Sarkar Live

నేడు 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం – Vande Bharat Metro

Vande Bharat Metro | బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగస్టు 10)న కర్ణాటకలో పర్యటించ‌నున్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయన జెండా

Vande Bharat Metro

Vande Bharat Metro | బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగస్టు 10)న కర్ణాటకలో పర్యటించ‌నున్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. దీని తర్వాత, ఆయన బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ (Bengaluru Metro Yellow Line)ను ప్రారంభించి, ఆర్‌వి రోడ్ (రాగిగుడ్డ) నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు.

తన కర్ణాటక పర్యటన గురించి, ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పోస్ట్ చేసి, ఆగస్టు 10న బెంగళూరు ప్రజలను క‌లుసుకోవ‌డానికి ఆస‌క్తిగా ఉంద‌ని చెప్పారు. కెఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తామ‌న్నారు. ఇది కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. బెంగళూరు పట్టణ మౌలిక సదుపాయాలను పెంచడానికి బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభిస్తారు. బెంగళూరు మెట్రో ఫేజ్-3కి శంకుస్థాపన చేస్తారు. నగరంలో ఒక ప‌బ్లిక్ మీటింగ్‌లో కూడా పాల్గొన‌నున్నారు.

బెంగళూరు మెట్రో ఫేజ్-2 ప్రారంభోత్సవం

ప్రధాని మోదీ బెంగళూరులో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అర్బన్ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. బెంగళూరు మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ (Bengaluru Metro Phase 2) కింద ఆర్‌వి రోడ్ (రాగిగుడ్డ) నుంచి బొమ్మసంద్ర వరకు ఎల్లో లైన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ లైన్ పొడవు 19 కి.మీ కంటే ఎక్కువ ఉంటుంది. ఈ మార్గంలో 16 స్టేషన్లు ఉన్నాయి. దీనికి దాదాపు రూ.7,160 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఎల్లో లైన్ ప్రారంభంతో, బెంగళూరులో మెట్రో నెట్‌వర్క్ 96 కి.మీ కంటే ఎక్కువగా పెరుగుతుంది. ఈ ప్రాంతంలోని పెద్ద జనాభాకు సేవలందిస్తుంది.

బెంగళూరు మెట్రో ఫేజ్-3 కు శంకుస్థాపన

దీనితో పాటు, రూ.15,610 కోట్లకు పైగా వ్యయంతో బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్టుకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 44 కి.మీ. కంటే ఎక్కువ ఉంటుంది. ఇందులో 31 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీరుస్తుంది. నివాస, పారిశ్రామిక, వాణిజ్య మరియు విద్యా రంగాలకు ఊత‌మిస్తుంది.

మూడు వందే భారత్ రైళ్లు..

ఈరోజు ప్రధాని మోదీ మూడు వందేభారత్ మెట్రో రైళ్ల (Vande Bharat Metro ) ను ప్రారంభించనున్నారు. ఇందులో బెంగళూరు నుంచి బెల్గాం (Belagavi), అమృత్‌సర్ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) నుంచి పూణే వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఈ హై-స్పీడ్ రైళ్లు ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా పెంచుతాయి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

మూడు వందే భారత్ రైళ్లు ఇవే..

  • బెంగళూరు – బెల్గాం
  • అమృత్‌సర్ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా
  • నాగ్‌పూర్ (అజ్ని) – పూణే

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?