Sarkar Live

SLBC Tunnel : ప్రమాదం జరిగి 28వ రోజు.. ఏడుగురి కోసం నిర్విరామంగా గాలింపు చర్యలు..

SLBC Tunnel collapse : శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం పాక్షికంగా కూలిపోయిన విషాదకర ఘటనలో లోపల చిక్కుకున్న ఏడుగురి కోసం గాలింపు చర్య నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. గల్లంతయినవారి కోసం అనుమానం ఉన్న ప్రదేశాల నుంచి సహాయక

SLBC Tunnel

SLBC Tunnel collapse : శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం పాక్షికంగా కూలిపోయిన విషాదకర ఘటనలో లోపల చిక్కుకున్న ఏడుగురి కోసం గాలింపు చర్య నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. గల్లంతయినవారి కోసం అనుమానం ఉన్న ప్రదేశాల నుంచి సహాయక సిబ్బంది ఉక్కు, మట్టిని అత్యాధునిక యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు.

పెద్ద రాళ్లను తొలగింపు

ఎస్కవేటర్లు, ఇతర యంత్రాలు, ‘లోకో రైలు’ ఉపయోగించి సొరంగం నుండి పెద్ద రాళ్లను తొలగిస్తున్నట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీటి ఊట నిరంతరం విపరీతంగా రావడంతో సహాయక చర్యలకు సవాళ్లు ఏర్పడుతున్నాయి. నేల స్థిరత్వానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి నిపుణులను పిలిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విపత్తు నిర్వహణ) అరవింద్ కుమార్ పరిశోధన ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

ఐదు షిప్టులుగా సహాయక చర్యలు

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మైనింగ్ కంపెనీ సింగరేణి కాలరీస్, మైనర్లు, ఇతర సిబ్బంది అవసరమైన పరికరాలను ఉపయోగించి శోధన ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. సహాయక చర్యలు ప్రతి రోజు 5 షిఫ్టులుగా కొనసాగుతున్నాయని వివరించారు. టన్నెల్ లోపల జరిగే సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 26 రోజులుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రాత్రి పగలు తేడా లేకుండా 5 షిఫ్టులుగా పనిచేస్తూ, ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని, స్టీల్, బండరాళ్లను తొలగిస్తున్నారు.

SLBC Tunnel సహాయక చర్యలలో పాల్గొంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహాయక బృందాలను తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా, అధికారులను అభినందించారు. గురువారం రెస్క్యూ ఆపరేషన్ పై జరిగిన సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారులు, కల్నల్ సురేష్, కల్నల్ పరీక్షిత్ మెహర, వికాస్ సింగ్ ఎన్ డి ఆర్ ఎఫ్ అధికారులు డాక్టర్ హరీష్, జిఎస్ఐ అధికారులు తప్లీ యాల్, భట్టాచార్య, శైలేంద్ర, లక్ష్మణ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్ డి ఆర్ ఎఫ్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ర్యాట్ హోల్ మైనర్స్, అన్వి రోబోటిక్స్ , కడావర్ డాగ్ స్క్వాడ్, జే పి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

SLBC Tunnel ప్రమాదం ఎప్పుడు జరిగింది?

ఫిబ్రవరి 22న ‘శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్’ ప్రాజెక్ట్ సొరంగంలో ఒక భాగం కూలిపోయినప్పుడు ఇంజనీర్లు, కార్మికులు సహా మొత్తం ఎనిమిది మంది చిక్కుకున్నారు. TBM ‘ఆపరేటర్’గా పనిచేసిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మార్చి 9న స్వాధీనం చేసుకున్నారు. అతని మృతదేహాన్ని పంజాబ్‌లో నివసిస్తున్న అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?