- లక్ష్యం 10 వేల మంది పేద విద్యార్థులకు చదువు
- నిరుపేద పిల్లలకు చదువును దగ్గర చేస్తున్న యువ నాయకుడు
- పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2,500 బ్యాగులను పంపిణీ చేసిన రంజిత్ రెడ్డి
- ఇప్పటికే 120 మంది విద్యార్థులకు విద్యాదానం..?
Hanmakonda : పేద విద్యార్థులకు చదువును అందించడమే అతని లక్ష్యం. పేదరికంలో మగ్గిపోతూ చదువుకోవడానికి నానా అగచాట్లు పడుతున్న పేద పిల్లలకు నేనున్నానంటూ అక్కున చేర్చుకుంటాడు. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులకు వారి చదువుకు అయ్యే ఆర్థిక వనరులను సమకూరుస్తూ, వారి కలలను సాకారం చేస్తున్న “రంజిత్ రెడ్డి (Ranjith Reddy) “పై సర్కార్ లైవ్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
హన్మకొండ (Hanmakonda) జిల్లా రెడ్డిపురానికి చెందిన రంజిత్ రెడ్డికి చదువుపై మొదటి నుంచి ఎంతో మక్కువ. చదువుకోవాలనే తపన ఉండి, చదువుకు పేదరికం అడ్డుగా ఉన్న ఎంతో మంది విద్యార్థుల చదువుకు అవసరమైన ఆర్థికంగా సాయం (Free, Education) అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పటికే ఆయన చదివిపిస్తున్న విద్యార్థుల సంఖ్య సెంచరీ (100) దాటిందంటే ఆయన ఏ స్థాయిలో పేద విద్యార్థులకు చదువును దగ్గర చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
పుట్టిన రోజు విద్యార్థుల కోసం అంకితం
సాధారణంగా పుట్టిన రోజు అంటేనే నానా హంగామాలు, దోస్తులను పిలిచి దావత్ లు చేసుకునే కల్చర్ ఈ రోజుల్లో కనిపిస్తుంది. కానీ రంజిత్ రెడ్డి మాత్రం తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా నిరుపేద విద్యార్థుల కోసమే తన పుట్టినరోజును అంకితం చేసినట్లు తన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. నిత్యం విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలని తపన పడే ఆయన “జూన్ 14” న తన పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 2500 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులతో పాటు, జామెట్రి బాక్సులు పంపిణీ (Social Service) చేసి నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
10 వేల మంది పేదలను చదివించడమే Ranjith Reddy లక్ష్యం…
నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న అనేక మంది విద్యార్థులను చేరదీసి, వారు చదువుకోవడానికి ఆర్థికంగా సహకరిస్తున్న రంజిత్ రెడ్డి.. రానున్న రోజుల్లో సుమారుగా 10 వేల మందికి చదువు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన సహకారంతో చదువుతున్న విద్యార్థులు చెబుతున్నారు. విద్యకు మించిన ఆయుధం లేదని, సమాజంలో చదువు వల్లే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని పదేపదే రంజిత్ విద్యార్థులకు చెబుతుంటాడని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.