Sarkar Live

Privacy Policy

Sada Binama | సాదాబైనామాకు కొత్త‌ నిబంధనలు.. రైతుల‌కు భారీ ఊర‌ట‌
State

Sada Binama | సాదాబైనామాకు కొత్త‌ నిబంధనలు.. రైతుల‌కు భారీ ఊర‌ట‌

నిబంధనల సవరణతో 9 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం.. రంగంలోకి ఆర్డీవోలు! Sada Binama Land Regularization : తెలంగాణలో సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో దరఖాస్తుల తిరస్కరణకు ప్రధాన కారణమైన ‘విక్రయదారుడి అఫిడవిట్’ నిబంధనను సవరించడంతో ఇప్పుడు లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి రైతుల భూములకు పట్టా హక్కులు లభించనున్నాయి. ఏమిటీ వివాదం? ఎందుకు తిరస్కరించారు? 2020లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది రైతులు సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2025లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక నిబంధన ఈ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. భూమిని అమ్మిన వారు (Seller), కొన్నవారు (Buyer) ఇద్దరూ కలిసి అఫిడవిట్ సమర్పించాలని అధికారులు నిబంధన పెట్టారు. సమస్య: 2014 కంటే ముందు జరిగిన భూ లావాదేవీలకు సంబంధించి.. ఇప్...
మరో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్
warangal

మరో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (RO) లో అవినీతి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ సస్పెండ్ కాగా, తాజాగా జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ రాంనర్సింహారావుపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ​ఈ నెల 3వ తేదీన ఏసీబీ అధికారులు వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వెలుగుచూసిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిన డీఐజీ సుభాషిణి, రాంనర్సింహారావుపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా కమిషనర్ రాజీవ్ గాంధీ హన్మంతు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.వాస్తవానికి ఈ నెల 10వ తేదీనే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.కానీ శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నేడు సోమవారం కార్యాలయం పునఃప్రారంభం కావడంతో, సస్పెన్షన్ కాపీలు అధికారికంగా కార్యాలయానికి చేరనున్నాయి. ​వరుసగా ఇద్దరు...
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!  – TG Inter Results 2026
career

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి! – TG Inter Results 2026

TG Inter Results 2026 | తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవ రావు, విద్యా శాఖ సెక్రటరీ ఐఏఎస్ యోగిత రాణా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. కేవలం 25 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు ప్రకటించడం విశేషం. విభాగంవివరాలుమొత్తం విద్యార్థులుసుమారు 10 లక్షలుఫస్ట్ ఇయర్ విద్యార్థులు4,89,126సెకండియర్ విద్యార్థులు5,07,949పరీక్షా కేంద్రాలు1,495మూల్యాంకన కేంద్రాలు20 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? విద్యార్థులు తమ ఫలితాలను రెండు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు: 1. అధికారిక వెబ్‌సైట్ ద్వారా: మొదట tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో 'TS Inter Results 2026' లింక్‌పై ...
ఏసీబీ, టాస్క్ ఫోర్స్ నజర్ వేసేనా? 
Special Stories

ఏసీబీ, టాస్క్ ఫోర్స్ నజర్ వేసేనా? 

బయటపడితే పదుల సంఖ్యలో అధికారులు అవుట్! ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు.. తలలు పట్టుకున్న తహశీల్దార్ లు తమ పేర్లు ఎక్కడ బయటకొస్తాయోనని టెన్షన్ లో అధికారులు​ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. ఆ పేరే "శేఖర్". వ్యవస్థను తన కబంధ హస్తాల్లో ఉంచుకుని, చట్టాన్ని చుట్టంలా మార్చుకున్న ఈ 'బారాణ బ్రోకర్' (Revenue Broker) లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడుతోంది. శేఖరుడి వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తాలెవరివి? రెవెన్యూ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఈ చక్రవర్తి కథాకమీమామిషు ఏంటి? ​బ్యాంకు లావాదేవీలు బయటపడితే.. వికెట్లు పడాల్సిందే! ​శేఖరుడి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై నిఘా పెడితే సంచలన నిజాలు బయటకు వస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా తహశీల్దార్ ల బినామీలకు, కొంత మంది రెవెన్యూ ఉద్యోగులకు ఈ దళారీ అకౌం...
నిప్పుకణిక.. సురేఖ: గృహిణి నుంచి కేబినెట్ మంత్రి వరకు.. వరంగల్​కు ‘కొండంత అండ! – Konda Surekha
Special Stories

నిప్పుకణిక.. సురేఖ: గృహిణి నుంచి కేబినెట్ మంత్రి వరకు.. వరంగల్​కు ‘కొండంత అండ! – Konda Surekha

Konda Surekha Political journey | తెలంగాణ రాజకీయ యవనికపై ఆమె ఒక సంచలనం. బెదురు లేని మాట.. వెనకడుగు వేయని నైజం.. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగే ప్రయాణం. ఆమే కొండా సురేఖ. సాధారణ గృహిణి స్థాయి నుండి రాష్ట్ర కేబినెట్ మంత్రి వరకు ఆమె ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు. ​పోరాటాలే పునాదిగా.. రాజకీయ ప్రస్థానం ​బీసీ బిడ్డగా సామాన్య కుటుంబంలో జన్మించిన సురేఖ, (Konda Surekha) రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు (Ex MLC Konda Muralidhar Rao) వెన్నుదన్నుతో రాజకీయాల్లో అజేయ శక్తిగా ఎదిగారు. 1995లో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె, వరుస విజయాలతో వరంగల్ రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా నిలిచారు. ​తూర్పు ...
error: Content is protected !!