Sarkar Live

Privacy Policy

Fengal Cyclone Alert | ఫెంగల్ తుఫాను ముప్పు.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు..
National

Fengal Cyclone Alert | ఫెంగల్ తుఫాను ముప్పు.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు..

Fengal Cyclone Alert | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తుఫానుగా మార‌నుంద‌ని వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. దీంతో మరో సైక్లోనిక్ ఫెంగల్ తుఫాను దేశాన్ని తాకబోతోంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా వస్తూ.. తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తా రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించింది. ఈదురు గాలులతో కూడా అతి భారీ వర్షాల పడతాయని వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ఈరోజు తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని డిఎంకే ప్రభుత్వం ఆదేశించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా చెన్నై ప్రాంతీయ మెట్రోలాజికల్ సెంటర్ (RMC) హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచుతో పాటు చలి కూడా పెరగవచ్చ...
Tirumala Temple |  తిరుమల హుండీలో డబ్బులు చోరీ చేసిన భక్తుడు అరెస్ట్
Crime

Tirumala Temple | తిరుమల హుండీలో డబ్బులు చోరీ చేసిన భక్తుడు అరెస్ట్

Tirupati: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమ‌ల దేవాలయం (Tirumala Temple )లో ఓ భక్తుడు హుండీలో డబ్బును దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన నవంబర్ 23న చోటుచేసుకోగా ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదుతో ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన వేణు లింగం అనే నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు అతని నుంచి రూ.15,000 న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 23న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యిందని, సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించిన ఆల‌య సెక్యూరిటీ సిబ్బంది వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో హుండీ చుట్టూ టీటీడీ భద్రతను మ‌రింత‌ కట్టుదిట్టం చేశారు. కాగా, ప్...
Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!?
Cinema

Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!?

Pushpa -2  | సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్పా 2 మూవీ మరికొద్దిరోజుల్లోనే విడుదల కాబోతుంది. స్టైలిష్ స్టార్ "అల్లు అర్జున్" హీరోగా నేషనల్ క్రష్ "రష్మికా మందన" హీరోయిన్ గా నటించిన "పుష్పా' మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఆ మూవీ జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన విషయం సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అయితే ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న "పుష్పా-2" పై ఇప్పుడు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల క్రితం విడుదలైన "పుష్పా" సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సృష్టించి అల్లుఅర్జున్ స్థాయిని అమాంతం పెంచినట్లు చెప్పవచ్చు. అదే ఊపుతో పుష్పా-2 మూవీని దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించి జాతీయ స్థాయిలో పుష్ప-2 మూవీని నెంబర్ వన్ పాన్ ఇండియా మూవీగా నిలబెట్టాలని చూస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. పుష్పా మూవీ రన్ టైం 2 గ...
Mallikarjun Kharge  | బ్యాలెట్ పేప‌ర్ కోసం మ‌రోసారి జోడో యాత్ర‌
National

Mallikarjun Kharge  | బ్యాలెట్ పేప‌ర్ కోసం మ‌రోసారి జోడో యాత్ర‌

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఈవీఎంల‌కు బ‌దులుగా బ్యాలెట్ పేపర్ కోసం భారత్ జోడో యాత్ర లాంటి ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge ) పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చ‌విచూసిన రెండు రోజులకు ఖర్గే ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బ్యాలెట్ పేపర్ తో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు దీనిపై అవగాహన కల్పించడానికి భారత్ జోడో యాత్ర స్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. తల్కతోరా స్టేడియంలో జరిగిన 'సంవిధాన్ రక్షక్ అభియాన్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుల గణన అంటే ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందన్నారు. కుల గణనకు అనుమతిస్తే సమాజంలోని అన్ని వర్గాలు తమ వాటాను డిమాండ్ చేస్తారని మోదీ భయపడుతున్నారని అన్నారు. బీజేపీకి రాజ్యాంగ సమగ్రత లేదని ఖర్గే ఆరోపించారు బ...
Winter Season | తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
State

Winter Season | తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

Winter Season | తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి వేళ 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎకువగా ఉంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.3 డిగ్రీలు నమోదు అయింది. అలాగే న్యాల్కల్‌లో 9.6 డిగ్రీలు, గుమ్మడిదలలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.. మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.2 డిగ్రీలు రికార్డ్ అయింది. ఇదిలా ఉండగా , సోమవారం రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో నమోదైన విషయం తెలిసిందే.. సిర్పూర్‌(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయినట్లు అధికారులు తెలిపారు.  సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్య...
error: Content is protected !!