Sarkar Live

Privacy Policy

ACB Arrest | రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్
Crime, Karimnagar

ACB Arrest | రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

ACB Arrest | పెద్దపల్లి జిల్లా(Peddapalli)లో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పెద్దపల్లికి చెందిన ఓ రైతు నుంచి భూమి సర్వే చేసిన రిపోర్టు ఇవ్వడానికి సర్వేయర్ భారీగా లంచం డిమాండ్‌ చేశాడు. అందుకు ఆ రైతు కొంత మొత్తం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ.10,000 ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి ద్వారా మండల సర్వేయర్ పైండ్ల సునీల్ అకౌంట్ కు బదిలీ చేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న సర్వేయర్ పైండ్ల సునీల్ ఫోన్ పే ద్వారా రూ.10,000 లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఓ రైతు భూమి సర్వే చేసి పంచానమా ఇవ్వడానికి రూ.10 వేలు సర్వేయర్ సునీల్ డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సర్వ...
ACB Raids | ఏసీబీ దాడులు..  రూ.6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్‌ అసిస్టెంట్‌
Crime, Adilabad

ACB Raids | ఏసీబీ దాడులు.. రూ.6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్‌ అసిస్టెంట్‌

ACB Raids in Mancherial | మంచిర్యాల జిల్లాలో ఏసీబీ(ACB) వలకు మరో అవినీతి చేప చిక్కింది. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం .. కోటపల్లి మండలం అంగరాజుపల్లి పీహెచ్‌సీలో ఇన్‌చార్జి జూనియర్ అసిస్టెంట్‌గా (Junior Assistance) విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ అనే వ్యక్తి అదే శాఖలో పని చేస్తున్న వ్యక్తి కి సంబంధించిన డీఏ ( DA ) నిధుల విడుదల చేసేందుకు రూ.6 వేలను లంచంగా డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంచిర్యాలలో బొమ్మరిల్లు హోటల్ వద్ద రూ.6 వేల లంచం తీసుకుంటుండగా పక్కా ప్లాన్ తో పట్టుకున్నట్లు వెల్లడించారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అం...
Warangal : వరంగల్ లో దంచికొట్టిన వాన.. పలు మార్గాల్లో రాకపోకలు బంద్..
warangal

Warangal : వరంగల్ లో దంచికొట్టిన వాన.. పలు మార్గాల్లో రాకపోకలు బంద్..

Warangal News : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతుండడంతో కాలనీలు, రహదారులు కుంటలు, వాగులను తలపిస్తున్నాయి. బట్టలబజార్‌, పాతబీటుబజార్‌ రోడ్లపై భారీగా నీరు నిలిచింది. హంటర్‌రోడ్‌, ఎన్టీఆర్‌నగర్‌, రామన్నపేట, శివనగర్‌, కరీమాబాద్‌ శాకరాశికుంట, ఎన్‌ఎన్‌నగర్‌, ఎస్​ఆర్​ నగర్​, గరీబ్​నగర్​ తదితర కాలనీలు ముంపునకు గురయ్యాయి.. ఇండ్లలోకి నీరు చేరింది. ఉర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్‌ నీటిమునిగింది. దీంతో అక్కడున్న గుడిసెవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిలో అండర్​ రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  ఇక హన్మకొండలోని గోకుల్ నగర్, టీ జంక్షన్, అంబేడ్కర్ భవన్ వంటి పలు ప్రాంతాల్లో రహదారులు...
ECI |  నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు.. తెలంగాణ నుంచి 9 పార్టీలు
National

ECI | నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు.. తెలంగాణ నుంచి 9 పార్టీలు

- రెండోదశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ న్యూదిల్లీ :  ‌చట్టబద్ధత, నిబంధనలు పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ (ECI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీఐ.. తాజాగా రెండో రౌండ్‌లో మరో 476 పార్టీలను గుర్తించి.. వాటిపై వేటు వేసేందుకు ప్రక్రియను మొదలుపెట్టింది. ఈసీ గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా.. తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని రాజకీయ పార్టీలను గుర్తించి, జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడిం...
Hanmakonda |  మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట ధ‌ర్నా..
State

Hanmakonda | మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట ధ‌ర్నా..

Hanmakonda News : హనుమకొండ రాంనగర్ లోని దేవాదాయ శాఖ‌ మంత్రి కొండా సురేఖ (Konda Surekha ) ఇంటి వద్ద సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో కార్మికులు ధ‌ర్నా నిర్వ‌హించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal ) అక్షయపాత్రకు ఇన్వొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం ఇంటిలోకి చొచ్చుకుపోయేందుకు మ‌ధ్యాహ్న భోజ‌న కార్మికులు (Mid-Day Meal Workers) యత్నించారు. నెలకు వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించడం చాలా బాధకరమ‌ని పేర్కొన్నారు. ఓట్ల కోసం మధ్యాహ్న భోజన కార్మికులను కాంగ్రెస్ పార్టీ (Congress Party) మోసం చేసింద‌ని ఫైర్ అయ్యారు. తమ స‌మ‌స్య‌ల‌ను వెల్ల‌బోసుకుందామ‌ని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్దకు వెళ్తే.. పోలీసులు అరెస్టు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఎలాంటి జీతాలు లేకున్నా కూడా అప్పులు తెచ్చి మ‌రీ విద్యార్థుల కోసం వండిపెట్టామని, ఇప్పుడు మాకు ఉపాధి లేక...
error: Content is protected !!