Sarkar Live

Nithyananda | నిత్యానంద స్వామి జీవ సమాధి.. నిజ‌మేనా?

Nithyananda : వివాదాస్పద (Controversial Figure) ఆధ్యాత్మిక గురువు (Jeeva Samadhi) నిత్యానంద స్వామి (Nithyananda) జీవ సమాధి చెందినట్టు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ మంగళవారం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు (Viral on

Nithyananda

Nithyananda : వివాదాస్పద (Controversial Figure) ఆధ్యాత్మిక గురువు (Jeeva Samadhi) నిత్యానంద స్వామి (Nithyananda) జీవ సమాధి చెందినట్టు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ మంగళవారం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు (Viral on Social Media) కొట్టింది. నిత్యానంద భక్తులు (Nithyananda Devotees) ఈ ప్రకటనతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. కొందరు ఆయన ఆత్మ శాంతికి ప్రార్థనలు చేస్తుండగా, మరికొందరు ఈ సమాచారం నిజమా? కాదా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వార్త ఎలా వెలుగు చూసింది?

నిత్యానంద స్వామి కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువు (Controversial Figure)గా మారారు. 2019లో ఆయనపై అత్యాచార ఆరోపణలు (Rape Allegations) వచ్చాయి. ఈ కేసులు పెరుగుతుండటంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన గురించి స్పష్టమైన సమాచారం ఎవరికీ తెలియలేదు. కొంతకాలానికి దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలో ఒక ద్వీపాన్ని సొంతం చేసుకుని దానికి “కైలాస దేశం” (Kailasa Nation) అని నామకరణం చేశారు. ఈ క్ర‌మంలోనే నిత్యానంద స్వామి మరణించినట్టు ఆయ‌న మేనల్లుడు సుందరేశ్వర్ ప్రకటించడంతో అనేక సందేహాలు రేకెత్తాయి. ఈ వార్త నిజమా? లేక కొత్త వివాదానికి నాంది మాత్రమేనా? అనే ప్రశ్నలు భక్తుల్లో కలవరం రేపాయి.

Nithyananda : జీవ స‌మాధి.. కైలాస దేశం అధికారిక ప్రకటన

ఈ ప్రకటనపై నిత్యానంద స్థాపించిన “కైలాస దేశం” (Kailasa Nation) స్పందించింది. నిత్యానంద స్వామి ఆరోగ్యంగా ఉన్నారని, జీవ సమాధి వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. మార్చి 30న జరిగిన ఉగాది (Ugadi Celebrations) వేడుకల్లో నిత్యానంద ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొన్నారని తెలిపింది. ఈ ప్రత్యక్ష ప్రసార (Live Broadcast) లింక్‌ను కూడా వారు విడుదల చేశారు. కైలాస దేశం అధికారిక ప్రకటనలో “స్వామిజీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన భక్తుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. కొందరు కావాలని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు” అని వివరించారు.

Nithyananda భక్తుల్లో గందరగోళం

నిత్యానంద ఆరోగ్యంగా ఉన్నారని కైలాస దేశం ప్రకటించినప్పటికీ, ఆయన భక్తులలో ఇంకా అనేక అనుమానాలు (Devotees’ Doubts) ఉన్నాయి. ఒకవైపు ఆయన మేనల్లుడు నిత్యానంద జీవ సమాధి అయ్యారని ప్రకటించారు. మరోవైపు కైలాస దేశం స్వామి ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. అయితే, ఇప్పటివరకు స్వయంగా నిత్యానంద స్వామి ఈ వార్తలపై స్పందించలేదు. ఉగాది వేడుకల్లో నిత్యానంద ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొన్నారని కైలాస దేశం ప్రకటించింది. అయితే, ఆ వీడియో వాస్తవంగా ప్రత్యక్ష ప్రసారమా? లేక పాత వీడియోను మళ్లీ ప్రదర్శించారా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. నిత్యానంద మేనల్లుడు ప్రకటించిన జీవ సమాధి వార్త నిజమైతే కైలాస దేశం ఎందుకు ఖండిస్తోంది? కైలాస దేశం చెప్పింది నిజమైతే ఆయన మేనల్లుడు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారు? అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?