Sarkar Live

Privacy Policy

సర్కారు ధాన్యం భద్రమేనా?
Special Stories

సర్కారు ధాన్యం భద్రమేనా?

రూ.2కోట్ల ధాన్యం మాయం పై అనుమానాలు Hanumakonda Paddy Scam | ఆ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రంగా ఉందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. హనుమకొండ జిల్లా అగ్రంపహాడ్ శివారులోని మహాదేవ ఇండస్ట్రీస్ వేదికగా సివిల్ సప్లైస్ ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మిల్లులో ఉండాల్సిన ధాన్యంలో సుమారు రూ. 2 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. రికార్డుల్లో ఉన్న లెక్కలకు.. మిల్లులో ఉన్న నిల్వకు భారీ తేడా?  2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పౌరసరఫరాల శాఖ 2991.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం ఈ మిల్లుకు పంపించింది. నిబంధనల ప్రకారం.. మిల్లర్ ఆ ధాన్యాన్ని మరాడించి 2004.586 మెట్రిక్ టన్నులు  అంటే 70 ఏసికెల బియ్యాన్ని ప్రభుత్వానికి  తిరిగి అప్పగించాలి. అయితే, ఇప్పటివరకు ఆ మిల్లర్ పౌరసరఫరాల శాఖకు కేవలం 12 ఏసికెల బియ్యాన్ని మాత్రమే ప...
మడికొండలో సెగలు రేపుతున్న ‘డంపింగ్ యార్డ్’ వివాదం – Dumping Yard Controversy
warangal

మడికొండలో సెగలు రేపుతున్న ‘డంపింగ్ యార్డ్’ వివాదం – Dumping Yard Controversy

తక్షణమే ఎత్తివేయాలని నిరాహారదీక్ష కు సిద్దమైన గ్రామస్తులు.. Madikonda Dumping Yard Controversy | హన్మకొండ జిల్లా మడికొండలో డంపింగ్ యార్డ్ వివాదం ముదురుతోంది. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్నామంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఇక పోరాటమే శరణ్యమని భావించిన స్థానికులు, తక్షణమే డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. అనారోగ్యాల నిలయంగా మడికొండ గత కొంతకాలంగా మడికొండ శివార్లలో ఉన్న డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దుర్వాసన, దుమ్ము, ధూళి వల్ల స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల పాలు: ఇప్పటికే గ్రామంలోని అనేకమంది అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. పరిస్థితి ఇలాగే కొనసాగితే మడికొండలో ప్రతి ఇల్లూ ఒక ఆసుపత్రిలా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు: డంపిం...
నోటీసుల కోసం ‘మామూళ్ల’ వేట
Crime, Hyderabad

నోటీసుల కోసం ‘మామూళ్ల’ వేట

లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్ఐల అరెస్ట్. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కాయి. బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు ఒక కేసు విషయంలో నిందితుడికి సెక్షన్ 41 నోటీసులు ఇచ్చేందుకు ప్రతిఫలంగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు.ఈ వేధింపులను తట్టుకోలేక బాధితుడు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్ఐలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు....
NALA Conversion Scam | తహశీల్దార్ కన్వర్షన్ ల కహానీ
Special Stories

NALA Conversion Scam | తహశీల్దార్ కన్వర్షన్ ల కహానీ

వరంగల్ శివార్లలో 'నాలా' దందా: తహశీల్దార్ కన్వర్షన్ల కహానీ! ధరణి, భూభారతి లోపాలే పెట్టుబడిగా అక్రమాల పర్వం.. 40కి పైగా అక్రమ వెంచర్లకు క్లియరెన్స్. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి. Warangal NALA Conversion Scam భూమి రికార్డుల ప్రక్షాళన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి, భూభారతి పోర్టల్ లోని సాంకేతిక లోపాలు కొందరు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) శివార్లలోని ఒక మండల తహశీల్దార్, నిబంధనలను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 40కి పైగా అనధికారిక (Non-Layout) వెంచర్లలోని వందలాది ప్లాట్లకు నిబంధనలకు విరుద్ధంగా నాలా (NALA) కన్వర్షన్లు మంజూరు చేయడం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్రమ వెంచర్లకు 'నాలా' అండ సాధారణంగా ఏదైనా భూమిని వెంచర్‌గా మార్చాలంటే కుడ...
వాసం శ్రీనివాస్ కు .. ప్రొఫెసర్ గా పదోన్నతి…..
warangal

వాసం శ్రీనివాస్ కు .. ప్రొఫెసర్ గా పదోన్నతి…..

సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ వాసం శ్రీనివాస్‌కు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ పదోన్నతి అమలులోకి వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగి విద్యారంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆయన విజయం కొత్తగూడెం గ్రామంతో పాటు సంగెం మండల ప్రజలకు గర్వకారణంగా మారింది. సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వాసం వీరస్వామి, సోమలక్ష్మి దంపతుల కుమారుడైన డాక్టర్ వాసం శ్రీనివాస్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసి, కాకతీయ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా సాధించారు. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై రసాయన శాస్త్రంలో జూనియర్ లెక్చరర్‌గా తన ఉపా...
error: Content is protected !!