Sarkar Live

Privacy Policy

Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు
State, warangal

Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు

Medaram Jatara 2026 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara 2026) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు బుధవారం ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది.  రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు.  జ‌న‌వ‌రి 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కీల‌క‌మైన ఘ‌ట్టం ఉంటుంది. ఇక 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో  వెల్లడించారు....
ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెల‌ల్లో 125 మంది అరెస్టు..
Crime

ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెల‌ల్లో 125 మంది అరెస్టు..

ACB Raids in Telangana | తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) జూన్ - 2025లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్ల‌డించింది. ఈమేర‌కు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్‌లో ప్ర‌క‌టించింది. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ప్రైవేట్ వ్యక్తితో సహా 25 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేశారు. తర్వాత వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వివిధ విభాగాల ట్రాప్ కేసుల్లో రూ.3.43 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. రెండు డిఎ కేసులలో, రూ.13.50 లక్షలు, రూ.5.22 కోట్ల విలువైన ఆదాయానికి మించి ఆస్తులు బయటపడ్డాయి. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో, లెక్కల్లో చూపని రూ.2.72 ల...
DIEO | అవును.. ’వేదాంతు‘కు అనుమతి లేదు
Special Stories

DIEO | అవును.. ’వేదాంతు‘కు అనుమతి లేదు

స్పష్టం చేసిన హన్మకొండ డీఐఈవో గోపాల్ హన్మకొండ డీఐఈవో (Hanamkonda DIEO) స్పందించారు. ఆ కాలేజీకి అనుమతులు లేవని స్పష్టం చేశారు. "బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్" కు రిపోర్ట్ రాసి పంపిస్తామని తెలిపారు. హన్మకొండ నగరంలో ఎలాంటి అనుమతి లేకుండా అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్న వైనంపై సోమవారం "అనుమతి లేని వేదాంతు"అనే శీర్షికన సర్కార్ లైవ్ కథనం వెలువరించింది. ఈ కథనం పై స్పందించిన హన్మకొండ డీఐఈవో గోపాల్ (DIEO Gopal) మాట్లాడుతూ వేదాంతు (Vedantu) కు విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతి లేదని దీనిపై ఇంటర్మీడియట్ బోర్డు కు రిపోర్ట్ రాసి పంపిస్తామని సర్కార్ లైవ్ ప్రతినిధితో అన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని ,అకాడమీ పేరుతో కళాశాల నిర్వహించడం సరికాదని డిఐఈవో తెలిపారు. కాగా ఇప్పటికే సదరు యాజమాన్యం అనుమతి లేకుండానే అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల నుండి ఫీజుల ...
Pasmailaram Blast | పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 45కి చేరిన మృతుల సంఖ్య
Crime

Pasmailaram Blast | పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 45కి చేరిన మృతుల సంఖ్య

గుర్తించలేని స్థితిలో మృతులు.. డీఎన్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న ప్ర‌భుత్వం Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం (Pasmailaram ) పారిశ్రామికవాడలోని సిగాచి క్లోరో కెమికల్స్ భారీ పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కి చేరింది. ఇది తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా కొందరు భావిస్తున్నారు.NDRF, HYDRAA, తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రేయింబవళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వివిధ ఆసుపత్రులలో 35 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. బహుశా, ఇది తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా ప‌లువురు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడి నుండి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి ప్రభుత్వ...
మళ్లీ నవ్వించే టైమ్ వచ్చేసింది! హెరాఫేరీ 3లో పరేష్ రావెల్ తిరిగొస్తున్నాడా? – Hera Pheri 3
Cinema

మళ్లీ నవ్వించే టైమ్ వచ్చేసింది! హెరాఫేరీ 3లో పరేష్ రావెల్ తిరిగొస్తున్నాడా? – Hera Pheri 3

హిట్ ఫ్రాంచైజీ లు ఈ మధ్య ఎలా ఆడుతున్నాయో మనకు తెలుసు. బాలీవుడ్ హిట్ ఫ్రాం చైజీ హెరాఫేరీ (Hera Pheri 3) కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు వచ్చిన రెండు పార్టులు కూడా భారీ విజయాలనే అందుకున్నాయి. ఒకప్పుడు సినిమాను ఏలిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ మధ్య సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతోంది. భారీ అంచనాలతో వచ్చిన మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. వందల కోట్ల హీరోల సినిమాలు కూడా యావరేజ్ రేంజ్ లోనే ఆగిపోతున్నాయి. అప్పుడప్పుడు ఒకటో రెండో సినిమాలు బాలీవుడ్ కి ఊపిరి పోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో హెరాఫేరీ ప్రాంచైజీ నుండి మూవీ ని అనౌన్స్ చేశారు. హెరాఫేరీ 3 (Hera Pheri 3)రాబోతున్నట్టు తెలిపారు. తొలి రెండు పార్టుల లో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, టబు, పరేష్ రావెల్ (Akshay Kumar, Sunil Shetty, tabu, Paresh Ravel) మెయిన్ క్యారెక్టర్ లలో యాక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చే మూడో పార్టు ని అక్షయ్ క...
error: Content is protected !!