Sarkar Live

Privacy Policy

Warangal | రేపు వ‌రంగ‌ల్‌లో సీఎం రేవంత్ ఏరియ‌ల్ స‌ర్వే..
State, warangal

Warangal | రేపు వ‌రంగ‌ల్‌లో సీఎం రేవంత్ ఏరియ‌ల్ స‌ర్వే..

వరంగల్‌ వరద బాధితుల సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం Warangal : మొంథా తుఫాన్ ప్ర‌భావంతో వ‌రంగ‌ల్ జిల్లా అత‌లాకుత‌ల‌మైంది.. భారీ వరదల కార‌ణంగా అనేక కాల‌నీలు పూర్తిగా మునిగిపోయి ప్ర‌జ‌లకు నిలువ నీడ లేకుండా పోయింది. అధికారులు, పోలీసులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు వ‌ర‌ద బాధితుల‌ను హుటాహుటిన పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులు, పోలీసు విభాగం, విపత్తు నిర్వహణ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం.. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈసంద‌ర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇండ్ల‌లో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాల‌ని, అవసరమైతే డ్రోన్ల సాయంతో తాగునీరు, ఆహార ప్యాకె...
మొంథా ఎఫెక్ట్.. నేడూ అతిభారీ వ‌ర్షాలు – Montha Cyclone Update
State, Karimnagar

మొంథా ఎఫెక్ట్.. నేడూ అతిభారీ వ‌ర్షాలు – Montha Cyclone Update

Montha Cyclone Update | ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న మొంత తుఫాను ఉత్తర-వాయువ్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలి, తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, బుధవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యవస్థ ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.దీని ప్రభావంతో గురువారం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర మరియు దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 60–70 కి.మీ వేగంతో, గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఈ ప్రాంతాలలో క్రమంగా గంటకు 40–50 కి.మీ., లేదా 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావ‌ర‌ణ శాఖ అధిక...
Warangal Rains | భారీ వర్షంతో  వరంగల్​ అతలాకుతలం
State, warangal

Warangal Rains | భారీ వర్షంతో వరంగల్​ అతలాకుతలం

జిల్లాలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం మానుకోట, డోర్నకల్​, వరంగల్​ రైల్వే స్టేష‌న్లలో నీటమునిగిన రైలు పట్టాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి పలు రైళ్లు.. మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు Warangal Rains | తుపాను మొంథా ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హన్మకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్‌ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, ఆ త‌ర్వాత‌ వరంగల్‌ జిల్లా కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63, సంగెంలో 23.48, వర్ధన్నపేటలో 22.8, సెంటీమీటర్ల వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 21.8, జనగామ జిల్లా గూడురులో 23.58, మహబూబాబాద్‌ జిల్లా ఇనగుర్తిలో 19.23, కరీంనగర్‌ జిల్లా బోర్నపల్లిలో 17.58, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 16.45, యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16.23 సెంటీమీటర్ల వర్...
Cyclone Montha | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. అధికారుల‌కు సీఎం రేవంత్‌ అత్యవసర ఆదేశాలు
State, Hyderabad

Cyclone Montha | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. అధికారుల‌కు సీఎం రేవంత్‌ అత్యవసర ఆదేశాలు

Hyderabad | మొంథా తూపాన్‌ (Cyclone Montha) తీవ్ర వాయుగుండంగా మారి దక్షిణ భారతదేశంలో కుంభ‌వృష్టి కురిపిస్తోంది. తెలంగాణలో కూడా తుఫాను ప్రభావం పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటిన మొంథా తుఫాన్‌ భద్రాద్రి కొత్తగూడం మార్గంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ‌వారం ఉద‌యం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ (Warangal) , నల్గొండ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి కలెక్టర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సమన్వయంతో నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని చెప్ఆప‌రు.సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, వర్షాల ప్రభావం, నష్టాలపై అత్య‌వ‌సరంగా చేప‌ట్టాల్సిన ప‌నుల‌పైసమీ...
Montha Cyclone | మొంథా తుఫాన్ ప్ర‌భావం.. తెలంగాణ‌లో దంచికొడుతున్న వ‌ర్షాలు..
State, Hyderabad

Montha Cyclone | మొంథా తుఫాన్ ప్ర‌భావం.. తెలంగాణ‌లో దంచికొడుతున్న వ‌ర్షాలు..

హైద‌రాబాద్‌, స‌ర్కార్‌లైవ్ : మొంథా తుపాను (Montha Cyclone) ప్ర‌భావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, పాల‌మూరు జిల్లా వ్యాప్తంగా వాన‌లు విజృంభిస్తున్నాయి. నిన్న‌టి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న కుండ‌పోత వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌ల్వ‌కుర్తి మండ‌లం ర‌ఘుప‌తిపేట వ‌ద్ద దుందుభి న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుంది. దీంతో క‌ల్వ‌కుర్తి – నాగ‌ర్‌క‌ర్నూల్ మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. చెట్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఈరోజు జ‌ర‌గాల్సిన ప‌రీక్షల‌ను వాయిదా వేశారు. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా జోరుగా వాన‌లు ప‌డుతున్నాయి. దీంతో జిల్లా అధికార యంత్ర...
error: Content is protected !!