Sarkar Live

Privacy Policy

Telangana Assembly | అసెంబ్లీ స‌మావేశాలు వాయిదా.. తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్ పై చర్చ
State

Telangana Assembly | అసెంబ్లీ స‌మావేశాలు వాయిదా.. తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్ పై చర్చ

Telangana Assembly | హైద‌రాబాద్ : రాష్ట్ర‌ శాస‌న స‌భ‌, మండలి స‌మావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా ప‌డ్డాయి. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రక‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై స‌భ్యులు మాట్లాడిన త‌ర్వాత స‌భ‌ను డిసెంబ‌ర్ 16వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. అయితే అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. బీఆర్ఎస్ నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ నేత‌లు నిప్పులు చెరిగారు. అక్ర‌మ అరెస్టుల‌పై మండిప‌డ్డారు. అదానీ – రేవంత్ దోస్తానాపై ప్ర‌శ్నిస్తామ‌నే భ‌యంతోనే త‌మ‌ను అడ్డుకుంటున్నార‌ని, స‌భ‌లోని రానివ్వ‌డం లేద‌ని బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శించారు. కాగా రాష్ట్ర సచివాలయంలో రీడిజైన్ చేసిన...
Congress | విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు… రాజ‌కీయ శిబిరంలో క‌ల‌క‌లం
National

Congress | విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు… రాజ‌కీయ శిబిరంలో క‌ల‌క‌లం

Financial benefits to Congress from a foreign organization : విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఆ పార్టీలో ప్రకంప‌ణ‌లు సృష్టిస్తున్నాయి. జార్ట్ సోరోస్ ఫౌండేష‌న్ నిధుల‌తో న‌డిచే సంస్థ‌తో సోనియాగాంధీ సత్సంబంధాలు క‌లిగి ఉన్నార‌ని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని తేట‌తెల్ల‌మైంద‌ని విమ‌ర్శిస్తోంది. దీన్ని కాంగ్రెస్‌తోపాటే అమెరికా ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు తోసిపుచ్చారు. దీన్ని కూడా బీజేపీ త‌ప్పుప‌డుతోంది. విప‌క్షాలతో క‌లిసి భార‌త్‌ను అస్థిర ప‌ర్చేందుకు విదేశీయులు కుట్ర ప‌న్నుతున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని అభివ‌ర్ణించింది. కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు, ఆ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీపై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ...
Paddy Procurement | రైతులకు కోత.. అధికారులకు మేత…
Special Stories

Paddy Procurement | రైతులకు కోత.. అధికారులకు మేత…

తరుగు పేరుతో రైతుల ధాన్యాన్ని దోచుకుంటున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోతపెడుతున్నట్లు సమాచారం మామూళ్ల అలవాటు పడి చూసిచూడనట్లగా కొందరు అధికారులు! తరుగు పేరుతో తీసిన ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళుతోంది? ఆ డబ్బులు ఎవరు మింగుతున్నారు? Paddy Procurement | రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని తరుగు పేరుతో బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అధికారులే మిల్లర్లు ఇచ్చే మామూళ్లకు (మేతకు) అలవాటు పడి చూసీచూడనట్ల వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొంతమంది పౌరసరఫరాల శాఖ అధికారుల మూలంగా మసకబార...
Bomb Threats | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. రాజధానిలో కలకలం
National

Bomb Threats | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. రాజధానిలో కలకలం

Delhi School Bomb Threats : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ప‌లు స్కూళ్ల‌కు వ‌రుస‌గా బాంబు బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. న‌గ‌రంలోని మదర్ మేరీస్ స్కూల్, బ్రిటిష్ స్కూల్, సాల్వాన్ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌తో సహా పలు పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. ఆర్‌కే పురంలో ఒకటి, పశ్చిమ విహార్‌లోని రెండు పాఠశాలలకు హెచ్చరికలు అందాయని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న తర్వాత, రెండు పాఠశాలల నిర్వాహకులు పిల్లలను వారి ఇళ్లకు తిరిగి పంపించేశారు. డీపీఎస్ ఆర్కే పురం నుంచి ఉదయం 7.06 గంటలకు, జీడీ గోయెంకా పశ్చిమ్ విహార్ నుంచి ఉదయం 6.15 గంటలకు బాంబు బెదిరింపులు వచ్చాయని డీఎఫ్‌ఎస్ అధికారి తెలిపారు. అగ్నిమాపక అధికారులు, డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలు, స్థానిక పోలీసులు హుటాహుటిన‌ పాఠశాలలకు చేరుకుని సోదాలు నిర్వహి...
KCR | కాంగ్రెస్ మూర్ఖ‌త్వానికి ప‌రాకాష్ట‌.. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కేసీఆర్ ఫైర్
State

KCR | కాంగ్రెస్ మూర్ఖ‌త్వానికి ప‌రాకాష్ట‌.. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కేసీఆర్ ఫైర్

KCR | తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూర్ఖత్వమని.. ఇవి ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అని బీఆర్‌ఎస్ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ఆయ‌న‌ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్ర‌వ్నించారు. రాష్ట్ర‌ ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని చెప్పారు. అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పారు. రైతుబంధు ప్రయోజనాలు ప్ర‌జ‌ల‌కు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ...
error: Content is protected !!