Janagama : జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు దారుణ హత్య (Murder )కు గురికావడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి (75), కుమార్తె (45)ను దుండగులు హత్య చేసి పారిపోయారు. జఫర్గఢ్ మండలం తుమ్మడపల్లి ఐ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.