Sarkar Live

Privacy Policy

తొలి విడ‌త పోలింగ్ పూర్తి.. ఉత్సాహంగా ఓటు వేసిన గ్రామ‌స్థులు – Gram panchayat elections
State

తొలి విడ‌త పోలింగ్ పూర్తి.. ఉత్సాహంగా ఓటు వేసిన గ్రామ‌స్థులు – Gram panchayat elections

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram panchayat elections) తొలి దశ పోలింగ్ పూర్త‌య్యింది. తీవ్ర చ‌లి (Cold)ని కూడా లెక్క చేయ‌కుండా ఓట‌ర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ (Sarpanch), వార్డు సభ్యుల పదవుల (Ward member posts) కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటు వేయడానికి బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు (Senior citizens) ఉదయం నుంచే క్యూక‌ట్టారు. 56,19,430 మంది ఓటర్లు.. 37,562 పోలింగ్ కేంద్రాలు మొద‌టి విడ‌త పంచాయ‌తీ (Gram panchayat elections) ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు అభ్య‌ర్థులు పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56,19,430 మంది ఓటర్లు ఉండ‌గా 37,562 పోలింగ్ కేంద్రాలు (Polling stations) ఏర్పాటు అయ్యాయి. పోలింగ్ మధ్యాహ్నం ఒ...
దీపావ‌ళికి అరుదైన గౌవ‌రం-UNESCO జాబితాలో చోటు
Trending

దీపావ‌ళికి అరుదైన గౌవ‌రం-UNESCO జాబితాలో చోటు

భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన పండుగ‌ల్లో దీపావ‌ళి (Deepavali )ఒక‌టి. ఈ ప‌ర్వ‌దినానికి అంతర్జాతీయ గుర్తింపు ల‌భించింది. యునెస్కో త‌న ఇన్‌టాంజిబుల్ క‌ల్చ‌ర్ హెరిటేజ్ (Intangible Cultural Heritage – ICH) జాబితాలో చేర్చిందిఇ. డిల్లీలోని ఎర్ర‌కోట (Delhi’s Red Fort)లో జ‌రుగుతున్న UNESCO స‌ద‌స్సులోఈ నిర్ణ‌యం తీసుకున్నారు. యునెస్కో తన అధికారిక X పేజీలో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. భార‌తీయ సంస్కృతికి ప్ర‌తిబింబ‌మైన దీపావ‌ళికి ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతర్జాతీయ వేదికపై గొప్ప గుర్తింపు యునెస్కో స‌ద‌స్సుకు ఈసారి భార‌త‌దేశం ఆతిథ్య‌మిచ్చింది. ఈనెల 8న ప్రారంభ‌మైన ఈ స‌ద‌స్సు 13 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అంతర్జాతీయ ప్రతినిధులు (international representatives ), ప్రముఖ అతిథులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు కోస...
కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌- ఒక‌రి మృతి – Gram panchayat elections
State, Crime

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌- ఒక‌రి మృతి – Gram panchayat elections

Gram panchayat elections - Violent clash : పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ సూర్య‌పేట (Suryapet) జిల్లా నూత‌న్‌క‌ల్ మండ‌లంలోని లింగంప‌ల్లి (Lingampalli village)లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ ( BRS) శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త ఒక‌రు ప్రాణాలు కోల్పోగా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. పోలింగ్‌కు ముందు రోజు ఈ హింసాత్మ‌క సంఘ‌ట‌న (violent clash) జ‌ర‌గ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. చిన్న‌పాటి గొడ‌వ మొద‌లై.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంప‌ల్లిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు (Gram panchayat elections) తొలి విడ‌త (డిసెంబ‌రు 11) జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో గ్రామంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న‌పాటి గొడ‌వ‌గా మొద‌లై మాటామాట పెరిగి ఒక్క‌సారిగా ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. సుమారు 70 మంది కాంగ్రెస్, బీఆర్ఎ...
Bharat Future City లో మెగా ప్రాజెక్టులు: గ్రీన్ ఎనర్జీ, ఫిల్మ్ సిటీ, మోటార్‌స్పోర్ట్స్ & హెల్త్‌కేర్
State

Bharat Future City లో మెగా ప్రాజెక్టులు: గ్రీన్ ఎనర్జీ, ఫిల్మ్ సిటీ, మోటార్‌స్పోర్ట్స్ & హెల్త్‌కేర్

Bharat Future City projects : తెలంగాణ‌కు అత్యాధునిక హంగులు సంత‌రించుకోనున్నాయి. హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీకి అనేక కీల‌క మెగా ప్రాజెక్టులు (Mega Projects Telangana) రానున్నాయి. హైదర‌బాద్‌లో జ‌రుగుతున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ వేదిక‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ (Green energy projects), స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులు భారీగా ప్రవేశిస్తున్నాయి. రూ. 4 వేల కోట్ల‌తో 25 బయోగ్యాస్ ప్లాంట్లు గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అహీరత్ హోల్డింగ్స్ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణలో శుభ్రమైన ఇంధన విప్లవానికి (CBG plants in Telangana ) నాంది పలికే ప్రాజెక్టును స్థాపించ‌నున్న‌ట్టు పేర్కొంది. మొత్తం 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణ...
Sangareddy | స‌ర్పంచ్ అభ్య‌ర్థి అనుమానాస్ప‌ద మృతి- కాంగ్రెస్ నేత ఫామ్‌హౌజ్ స‌మీపంలో ఘ‌ట‌న‌
Crime

Sangareddy | స‌ర్పంచ్ అభ్య‌ర్థి అనుమానాస్ప‌ద మృతి- కాంగ్రెస్ నేత ఫామ్‌హౌజ్ స‌మీపంలో ఘ‌ట‌న‌

స‌ర్పంచ్‌ అభ్య‌ర్థి (sarpanch contestant) అనుమానాస్ప‌దంగా మృతి చెందిన సంఘ‌ట‌న‌ సంగారెడ్డి (Sangareddy) జిల్లా రాయికోడ్ (Raikode) మండ‌లంలో ఈ రోజు వెలుగు చూసింది. పిప్పాడ‌ప‌ల్లి గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్‌గా నామినేష‌న్ దాఖ‌లు చేసిన వ‌ల్కి రాజు మృత‌దేహం కాంగ్రెస్ (Congress) మండ‌ల అధ్య‌క్షుడు బాలాజీ న‌ర‌సింహులు ఫామ్‌హౌజ్ స‌మీపంలో ల‌భ్యమైంది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఫామ్‌హౌజ్‌కు వెళ్లాక ఏం జ‌రిగింది? స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త వ‌ల్కి రాజు తన స్వ‌గ్రామం పిప్పాడ‌ప‌ల్లి (Pippadpally) పంచాయ‌తీకి స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా నామినేష‌న్ (nomination) దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు బాలాజీ న‌ర‌సింహులును క‌ల‌వ‌డానికి గ్రామ శివారులో ఉన్న ఆయన ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. ఎన్నిక‌ల ప్ర‌చారం (election campaign), విజ‌యం సాధించ‌డాన...
error: Content is protected !!