Myanmar Earthquake | మయన్మార్లో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం (7.7 magnitude earthquake) ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వందలాది భవనాలు కూలిపోగా (Building Collapse) వేలాది మంది గాయపడ్డారు. శనివారం వరకు మరణించిన వారి సంఖ్య 1002గా నమోదైంది. గాయపడినవారి సంఖ్య 2376కి చేరింది. ఇంకా 30 మంది (more bodies) ఆచూకీ గల్లంతైంది.
కూలిన భవనాలు.. నేలమట్టమైన వంతెనలు
భూకంప ప్రభావంతో మయన్మార్ (Myanmar )లోని ప్రధాన నగరాలు మాండలే, నేపీడా, బాగో, యాంగాన్ ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, రహదారులు (Road Cracks) ధ్వంసమయ్యాయి. కొన్ని వంతెనలు నేలమట్టమయ్యాయి (Bridges Collapse). భూకంప దాటికి కొన్ని ప్రాంతాల్లో భూగర్భ నీరు పైకి పొంగి వరదలా మారింది. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం సహాయక (Rescue Efforts) బృందాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి.
సహాయక చర్యలకు అడ్డంకిగా అత్యురుద్ధం
మయన్మార్ (Myanmar)లో ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్యుద్ధం (Civil War) సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో మిలటరీ దళాలు, తిరుగుబాటు గ్రూపుల మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో సహాయక బృందాలు పూర్తిగా సహకరించడం లేదని తెలుస్తోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీస్తారో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. వేగంగా సహాయ చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.
బ్యాంకాక్లో కూడా భూకంపం
ఈ భూకంప ప్రభావం పొరుగుదేశమైన థాయిలాండ్లోని బ్యాంకాక్ నగరం (Bangkok city)పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అక్కడి భవనాలు కుప్పకూలాయి. ముఖ్యంగా చటుచక్ మార్కెట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం ఒక్కసారిగా నేలకొరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా 26 మంది గాయపడ్డారు, ఇంకా 47 మంది గల్లంతయ్యారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక బృందాలు (Rescue Operations) ప్రయత్నిస్తున్నాయి. శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
Myanmar Earthquake : ముందుకు వచ్చిన ప్రపంచ దేశాలు
భూకంప బాధితుల (Myanmar Earthquake)ను రక్షించేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ముందుకు వచ్చాయి. చైనా యునాన్ ప్రావిన్స్ నుంచి 37 మంది సభ్యుల బృందం యాంగాన్ నగరానికి చేరుకుంది. వారు భూకంప డిటెక్టర్లు, డ్రోన్లు, సహాయ సామగ్రిని వినియోగిస్తున్నారు. రష్యా 120 మంది సహాయక సిబ్బందిని రెండు విమానాల్లో పంపింది. భారతదేశం NDRF బృందాలను, వైద్య సేవల బృందాన్ని, అవసరమైన సహాయ సామగ్రిని పంపింది. మలేషియా 50 మంది సహాయక బృందాన్ని ఆదివారం పంపనుంది. ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా 5 మిలియన్ డాలర్లు సహాయ నిధులను కేటాయించింది. భూకంప బాధితులకు ఇంకా తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలు మయన్మార్కు సహాయం అందించాలని, ఈ విపత్తు ప్రభావాన్ని తగ్గించేందుకు అణచివేయని చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులు కోరుతున్నారు.
ఆస్పత్రుల్లో రక్తం కొరత
భూకంప (Myanmar Earthquake) ప్రభావిత ప్రాంతాల్లో రక్తదానం (Blood Donation) అత్యవసరమైంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య పెరిగిపోవడంతో రక్త సరఫరా కొరత ఏర్పడింది. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం యాంగాన్, మాండలే, బాగో వంటి ప్రధాన ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
Myanmar Earthquake : ఆందోళనకరంగానే పరిస్థితి
భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు (Rescue Operations) కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మళ్లీ జరగకుండా బలమైన భవన నిర్మాణ ప్రమాణాలు, భూకంప భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
భూకంప శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. మయన్మార్ భూకంపాల (Myanmar Earthquake)కు ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటి. ఇలాంటి భారీ భూకంపాలు మరిన్ని వచ్చే అవకాశం ఉందని US Geological Survey హెచ్చరించింది. భూకంపం మరిన్ని చిన్నచిన్న భూకంపాలకు దారి తీసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూకంప భయంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. రాత్రంతా తెరుచుకున్న ప్రదేశాల్లో, గుడులు, మసీదులు, మైదానాల్లో వేలాది మంది రాత్రిని గడిపారు. అనేక ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తాజా తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..