Sarkar Live

Privacy Policy

Harish Rao | ‘మీ మాటలకు విలువ లేదు.. స్కాంలే తప్ప స్కీంలు లేవు’
State, Hyderabad

Harish Rao | ‘మీ మాటలకు విలువ లేదు.. స్కాంలే తప్ప స్కీంలు లేవు’

పురుగుల అన్నంపై రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీష్ రావు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 'పురుగుల అన్నం' పెట్టిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఆయన ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వాగ్దానాలను హరీష్‌రావు గుర్తు చేస్తూ నిలదీశారు. సమీక్షలు ఏమయ్యాయి? "ఇక నుంచి నేనే సమీక్షలు చేస్తాను" అని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు ఏమయ్యాయి? గత 23 నెలలుగా మీ వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు? "విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపుతాను" అని మీరు చేసిన బెదిరింపులు ఏమైపోయాయి? కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని మీరు జైలుకు పంపారు? ముఖ్యమంత్రి మాటలకు విలువ లేదని, ఆచరణకు దిక్...
మావోయిస్టుల సంచలన ప్రకటన – Maoist Surrender Announcement
State

మావోయిస్టుల సంచలన ప్రకటన – Maoist Surrender Announcement

ఆయుధాలు వీడి ప్రధాన స్రవంతిలోకి – షరతులు వెల్లడి Maoist Surrender Announcement : సీపీఐ (మావోయిస్ట్)కు చెందిన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (MMCSZC) ఒక కీలక ప్రకటన చేసింది. ఈ జోన్ పరిధిలోని మావోయిస్టు కార్యకర్తలు అంద‌రూ జనవరి 1, 2026న ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరనున్నట్లు ఎంఎంసీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి అనంత్ వెల్లడించారు.ఈమేరకు ఆయన తాజాగా ఒక లేఖను విడుదల చేయడంతో పాటు, మీడియాకు ఆడియో క్లిప్‌లను విడుదల చేశారు.ప్రభుత్వాలకు లేఖ, నిర్ణయానికి సమయం గతంలో (నవంబర్ 22న) అనంత్… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మకు లేఖ రాశారు. ఏకాభిప్రాయానికి రావడానికి ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని ఆ లేఖలో అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయితే, హోంమంత్రి విజయ్ శర్మ ర...
కాళోజీ వర్సిటీలో ‘మార్కుల’ మాయాజాలం : హ‌రీష్‌రావు – Kaloji Narayana Rao University
State, warangal

కాళోజీ వర్సిటీలో ‘మార్కుల’ మాయాజాలం : హ‌రీష్‌రావు – Kaloji Narayana Rao University

Kaloji Narayana Rao University Scam | వరంగల్​లోని ప్రతిష్టాత్మక కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అవినీతికి, అక్రమాలకు నిలయంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాష్ట్ర గవర్నర్‌కు, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చైర్మన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూనివ‌ర్సిటీ కీర్తిప్ర‌తిష్ట‌లు మసకబారుతున్నాయ‌నిఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ వైద్య పరీక్షల్లో భారీ స్కామ్? ఇటీవల జరిగిన పీజీ మెడికల్ పరీక్షల ఫలితాలపై హరీష్‌రావు సంచలన ఆరోప‌ణ‌లు గుప్పించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు కేవలం కొన్ని రోజుల్లోనే ఎలా పాస్ అయ్యారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం రీ-కౌంటింగ్‌కు మాత్రమే అవకాశం ఉందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా 'రీ-వాల్యుయేషన్' (పునర్ మూల్యాంక‌నం ) చేసి వారిని ఉత్తీర్ణుల‌ను చేశారని ఆర...
‘అయ్యప్ప దీక్ష’ దుమారం: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే? – Telangana Police
State, Hyderabad

‘అయ్యప్ప దీక్ష’ దుమారం: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే? – Telangana Police

Hyderabad : తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) లో 'అయ్యప్ప దీక్ష' అంశం తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధారణ కోసం నలుపు రంగు దుస్తులు ధరించడానికి ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌కు (SI) ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడం వివాదాస్ప‌ద‌మైంది. దీనిని నిరసిస్తూ గురువారం లక్డికాపూల్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన (Ayyappa Devotees Protest,)కు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలేం జరిగింది? కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, తాను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నానని, ఆ సమయంలో యూనిఫామ్‌కు బదులుగా నలుపు రంగు దుస్తులు ధరించడానికి, గడ్డం పెంచుకోవడానికి, పాదరక్షలు లేకుండా విధులకు హాజరయ్యేందుకు అనుమతి అధికారుల‌ను కోరారు. అయితే, దీనిపై స్పందించిన అదనపు డీసీపీ (ఆగ్నేయ) సదరు ఎస్సై అభ్యర్థనను తిరస్క...
Gold Price Today | మరోసారి తగ్గిన బంగారం ధరలు
Business

Gold Price Today | మరోసారి తగ్గిన బంగారం ధరలు

పసిడి మార్కెట్‌లో స్వల్ప పతనం Gold Price Today | న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా పెరుగుతూ వినియోగదారులకు చుక్క‌లు చూపించిన‌ బంగారం ధరలు, ఇప్పుడు మెల్లగా తగ్గుముఖం పట్టుతున్నాయి. గత మూడు రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా పడిపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.నవంబర్‌ 24న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,130 ఉండగా, ఇప్పుడు అది రూ.1,25,120కి తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,25,660, 22 క్యారెట్ల బంగారం రూ.1,15,190గా ఉంది. వెండి కిలో ధర అక్కడ రూ.1,70,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, దిల్లీ, హైదరాబాద్‌, తిరువ‌నంత‌పురం(కేర‌ళ‌), విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు రూ.1,25,120 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర సగటున రూ.1,14,690 చుట్టూ ఉంది. వెండి ధరలు మాత్రం నగరాన్ని బట్టి రూ.1,62,900 నుండి రూ.1,70,900 వరకు మారుతున్నాయి. కాగా బంగారం, వెండి ధరల...
error: Content is protected !!