Sarkar Live

Privacy Policy

Constitution Day | ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రాజ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..
State

Constitution Day | ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రాజ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..

Constitution Day | భారత రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్‌ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనిక దేశానికి దిక్సూచి అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ దినోత్సం సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌వంబర్ 26, 1949న, రాజ్యాంగాన్ని ఆమోదించాలనే నిర్ణయం.. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మార్చింద‌ని గుర్తుచేశారు. సంవిధాన్ దివస్ సంద‌ర్భంగా రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను గుర్తుంచుకోవడం, రాజ్యాంగ‌ విలువలను కాపాడుకోవడంపై దృష్టిసారించాలన్నారు. మ‌హ‌నీయుల‌ ఆకాంక్షలను సాకారం చేసేందుకు తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. Also Read : Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే.. దేశ ప్ర‌జ‌ల‌కు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ...
Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే..
Sports

Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే..

Ipl 2025 News : యూఏఈలోని అబుదాబి వేదికగా ఎంతో ఉత్తేజ‌భ‌రితంగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలం ముగిసింది. ఈసంద‌ర్భంగా వివిధ‌ ఫ్రాంఛైజీలు భారత క్రికెటర్లను కోట్లు కుమ్మ‌రించి కొనుగోలు చేశాయి. ఇందులో విదేశీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు భారీగా ధ‌ర‌లు ప‌లికారు. కాగా, 2008 నుంచి ఐపీఎల్ వేలం జరుగుతుండగా.. 16 ఏళ్ల వేలం రికార్డ్స్‌ను ఐపీఎల్ 2025 వేలం బ్రేక్ చేసింది. టాప్ వ‌న్‌ పంత్, టాప్- 2 శ్రేయాస్ ఐపీఎల్ యాక్ష‌న్ లో అత్యధిక డిమాండ్ ఉన్న ఆటగాళ్ల లిస్ట్ లో సగం మందికి పైగా టీమిండియా క్రికెట‌ర్లే ఉన్నారు. అంతేకాకుండా మొద‌టి రెండు స్థానాల్లోనూ భారత ఆటగాళ్లే ఉన్నారు. గతేడాది వరకూ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో అగ్ర‌స్థానంలో ఉండగా.. గత ఆదివారం ఐపీఎల్ 2025 వేలంలో రూ.27 కోట్లకి రిషబ్ పంత్ అమ్ముడుపోయి ఆ రికార్డ్‌ను బద్ధలు కొట్టాడు. అయ్యర్ కు ఒక్క‌సారిగా క్రేజ్‌.....
Caste Census | తెలంగాణలో 92 శాతం సర్వే పూర్తి..
State

Caste Census | తెలంగాణలో 92 శాతం సర్వే పూర్తి..

Caste Census in Telangana | తెలంగాణ‌లో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 1,17,58,491 నివాసాలు గుర్తించగా, సోమవారం నాటికి 1,08,89,758 కుటుంబాల్లో సర్వే పూర్తి చేసి 92.6 శాతానికి చేరుకుంది. ఈ వివ‌రాల‌నుప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కాగా, రాష్రంలో 13 జిల్లాల్లో 100 శాతం సర్వే పూర్తయింది. సంగారెడ్డి 88.1శాతం, మెడ్చల్‌ మల్కజిగిరి 82.3శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.మిగతా 17 జిల్లాల్లో 90 శాతానికి పైగా ఇంటింటి సర్వే పూర్తయింది. అయితే కొంత‌కాలంగా వెనకబడి ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా సర్వే ఊపందుకుంది. జిహెచ్‌ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా సోమవారం నాటికి 19,04,977 కుటుంబాల్లో సర్వే పూర్తిచేసి 76 శాతానికి చేరింది. సర్వే పూర్తయిన జిల్లాల్లో డాటా నమోదు ప్రక్రియ కూడా...
“క” V/S లక్కీ భాస్కర్.. ఓటీటీలో దుమ్ము రేపడానికి రెడీ..
Cinema

“క” V/S లక్కీ భాస్కర్.. ఓటీటీలో దుమ్ము రేపడానికి రెడీ..

ఓటీటీలో పోటీపడనున్న రెండు సినిమాలు నవంబర్ 28 న ఒకే రోజు ఓటీటీలోకి రెండు బ్లాక్ బస్టర్ మూవీలు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ "క", మలయాళ హీరో లవర్ బాయ్ గా గుర్తింపుతెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ రీసెంట్ గా నటించిన సినిమా లక్కీ భాస్కర్(Lucky Bhaskar). ఈ రెండు సినిమాలు దీపావళి సందర్భంగా విడుదలై దేనికవే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లు ఇప్పటికే స్పష్టం అవుతోంది. దీపావళి కానుకగా రిలీజైన "KA" సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో మలయాళ  హీరో దుల్కర్ సల్మాన్ నటించిన "లక్కీ భాస్కర్" విడుదలై ఆ హీరో కెరీర్ లొనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే లక్కీ భాస్కర్ మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించడం విశేషం.హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి పాన్ ఇండియా "క" సినిమాను సుజీత్, సందీప్ తెరకెక్కించగా నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిం...
ACB | ఏసీబి వలలో ఇరిగేషన్ ఏఈ.. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
Crime

ACB | ఏసీబి వలలో ఇరిగేషన్ ఏఈ.. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

పెద్దపల్లి జిల్లా :  తెలంగాణ‌ రాష్ట్రంలో లోని ఇటీవ‌ల కాలంలో ఏసీబీ (ACB) దాడుల్లో అవ‌నీతికి పాల్ప‌డే అధికారులు చిక్కుతున్నారు. ఇందులో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. సోమ‌వారం పెద్ద‌ప‌ల్లి ప‌ట్ట‌ణం ఎస్ఆర్‌సీ నీటి పారుద‌ల శాఖ (Irrigation ) అసిస్టెంట్ ఇంజ‌నీర్ న‌ర్సింగ‌రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపైనే ఓ వ్య‌క్తి నుంచి లంచం డ‌బ్బులు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాంట్రాక్ట‌ర్‌కు ఓ బిల్లు విష‌యంలో ఏఈ న‌ర్సింగ‌రావుకు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. రోడ్డుపైనే ఏఈకి కాంట్రాక్ట‌ర్ రూ.20,000లు అంద‌జేశారు. అక్క‌డే మాటు వేసిన ఏసీబీ డీఎస్‌పీ ర‌మ‌ణ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో సిబ్బంది దాడి చేసి ప‌ట్టుకున్నారు. అలాగేనీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు ఆయ‌న్ని తీసుకువచ్చి విచారిస్తున్నారు. కార్యాల‌యంలో రికార్డుల‌ను ప‌రిశీలిస...
error: Content is protected !!