Sarkar Live

Stampede | ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో విల‌యం.. 18 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటకు కారణం ఏమిటి?

New Delhi Railway Station tragedy : మహాకుంభమేళాకు వచ్చిపోయే భక్తుల రద్దీ అకస్మాత్తుగా పెరగడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ఘోర తొక్కిసలాట (New Delhi Railway Station Stampede ) జరిగిన విష‌యం తెలిసిందే.. రైల్వే స్టేషన్‌లో

New Delhi Railway Station Stampede

New Delhi Railway Station tragedy : మహాకుంభమేళాకు వచ్చిపోయే భక్తుల రద్దీ అకస్మాత్తుగా పెరగడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ఘోర తొక్కిసలాట (New Delhi Railway Station Stampede ) జరిగిన విష‌యం తెలిసిందే.. రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 18 మంది మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు సహా 18 మంది మరణించారు.  ప్రమాదంపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్‌పిఎఫ్‌తో పాటు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం కూడా స్టేషన్‌కు చేరుకుంది. జనసమూహాన్ని నియంత్రించిన తర్వాత, ప్రత్యేక రైలును నడిపారు.

Stampede : తొక్కిసలాటకు కారణమేమిటి?

ఈ తొక్కిసలాటకు ముందు స్టేషన్‌లోని 14, 15 ప్లాట్‌ఫారమ్‌లపై ప్రయాగ్‌రాజ్‌(Pryagraj)కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి వేచి ఉన్న ప్రయాణికులతో భ‌రీగా రద్దీ పెరిగింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్‌కు వెళ్లడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు రైల్వే స్టేషన్‌కు తరలివచ్చారు.

సంఘటన జరిగిన సమయం (Delhi Station Stampede) లో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ తొక్కిసలాట ప్లాట్‌ఫారమ్‌పై జరగలేదని, ఎస్కలేటర్‌పై జరిగిందని చెప్పారు. మొదట 16 ప్లాట్ ఫాంకు వచ్చే రైలను మార్చి 14 వ ప్లాట్ ఫాంకు వస్తుందని రైల్వే సిబ్బంది మైకులలో ప్రకటించారని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పారు. దీంతో రైలు మిస్సందుందనే ఆందోళనతో అందరూ ఎక్సలేటర్ ద్వారా ప్లాట్ ఫాం వద్దకు వెళ్లేందుకు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగిందని ప్రయాణికులు తెలిపారు.

ప్రత్యక్ష సాక్షులు ఏమి చెప్పారు?

స్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తొక్కిసలాట జరిగిందని, ఊపిరాడక అనేక మంది ప్రయాణికులు స్పృహ కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరడానికి అక్కడ వేచి ఉన్నప్పుడు ప్లాట్‌ఫామ్ నంబర్ 14 ఇప్పటికే చాలా రద్దీగా ఉందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రైల్వే) ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా వచ్చాయని, ఈ రైళ్లలోని ప్రయాణికులు 12, 13 మరియు 14 ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఉన్నారని అధికారి తెలిపారు.

ప్రతి గంటకు 1,500 జనరల్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. “CMI ప్రకారం, ప్రతి గంటకు 1,500 జనరల్ టిక్కెట్లను రైల్వేలు అమ్మేవి, దీని కారణంగా స్టేషన్ రద్దీగా మారింది. ఇది నియంత్రించలేనిదిగా మారింది. “ప్లాట్‌ఫామ్ నంబర్ 14 వద్ద, ప్లాట్‌ఫామ్ నంబర్ 16 సమీపంలోని ఎస్కలేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది” అని డిసిపి తెలిపారు. రాత్రి 9.55 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది, దీంతో అధికారులు అత్యవసరంగా స్పందించారు.

ప్రయాణికులు ఒకరినొకరు తోసుకున్నారని, దీనివల్ల కొంతమందికి గాయాలు అయ్యాయని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు ఉపాధ్యాయ్ ఇంతకు ముందు చెప్పారు. వారిని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి 15 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి విలేకరులకు తెలిపారు. వారిలో ఇద్దరు తప్ప మిగతా వారందరినీ గుర్తించారు. దాదాపు 15 మంది గాయపడ్డారని, వారు చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు.

Stampede News : మృతులకు ప్రధాని మోదీ సంతాపం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) X లో ఒక పోస్ట్ లో మరణాలకు సంతాపం తెలిపారు. “న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోవడం క‌లిచివేసింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ తొక్కిసలాటలో గాయ‌ప‌డిన‌ వారందరికీ అధికారులు సహాయం చేస్తున్నారు” అని ప్రధానమంత్రి అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?