తిష్టాత్మ‌కం (prestigious)గా మారింది. ఆయ‌న రాక‌తో రాజధాని నిర్మాణానికి (capital city’s construction) ఊతం లభిస్తుందని చంద్ర‌బాబు ప్రభుత్వం భావిస్తోంది. మోదీ పర్యటనకు గడువు సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి పి. నారాయణ అధికారులతో కలిసి ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, వేదిక వద్దకు చేరుకునే మార్గాలను పరిశీలించారు.

90 శాతం పూర్త‌యిన ఏర్పాట్లు

ప్రధాని మోదీ మే 2న సాయంత్రం 3.25 గంటలకు అమరావతి చేరుకుంటారు. రూ. 43 వేల కోట్ల విలువైన పనులను ఆయ‌న ప్రారంభించనున్నారు. మూడేళ్లలో రాజధాని పనులన్నీ పూర్తి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యం పెట్టుకుంది. దానికి అనుగుణంగా ఏమాత్రం జాప్యం చేయ‌కుండా ముందుకు సాగాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించింది.

రైతులతో సీఎం చంద్రబాబు చర్చ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) రైతులతో భేటీ అయ్యారు. సుమారు గంటలపాటు వారితో మాట్లాడారు. ప్ర‌ధాని స‌భ‌కు రావాల‌ని రైతులను సీఎం ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అమరావతి (Amaravati)పై పార్లమెంటులో చట్టం చేయాలని ప్ర‌ధానిని కోరాల‌ని చంద్ర‌బాబు ముందు రైతులు ప్ర‌స్తావ‌న పెట్టారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!