కలెక్టర్ మేడం.. ప్రభుత్వ రోడ్డును రక్షించండి!
వరంగల్ జిల్లా పైడిపల్లి రెవెన్యూ శివారులో భూదాహం పెచ్చుమీరుతోంది. సామాన్యులకు చెందాల్సిన ప్రభుత్వ ఆస్తులు, దారులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమవుతున్నాయి. ఎన్.ఎస్.ఆర్ (NSR) హాస్పిటల్ నుండి కొత్తపేట వెళ్లే మార్గంలో ఇటీవల ఏర్పాటైన ప్రైవేట్ వెంచర్ సర్వే నెంబర్704లోని ప్రభుత్వ రోడ్డు ను అమాంతం మింగినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.కొందరు రియల్టర్లు ప్రభుత్వ రోడ్డును యథేచ్ఛగా కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చేస్తున్న వైనం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.
అసలేం జరుగుతోంది?
గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే, లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ నుండి కొత్తపేట మార్గంలో ఏళ్ల తరబడి ప్రజలు, రైతుల రాకపోకల కోసం ఉన్న ప్రభుత్వ రోడ్డును రాత్రికి రాత్రే మాయం చేశారు.ప్రభుత్వ భూమిని, రోడ్డును క...




