Sarkar Live

Road accident | జ‌డ్చ‌ర్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Road accident | మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల ( Jadcherla) మండలం మచారం సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్ర‌మాదం (accident) జ‌రిగింది. లారీని ప్రైవేటు బ‌స్సు (Private bus) ఢీకొన‌డంతో డ్రైవ‌ర్ స‌హా ఇద్ద‌రు మ‌హిళా

Accident

Road accident | మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల ( Jadcherla) మండలం మచారం సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్ర‌మాదం (accident) జ‌రిగింది. లారీని ప్రైవేటు బ‌స్సు (Private bus) ఢీకొన‌డంతో డ్రైవ‌ర్ స‌హా ఇద్ద‌రు మ‌హిళా ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉద‌యం 6 గంటల సమయంలో కడప నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ముందుకు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం (Road accident)చోటుచేసుకుంది.

Road accident : ఎలా జ‌రిగిందంటే..

ప్రాథమిక సమాచారం ప్రకారం.. సూర్యోద‌యానికి ముందు చీక‌టి ఇంకా అలుముకొని ఉన్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బస్సు కొంత వేగంగా వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ డ్రైవ‌రు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బ‌స్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లారీ (lorry) వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ముందు సీట్లలో కూర్చున్న లక్ష్మీ దేవి, రాధిక అనే ప్ర‌యాణికులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో పలువురికి తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాల‌య్యాయి. వెంటనే స్థానికులు అటువైపు వ‌స్తున్న వాహనదారుల సహాయంతో క్ష‌త‌గాత్రుల‌ను సమీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారిలో ప‌లువురి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది.

పోలీసుల ర‌క్ష‌ణ చ‌ర్య‌లు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జడ్చర్ల పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు క్రేన్ సాయంతో బస్సును రహదారి పక్కకు తరలించారు. ఈ క్ర‌మంలో కొన్ని గంట‌ల‌పాటు ట్రాఫిక్ స్తంభించింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, వేగం, వర్షాకాలం కారణంగా రహదారి జారుడు పరిస్థితి ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. లారీ సిగ్నల్ లైట్లు సరిగా పనిచేయకపోవడం వల్ల వెనుకున్న బ‌స్సు డ్రైవ‌రుకు స్పష్టమైన హెచ్చరిక అందలేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. రహదారులపై జాగ్రత్తలు పాటించకపోతే క్షణాల్లోనే జీవితాలు ఇలా ముగిసిపోతాయ‌ని పోలీసులు అంటున్నారు. వర్షాకాలం, పొగమంచు, తక్కువ దృశ్యమానత … ఇవన్నీ ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండటం అవసరమ‌ని సూచిస్తున్నారు.

Road accident: మృతుల కుటుంబాల్లో విషాదం

కూకట్‌పల్లి వాసులైన లక్ష్మీ దేవి, రాధిక వీరిద్దరూ కుటుంబ సభ్యులను కలవడానికి హైదరాబాద్ (accident) నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కడప (Kadapa)కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లక్ష్మీ దేవి, రాధికలు ఇద్దరూ కూకట్‌పల్లిలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఇద్ద‌రూ ఒకే ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోవ‌డం వారి కుటుంబాల్లోనే కాకుండా అక్క‌డి వాసుల‌ను క‌ల‌చివేసింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?