Sarkar Live

Privacy Policy

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా
Hyderabad

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
బీసీలకు అన్యాయం చేసినట్లే.. నాయిని భరత్
warangal

బీసీలకు అన్యాయం చేసినట్లే.. నాయిని భరత్

తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను బీసీ వర్గాలకు కేటాయించకపోవడం అన్యాయమని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ విమర్శించారు. రాష్ట్రంలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ వారికి రాజ్యసభలో తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల డిమాండ్లను పట్టించుకోకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. ఖాళీ స్థానాలను బీసీలకు కేటాయిస్తే వారి సమస్యలు జాతీయ స్థాయిలో ప్రస్తావనకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునర్విమర్శించి భవిష్యత్తులో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని నాయిని భరత్ హెచ్చరించారు....
Bala Kishore Reddy | రాజకీయాల్లో ‘బాల కిషోర్ రెడ్డి’ ప్రభంజనం: ప్రజాసేవే లక్ష్యంగా.. యువతే సైన్యంగా సరికొత్త ప్రస్థానం!
Special Stories

Bala Kishore Reddy | రాజకీయాల్లో ‘బాల కిషోర్ రెడ్డి’ ప్రభంజనం: ప్రజాసేవే లక్ష్యంగా.. యువతే సైన్యంగా సరికొత్త ప్రస్థానం!

Bala Kishore Reddy Political Journey | రాజకీయాల్లో మార్పు రావాలంటే కేవలం పదవులు ఉంటే సరిపోదు.. ప్రజలతో మమేకమయ్యే మనసుండాలని నిరూపిస్తున్నారు యువనేత బాల కిషోర్ రెడ్డి (Bala Kishore Reddy) . సామాజిక సేవను కేవలం బాధ్యతగా కాకుండా, ఒక రాజకీయ శక్తిగా మలుచుకుంటూ ఆయన సాగిస్తున్న ప్రస్థానం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సేవే పునాదిగా.. ప్రజలే అజెండాగా! సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలోనే కనిపిస్తుంటారు. కానీ, బాల కిషోర్ రెడ్డి శైలి ఇందుకు భిన్నం. సామాజిక సేవను తన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదిగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు, మహిళల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు బాల కిషోర్ రెడ్డిని ఒక నాయకుడిగా ప్రజల్లో నిలబెడుతోంది. కొమ్మాల జాతరలో ప్రభా బండ...
రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వి
Hyderabad

రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వి

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి ఖరారయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి(Abhishek Manu Singhvi )కూడా రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా వీరిద్దరినీ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ఆయన చేసిన సేవలు, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....
నాలా కన్వర్షన్‌ల ముసుగులో మున్సిపల్ ఖజానాకు గండి.. ‌‌ –NALA Conversion Scam
Special Stories

నాలా కన్వర్షన్‌ల ముసుగులో మున్సిపల్ ఖజానాకు గండి.. ‌‌ –NALA Conversion Scam

"బదిలీతో తహశీల్దార్ తప్పించుకున్నట్లేనా?” బరితెగించిన నిర్ణయాలు.. మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి బదిలీపై వెళ్లిన తహశీల్దార్ లేఅవుట్ అనుమతులు లేకుండానే హుజురాబాద్ లో వందలాది ప్లాట్లకు కన్వర్షన్ Huzurabad NALA Conversion Scam | హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ వెంచర్లకు అధికార ముద్ర పడిందా? వందలాది ప్లాట్లకు లేఅవుట్ అనుమతులు లేకుండానే నాన్-అగ్రికల్చర్ (ఎన్‌ఏ) కన్వర్షన్‌లు ఎలా జరిగాయి? ఈ ప్రశ్నలు ప్రస్తుతం హుజురాబాద్ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజుల క్రితం బదిలీపై వెళ్లిన తహశీల్దార్ పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేఅవుట్ అనుమతులు లేకుండానే కన్వర్షన్‌లు? స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, మున్సిపల్ అనుమతులు పొందకుండా అభివృద్ధి చేసిన పలు అక్రమ లేఅవుట్లలో వందలాది ప్లాట్లు విక్రయించబడ్డాయి. వ్యవసాయ భూముల్లోని అవే ప్లాట్లకు గజాల వారిగా కన...
error: Content is protected !!